Political News

అఖిలేష్ ఊ అంటే.. మాయావ‌తి ఊహూ అన్నారా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ర‌ణం హోరాహోరీగా సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు ముగిశాయి. అధికార బీజేపీ, స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మ‌ధ్య అక్క‌డ ప్ర‌ధానంగా పోరు న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీతో పాటు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తిని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల కోసం రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ (ఆర్ఎల్‌డీ)తో స‌హా కొన్ని చిన్న పార్టీల‌తో క‌లిసి అఖిలేష్ యాద‌వ్ కూట‌మి ఏర్పాటు చేశారు. త‌మ కూట‌మికి క‌చ్చితంగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో మాయావ‌తితో పొత్తు విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు కోసం ఆమెతో క‌లిసి చ‌ర్చించామ‌ని చెప్పారు. కానీ రాజ‌కీయ‌ప‌ర‌మైన కొన్ని కార‌ణాల వ‌ల్ల బీఎస్పీ అధినాయ‌కురాలు మాయావ‌తి అందుకు అంగీక‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీఎస్పీ క‌లిసి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ మ‌రోసారి క‌లిసి పోటీ చేస్తాయ‌ని అనుకున్నారు. కానీ అందుకు మాయావ‌తి ఒప్పుకోలేద‌ని తాజాగా అఖిలేష్ పేర్కొన్నారు. ఆమె బీజేపీకి బీ టీమ్‌గా ప‌నిచేస్తున్నార‌ని ఆయన విమ‌ర్శించారు. అందుకే ప‌శ్చిమ యూపీలో 40 చోట్ల బీఎస్పీ ముస్లిం అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింద‌ని అన్నారు. ఓట్లు చీల్చేందుకే ఇలా చేశార‌ని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ప్ర‌కార‌మే ముందుకు సాగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఎస్పీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ఇలాంటి కుట్ర‌ను ఆ పార్టీలు క‌లిసి అమ‌లు చేశాయ‌ని పేర్కొన్నారు. 

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

25 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

58 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

1 hour ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago