రాబోయే ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి కావాలనే పట్టుదల ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ ప్రభుత్వం ఈ మధ్యనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందుపురం, రాజంపేట, ధర్మవరం, విజయవాడ లాంటి చోట్ల జిల్లాల కేంద్రాలను మార్చాలని, పేర్లను మార్చాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీలోనే అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకునేందుకు నెల రోజులు గడువిచ్చింది.
అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రస్తుత జిల్లాల కలెక్టర్లు తీసుకుని ఆచరణాత్మకంగా ఉన్న వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజా ప్రతినిధులు వస్తే వాళ్ళతో మాట్లాడాలని కూడా చెప్పింది. అలాంటి వాటిపై కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదికను అందించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇవన్నీ కూడా మార్చి 18వ తేదీలోగానే పూర్తయిపోవాలని డెడ్ లైన్ కూడా విధించింది.
మార్చి రెండోవారంలోగా ప్రక్రియ పూర్తయిపోతే మార్చి 17వ తేదీన మరో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. దీనికి అనుగుణంగానే మార్చి 18వ తేదీన జిల్లాల కలెక్టర్లు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీని ఆధారంగా ఏప్రిల్ 2వ తేదీ నుండి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అమల్లోకి వచ్చేస్తుంది. అంటే ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఖాయమని తేలిపోయింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించేంత వరకు ఇప్పటి కలెక్టర్లు, ఎస్పీలు, సిబ్బందే బాధ్యతలు చూస్తారు.
కొత్తవారిని నియమించిన తర్వాత పాత వారు బాధ్యతల నుండి రిలీవవుతారని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కొత్తగా ఏర్పడబోయే జిల్లాల్లో భవనాలు, భూములను గుర్తించటంలో ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు బిజీగా ఉన్నారు. జిల్లాల కలెక్టరేట్లలోని సిబ్బందినే రెండుగా విభజించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం మీద అభ్యంతరాలున్న చోట్ల ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఏదేమైనా కొత్త జిల్లాల ప్రక్రియ మాత్రం స్పీడుగానే జరిగిపోతోంది.
This post was last modified on February 12, 2022 2:03 pm
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…