Political News

అఖిలేష్ ఊ అంటే.. మాయావ‌తి ఊహూ అన్నారా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ర‌ణం హోరాహోరీగా సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు ముగిశాయి. అధికార బీజేపీ, స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మ‌ధ్య అక్క‌డ ప్ర‌ధానంగా పోరు న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీతో పాటు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తిని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల కోసం రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ (ఆర్ఎల్‌డీ)తో స‌హా కొన్ని చిన్న పార్టీల‌తో క‌లిసి అఖిలేష్ యాద‌వ్ కూట‌మి ఏర్పాటు చేశారు. త‌మ కూట‌మికి క‌చ్చితంగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో మాయావ‌తితో పొత్తు విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు కోసం ఆమెతో క‌లిసి చ‌ర్చించామ‌ని చెప్పారు. కానీ రాజ‌కీయ‌ప‌ర‌మైన కొన్ని కార‌ణాల వ‌ల్ల బీఎస్పీ అధినాయ‌కురాలు మాయావ‌తి అందుకు అంగీక‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీఎస్పీ క‌లిసి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ మ‌రోసారి క‌లిసి పోటీ చేస్తాయ‌ని అనుకున్నారు. కానీ అందుకు మాయావ‌తి ఒప్పుకోలేద‌ని తాజాగా అఖిలేష్ పేర్కొన్నారు. ఆమె బీజేపీకి బీ టీమ్‌గా ప‌నిచేస్తున్నార‌ని ఆయన విమ‌ర్శించారు. అందుకే ప‌శ్చిమ యూపీలో 40 చోట్ల బీఎస్పీ ముస్లిం అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింద‌ని అన్నారు. ఓట్లు చీల్చేందుకే ఇలా చేశార‌ని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ప్ర‌కార‌మే ముందుకు సాగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఎస్పీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ఇలాంటి కుట్ర‌ను ఆ పార్టీలు క‌లిసి అమ‌లు చేశాయ‌ని పేర్కొన్నారు. 

This post was last modified on February 16, 2022 8:08 am

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

12 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

29 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

44 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago