Political News

రాజ్య‌స‌భ సీటు.. అలీ కామెంట్ ఇదే!

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రి కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని  సినీ నటుడు అలీ చెప్పారు. ఇవాళ సీఎంతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని.. అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. సినీనటుడు, వైసీపీ నేత అలీ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు.  అతి త్వరలో పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందని వ్యాఖ్యానించారు. క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులను కలిశానని వెల్లడించారు.

ఏమీ ఆశించకుండానే పార్టీలోకి వచ్చానని.. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్‌ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని చెప్పారు. “2004లో వైఎస్ఆర్‌ పాదయాత్ర చేసిన తర్వాత కలిశాను. సీఎం జగన్‌తోనూ ముందు నుంచి పరిచయం ఉంది. ఇటీవల మా మ్యారేజ్‌ డే సందర్భంగా కలవాలని అనుకున్నాం. సీఎంకు అత్యవసర భేటీలు ఉండడం వల్ల కలవలేకపోయాం. సీఎంతో ఫోటో దిగాలని ఉందని నా భార్య ఎప్పటి నుంచో చెబుతోంది. ఇదే విషయం సీఎంతో చెబితే పర్లేదు తీసుకురమ్మన్నారు. గత ఎన్నికల్లో నాకు టికెట్‌ ఇస్తారని చెప్పడం వాస్తవం. రాజకీయాలకు సమయం కుదరదని నేనే వద్దని చెప్పా. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే క్షేత్రస్థాయిలో పట్టు ఉండాలి. ఒకసారి రాజకీయాల్లోకి వస్తే చిత్రీకరణలు పక్కన పెట్టాలి. సమయం కుదరకే గతంలో టికెట్‌ ఆఫర్‌ ఇచ్చినా రాలేకపోయా“ అని వ్యాఖ్యానించారు.

గత సాధారణ ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీ.. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక పదవిని ఆశిస్తోన్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇటీవల సినీ ప్రముఖులతో పాటు సీఎం జగన్‌ను అలీ కలిశారు. వారం రోజుల్లో కలుద్దామంటూ అప్పట్లో ఆయనకు సీఎం చెప్పారు. అప్పట్నుంచి అలీకి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎంతో అలీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ అలీ చేసిన వ్యాఖ్యలు.. ఆసక్తిని రేపుతున్నాయి.

పార్టీ పరగా తాను ఎప్పుడూ ఏమీ ఆశించలేదు అని స్పష్టం చేశారు. పదవుల కోసం వైసీపీలో చేరలేదు అని, పదవుల కోసం పని చేయలేదు అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే ఆయనతో తనకు పరిచయం ఉంది అని అన్నారు. తమది  చాలా పాత పరిచయం అని, సీఎం జగన్ తోనూ తనకు  పరిచయం ఉంది అని తెలిపారు. ఇవాళ‌ మర్యాద పూర్వకంగా మాత్రమే సీఎం ను కలిసినట్లు ఆయన తెలిపారు. అయితే.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న ఉంద‌ని చెప్ప‌డంతో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ప‌క్కా అని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 16, 2022 1:44 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

దేశంలో అత్యధిక ఓటర్లున్నది ఎక్కడో తెలుసా ?

140 కోట్ల ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద…

3 mins ago

ప్ర‌భాస్‌ను అడ‌గిందొక‌టి.. అత‌ను తీసుకుందొక‌టి

మంచు విష్ణు హీరోగా ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న క‌న్న‌ప్ప‌లో భారీ కాస్టింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్,…

52 mins ago

అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న వారి కలలు నిండకుండానే…

55 mins ago

నంధ్యాల ఎఫెక్ట్ : అల్లు అర్జున్ పై కేసు

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్న మామ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కాదని నంద్యాలలో తన…

2 hours ago

శ్రీకాళ‌హస్తిలో కాల‌ర్ ఎగ‌రేసేది ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రొక్క రోజు గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…

4 hours ago

యంగ్ అండ్ డేరింగ్ ఎంపీ.. హ్యాట్రిక్ ప‌క్కా!

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించిన నేత‌గా టీడీపీ ఎంపీ…

8 hours ago