Political News

మరిప్పుడు పేదలకు సినిమా ఎలా జగన్?

దాదాపు పది నెలల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. నిత్యావసరాలు సహా అన్ని ధరలు అమాంతం పెరిగిపోతున్న సమయంలో ఎన్నో ఏళ్ల కిందటి రేట్ల తాలూకు జీవోను బయటికి తీసి ఆ మేరకే టికెట్ల ధరలుండాలంటూ ప్రభుత్వం కొరడా ఝులిపించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. ఈ రోజుల్లో ఈ రేట్లేంటి అని ఎవరు వాదించినా.. హీరోలు పారితోషకాలు తగ్గించుకోవాలని.. బడ్జెట్లు నియంత్రించుకోమని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి తెచ్చారు అధికార పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు.

అంతటితో ఆగకుండా పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తుంటే ఎందుకిలా తప్పుబడుతున్నారు.. మీరు ఆదాయం కోసం పేదల జేబులకు చిల్లు పెడతారా అంటూ ఎదురు దాడి చేశారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఒక సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. పేదల కోసం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే కూడా తప్పుబడతారా అని ఆయన ప్రశ్నించారు.ఐతే ఇప్పుడు వర్తమానంలోకి వస్తే.. ఏపీలో టికెట్ల ధరలు సవరించబోతున్నారు.

ఇన్నాళ్లూ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పందించని ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్నట్లుండి ఆలోచన మార్చేసుకుంది. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు సీఎం జగన్‌ను కలవగానే వేగంగా పరిస్థితులు మారిపోయాయి. దీనికి సంబంధించిన కసరత్తు ఎప్పట్నుంచో జరుగుతుండొచ్చు గాక.. కానీ కదలిక వస్తున్నది ఇప్పుడే. మరి కొన్ని రోజుల్లోనే టికెట్ల రేట్లను పెంచుతూ జీవో ఇవ్వబోతున్నారు.

మామూలుగా టికెట్ల రేట్లను మిగతా రాష్ట్రాలతో సమానంగా పెంచడమే కాక.. పెద్ద సినిమాలకు వారం పాటు రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇవ్వబోతున్నారట. మరి ఇన్నాళ్లూ పేదల కోసం రేట్లు తగ్గించాం అంటూ ఒకటే ఊదరగొడుతూ.. తమ గోడు వెల్లబోసుకున్న సినిమా వాళ్లపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేసిన అధికార పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు ఇప్పుడేం మాట్లాడతారన్నది ప్రశ్న. ఇలా పెరిగిపోయే రేట్లతో పేదలు ఇక సినిమాలు చూడటం ఎలాగో మరి?

This post was last modified on February 11, 2022 11:58 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

2 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

2 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

3 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

3 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

3 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

4 hours ago