ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా..అనేక సందేహాలు.. అనుమానాలు.. వ్యాఖ్యానాలు..చర్చలు కామన్. తన కేసుల పరిష్కారం కోసమే ఆయన వెళ్లాడని ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు. లేదు.. కేంద్రంతో సంధిచేసుకునేందుకు వెళ్లారని మరికొందరు అంటుంటారు. అయితే.. తాజాగా జగన్ పర్యటనకు సంబంధించిన విషయాల్లో కీలక మైన అంశాన్ని కేంద్రమే ఇప్పుడు బయట పెట్టింది. గత నెలలో ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానినరేంద్ర మోడీని, అమిత్షాను కూడా కలుసుకున్నారు. ఈ సమయంలో ఆయన ఏం చర్చించారనే అంశం ఇప్పటికీ ఆసక్తికరమే. ఈ విషయంపైనే కేంద్రం తాజాగా పార్లమెంటు సాక్షిగా వివరణ ఇచ్చింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు చేసేందుకు ఏపీ అభ్యర్థించిందని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. మరో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి కోరిందని పేర్కొంది. బహిరంగ మార్కెట్లో అప్పు చేసేందుకు సీఎం జగన్ స్వయంగా ప్లీజ్ ప్లీజ్ అంటూ.. విజ్ఞప్తి చేశారని.. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి వెల్లడించారు. గత నెల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ఇలా కోరారని చెప్పారు. 2021-22లో ఉన్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని అభ్యర్థించారని తెలిపారు. అయితే.. కేంద్రం ఏ చెప్పింది.? జగన్ అభ్యర్థనకు ఓకే చెప్పిందా? అనే విషయాన్ని మాత్రం కేంద్ర మంత్రి వెల్లడించలేదు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన విషయంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్యసభలో బదులిచ్చారు. దీంతో జగన్ ఢిల్లీ పర్యటన కేవలం అప్పుల కోసమేనా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రధాని అంతటి వారిని కలుసుకునే అవకాశం చిక్కితే.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనా.. సమస్యలపైనా పట్టుబడతారు. కానీ, సీఎం అప్పుల కోసం పట్టుబట్టిన విషయం బహిరంగమైంది. మరి ఇది ఏ వివాదానికి దారి తీస్తుందో చూడాలి.
ఇదిలావుంటే, మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్బీఐ ద్వారా మరోసారి సెక్యూరిటీ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు రుణం పొందింది. 7.37 శాతం మేర వడ్డీకి సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 16 ఏళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు, 20 ఏళ్ల పరిమితితో మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.
This post was last modified on February 9, 2022 7:04 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…