రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర సర్కారుకు కానీ పాలన వ్యవహారాలు చక్కబెట్టేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తడం సహజమే. ఆదాయం గురించి పట్టించుకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించడం ఆ సమస్యకు ప్రధాన కారణమని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఓట్ల కోసం నేతలు ఎంతకైనా వెనకాడడం లేదు. హామీలు గుప్పిస్తూ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు.
అభివృద్ధి పనులు ఆగినా.. పథకాలను మాత్రం ఆపడం లేదు. మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయి. దీంతో అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఆ అప్పులు ఒక పరిధిలోపు ఉంటే మంచిదే. కానీ అది దాటితేనే ప్రమాదం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అప్పులు చేయకపోతే పాలన సాగని పరిస్థితి అక్కడ ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను ఏపీ తాకట్టు పెడుతోంది. ఇక తెలంగాణ అయితే ఏకంగా ఆదాయం కోసం ప్రభుత్వ భూములను అమ్మేస్తోంది.
ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను ఏపీ ప్రభుత్వం రుణాల కోసం తాకట్టు పెట్టిందనే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా విజయవాడలోని ఎంతో విలువైన బెర్మా పార్కును తాకట్లు పెట్టి బ్యాంకు నుంచి అప్పు తెచ్చే ప్రక్రియ ప్రభుత్వం మొదలెట్టింది. ఇప్పటికే ఇలా ఎన్నో ప్రభుత్వ భూములు, ఆస్తులను వైసీపీ ప్రభుత్వం రుణాల కోసం తనఖా పెట్టింది. జగన్ చివరి సీఎం అనుకుంటున్నారేమో అందుకే అన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
ఇక తెలంగాణలో ప్రభుత్వ భూములను వేలం వేసి ఆదాయం పొందే తంతుకు కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడో తెరతీసింది. ఇప్పటికే హైదరాబాద్లో దాని చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో కొన్నింటిని అమ్మిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జిల్లాల్లోని విలువైన ప్రభుత్వ భూములపై కూడా కేసీఆర్ కన్నేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాల్లో నివాస స్థలాలకు దగ్గర్లో ఇళ్లు కట్టుకోవాడానికి అనుకూలంగా ఉన్నా భూములను ప్లాట్లు వేసి విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సాధ్యం కాని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భూములను కూడా విక్రయించాలని యోచిస్తోంది. ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.
This post was last modified on February 13, 2022 10:22 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…