Political News

అఖిలేష్ ఊ అంటే.. మాయావ‌తి ఊహూ అన్నారా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ర‌ణం హోరాహోరీగా సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు ముగిశాయి. అధికార బీజేపీ, స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మ‌ధ్య అక్క‌డ ప్ర‌ధానంగా పోరు న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీతో పాటు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తిని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల కోసం రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ (ఆర్ఎల్‌డీ)తో స‌హా కొన్ని చిన్న పార్టీల‌తో క‌లిసి అఖిలేష్ యాద‌వ్ కూట‌మి ఏర్పాటు చేశారు. త‌మ కూట‌మికి క‌చ్చితంగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో మాయావ‌తితో పొత్తు విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు కోసం ఆమెతో క‌లిసి చ‌ర్చించామ‌ని చెప్పారు. కానీ రాజ‌కీయ‌ప‌ర‌మైన కొన్ని కార‌ణాల వ‌ల్ల బీఎస్పీ అధినాయ‌కురాలు మాయావ‌తి అందుకు అంగీక‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీఎస్పీ క‌లిసి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ మ‌రోసారి క‌లిసి పోటీ చేస్తాయ‌ని అనుకున్నారు. కానీ అందుకు మాయావ‌తి ఒప్పుకోలేద‌ని తాజాగా అఖిలేష్ పేర్కొన్నారు. ఆమె బీజేపీకి బీ టీమ్‌గా ప‌నిచేస్తున్నార‌ని ఆయన విమ‌ర్శించారు. అందుకే ప‌శ్చిమ యూపీలో 40 చోట్ల బీఎస్పీ ముస్లిం అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింద‌ని అన్నారు. ఓట్లు చీల్చేందుకే ఇలా చేశార‌ని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ప్ర‌కార‌మే ముందుకు సాగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఎస్పీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ఇలాంటి కుట్ర‌ను ఆ పార్టీలు క‌లిసి అమ‌లు చేశాయ‌ని పేర్కొన్నారు. 

This post was last modified on February 16, 2022 8:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

19 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

4 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago