Political News

మోదీ కాళ్లపై పడి.. జగన్ అలా చేస్తే..

ఆంధ్రప్రదేశ్ విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతోంది. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సాక్ష్యాత్తూ మోడీ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం ..అసలు తనది ఏపీనే కాదన్నట్టుగా నో కామెంట్స్ అంటున్నారు.

ఈ క్రమంలోనే జగన్ వైఖరిపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి షాకింగ్ కామెంట్లు చేశారు. జరిగిన నష్టంపై ఏపీ నేతలు కోర్టుకెళ్లరని, పార్లమెంటులో అడగరని, ఇంత దమ్ములేని పరిస్థితికి వచ్చామా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ఓ నోటీసు ఇవ్వడానికి దమ్ములేదా? అని ప్రశ్నించారు.

మోడీకి పాదాభివందనం చేస్తూనే…అయ్యా మీరన్న మాటే కదా…పార్లమెంటులో చర్చిద్దాం..అని అడగాలని జగన్ కు హితవు పలికారు.  పార్లమెంటులో చర్చ జరిగితే అన్నీ బయటకు వస్తాయి…అని అన్నారు. రాష్ట్ర విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఏపీ అంటే కేంద్రానికి అంత అలుసా? అని ఉండవల్లి ప్రశ్నించారు.

రాబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని, ప్రాంతీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ఏపీని  కాంగ్రెస్, బీజేపీలు విడగొట్టాయని ఉండవల్లి మండిపడ్డారు. ఏపీలోని పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయని, రాష్ట్ర సమస్యలపై వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే విద్యుత్‌ కోతలు ఇలా ఉంటే…వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఏమిటో తెలియడంలేదని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

5 hours ago