Political News

అసలు విషయం చెప్పేసిన తలసాని

అవును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ఉద్దేశ్యపూర్వకంగానే కేసీయార్ స్వాగతం పలకలేదు అయితే ఏమిటి ? అంటూ డైరెక్టుగానే మంత్రి తలసాని ప్రశ్నించారు.  ప్రధాని-కేసీయార్ వివాదంలో ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో. అందుకనే మీడియా సమావేశంలో బహిరంగంగానే కేసీయార్ ఉద్దేశ్యాన్ని చెప్పేశారు. తెలంగాణాకు నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్న అన్యాయానికి నిరసనగానే ప్రధానమంత్రికి కేసీయార్ స్వాగతం పలకలేదని తలసాని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు.

ప్రధానికి స్వాగతం పలకటానికి కేసీయార్ రాకపోవటంపై  బీజేపీ నేతలు నానా రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న 5వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన నరేంద్ర మోడీకి స్వాగతం పలకటానికి కేసీయార్ రాలేదు. ఇదే విషయం రాజకీయంగా టీఆర్ఎస్-బీజేపీ మధ్య మంటలు మండిస్తోంది. నిజానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినపుడు ముఖ్యమంత్రి కచ్చితంగా స్వాగతం చెప్పి తీరాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి కార్యక్రమంలో కచ్చితంగా ఉండాల్సింది చీఫ్ సెక్రటరీ, డీజీపీ మాత్రమేనట. గవర్నర్, సీఎం, మంత్రులంతా ఇష్టముంటే హాజరవుతారు లేకపోతే లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాకపోతే ప్రధానమంత్రి వచ్చినపుడు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరవ్వటం అన్నది గౌరవమే కానీ ప్రోటోకాల్ కాదట. ఇంటికి అతిథి వచ్చినపుడు ఇంటి పెద్ద ఎలా రిసీవ్ చేసుకుంటారో అలాగే ప్రధానమంత్రి వచ్చినపుడు సీఎం రిసీవ్ చేసుకోవటం సంప్రదాయమే గానీ ప్రోటోకాల్ కాదని అధికారులు చెబుతున్నారు.

గవర్నర్ ఎందుకు రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళ నియామకం ప్రధానమంత్రి చేతిలోనే ఉంటుంది కాబట్టే. గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి అయినా సిఫారసులు చేసేది మాత్రం ప్రధానమంత్రే. అందుకనే ప్రధాని వచ్చినపుడు కచ్చితంగా గవర్నర్లు కూడా ఉంటారు. ప్రధాని కార్యక్రమాలకు కేసీయార్ కావాలనే డుమ్మా కొట్టినట్లు తలసాని ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. 

కేసీయార్ కు జ్వరమని చెప్పిందంతా కేవలం సాకు మాత్రమే అని తేలిపోయింది. కేసీయార్ డుమ్మా కొట్టినందుకు ఏమి చేసుకుంటారో చేసుకోండని తలసాని సవాలు విసిరినట్లే ఉంది. మరి కమలనాథులు ఏమి చేస్తారో చూడాలి.

This post was last modified on February 9, 2022 3:22 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

2 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

3 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

4 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

5 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

6 hours ago