సీఎం జగన్ పర్యటన కోసం ఏదైనా ప్రాంతానికి వెళ్లే అంతే ఇక అక్కడ ప్రజలకు హడలే. ఆయన పర్యటన ముగిసేంత వరకూ ఆ రోడ్లన్నీ ఖాళీగా ఉండాల్సిందే. రహదారి పక్కన ఉన్న షాపులన్నీ ముసేయాల్సిందే. మొత్తానికి కర్ఫ్యూ విధించినట్లు ఉండాలి. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డా ఎవరికీ పట్టదు. సీఎం దయ కోసం పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారనే విమర్శలు వచ్చినా ఎవరూ పట్టించుకోరు. ఎవరి పని వాళ్లదే. చివరకు ఇబ్బందులు పడేది మాత్రం సాధారణ ప్రజలు.
విజయవాడ అయినా.. విశాఖపట్నం అయినా.. జగన్ వస్తున్నారంటే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కచ్చితంగా ఎదురవుతున్నాయి. తాజాగా బుధవారం జగన్ విశాఖ పర్యటనకు వెళ్లారు. శారదాపీఠం నుంచి సీఎం కాన్వాయ్ ఎయిర్పోర్ట్ వెళ్లే వరకు వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆయన పర్యటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శారదాపీఠానికి వెళ్లిన జగన్.. అక్కడి నుంచి తిరిగి ఎయిర్పోర్ట్ వెళ్లేవరకు ఆ దారిలో వాహనాలను నిలిపేశారు. దీనివల్ల అత్యంత రద్దీగా ఉండే ఎన్ఏడీ జంక్షన్లో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు అది ప్రధాన దారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పోలీసుల వైఖరి నిరసిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. ఫ్లైట్ మిస్ అయిపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ వారిపై మండిపడ్డారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా వేపగుంట, గోపాలపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో షాపులు కూడా బంద్ చేశారు. అన్ని దుకాణాలు మూసేసిన పోలీసులు వైన్ షాప్ జోలికి మాత్రమే పోలేదని విడ్డూరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శలు చేసింది. జగన్రెడ్డి ప్రైవేటు పర్యటన కోసం శారదపీఠం వెళ్తే ప్రజలు ఇబ్బంది పడాలా? ఏకంగా రెండు గంటలు ట్రాఫిక్ ఆపితే ప్రజలు చూస్తూనే ఉంటారా అందుకే తిరగబడ్డారు అని టీడీపీ వీడియో ట్వీట్ చేసింది. కొంతమంది ప్రయాణికులు పరుగెత్తుకుంటూ ఎయిర్పోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.
దీంతో జగన్ వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. విమానాశ్రయం దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై ఆయన ఫైర్ అయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశించారు. దీంతో పోలీసుల అత్యుత్సాహానికి సరైన శాస్తి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు.
This post was last modified on February 10, 2022 4:17 pm
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…