ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే టెన్షన్ ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణంగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సీఎం జగన్ ఆలోచనల ప్రకారం వెలువడుతున్న అధికారిక ఆదేశాలు. ఏపీ ముఖ్యమంత్రి పాలనను ప్రక్షాళన చేయాలని డిసైడయ్యారని, ఇందులో మొదటి ఫోకస్ తన టీంపైనే పెట్టారని అంటున్నారు.
అందులో భాగంగానే తాజా ఆదేశాలు వెలువడటం అని వివరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక బాధ్యతల్లోకి తన ఆలోచనలకు తగిన అధికారులను ఎంపిక చేసుకునన సంగతి తెలిసిందే. అయితే, అలాంటి అధికారులను ఇప్పుడు జగన్ బదిలీ చేస్తున్నారు.
సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు ఈ మేరకు షాక్ ఎదురైంది. ఆయన్ను ఢిల్లీకి, అందులోనూ అప్రధాన్య పోస్టుకు బదిలీ చేశారు. ఈ ఆదేశాలు వెలువడిన మరుసటిరోజే డీజీపీ గౌతమ్ సవాంగ్పై వేటు వేసేశారు జగన్. కీలకమైన ఉద్యోగుల పీఆర్సీ అంశమే ఈ ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీ నిర్ణయానికి కారణమని ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇరకాటంలో పడకుంఆ చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ సరైన రీతిలో వ్యవహరిచలేదని ఏపీ సీఎం భావించినట్లు సమాచారం. మరోవైపు లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో సవాంగ్ పనితనం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.
This post was last modified on February 16, 2022 8:04 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…