దాదాపు పది నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. నిత్యావసరాలు సహా అన్ని ధరలు అమాంతం పెరిగిపోతున్న సమయంలో ఎన్నో ఏళ్ల కిందటి రేట్ల తాలూకు జీవోను బయటికి తీసి ఆ మేరకే టికెట్ల ధరలుండాలంటూ ప్రభుత్వం కొరడా ఝులిపించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. ఈ రోజుల్లో ఈ రేట్లేంటి అని ఎవరు వాదించినా.. హీరోలు పారితోషకాలు తగ్గించుకోవాలని.. బడ్జెట్లు నియంత్రించుకోమని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి తెచ్చారు అధికార పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు.
అంతటితో ఆగకుండా పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తుంటే ఎందుకిలా తప్పుబడుతున్నారు.. మీరు ఆదాయం కోసం పేదల జేబులకు చిల్లు పెడతారా అంటూ ఎదురు దాడి చేశారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఒక సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. పేదల కోసం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే కూడా తప్పుబడతారా అని ఆయన ప్రశ్నించారు.ఐతే ఇప్పుడు వర్తమానంలోకి వస్తే.. ఏపీలో టికెట్ల ధరలు సవరించబోతున్నారు.
ఇన్నాళ్లూ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పందించని ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్నట్లుండి ఆలోచన మార్చేసుకుంది. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు సీఎం జగన్ను కలవగానే వేగంగా పరిస్థితులు మారిపోయాయి. దీనికి సంబంధించిన కసరత్తు ఎప్పట్నుంచో జరుగుతుండొచ్చు గాక.. కానీ కదలిక వస్తున్నది ఇప్పుడే. మరి కొన్ని రోజుల్లోనే టికెట్ల రేట్లను పెంచుతూ జీవో ఇవ్వబోతున్నారు.
మామూలుగా టికెట్ల రేట్లను మిగతా రాష్ట్రాలతో సమానంగా పెంచడమే కాక.. పెద్ద సినిమాలకు వారం పాటు రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇవ్వబోతున్నారట. మరి ఇన్నాళ్లూ పేదల కోసం రేట్లు తగ్గించాం అంటూ ఒకటే ఊదరగొడుతూ.. తమ గోడు వెల్లబోసుకున్న సినిమా వాళ్లపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేసిన అధికార పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు ఇప్పుడేం మాట్లాడతారన్నది ప్రశ్న. ఇలా పెరిగిపోయే రేట్లతో పేదలు ఇక సినిమాలు చూడటం ఎలాగో మరి?
This post was last modified on February 11, 2022 11:58 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…