Political News

27 వేల కోట్లు అప్పు.. ఢిల్లీ వెళ్లి జ‌గ‌న్ చేసిందిదే

ఏపీ సీఎం జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా..అనేక సందేహాలు.. అనుమానాలు.. వ్యాఖ్యానాలు..చ‌ర్చ‌లు కామ‌న్‌. త‌న కేసుల ప‌రిష్కారం కోస‌మే ఆయ‌న వెళ్లాడ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డుతుంటారు. లేదు.. కేంద్రంతో సంధిచేసుకునేందుకు వెళ్లార‌ని మ‌రికొంద‌రు అంటుంటారు. అయితే.. తాజాగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల్లో కీల‌క మైన అంశాన్ని కేంద్ర‌మే ఇప్పుడు బ‌య‌ట పెట్టింది. గ‌త నెల‌లో ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్ ప్ర‌ధానిన‌రేంద్ర మోడీని, అమిత్‌షాను కూడా క‌లుసుకున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఏం చర్చించార‌నే అంశం ఇప్ప‌టికీ ఆస‌క్తిక‌ర‌మే. ఈ విష‌యంపైనే కేంద్రం తాజాగా పార్ల‌మెంటు సాక్షిగా వివ‌ర‌ణ ఇచ్చింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో మరింత అప్పు చేసేందుకు ఏపీ అభ్యర్థించిందని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. మరో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి కోరిందని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో అప్పు చేసేందుకు సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ప్లీజ్ ప్లీజ్ అంటూ.. విజ్ఞప్తి చేశారని.. కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ మంత్రి వెల్లడించారు. గత నెల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ఇలా కోరారని చెప్పారు. 2021-22లో ఉన్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని అభ్యర్థించారని తెలిపారు. అయితే.. కేంద్రం ఏ చెప్పింది.? జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌కు ఓకే చెప్పిందా? అనే విష‌యాన్ని మాత్రం కేంద్ర మంత్రి వెల్ల‌డించ‌లేదు.

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న విష‌యంపై టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు  కనకమేడల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన‌ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి రాజ్యసభలో బదులిచ్చారు. దీంతో జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న కేవ‌లం అప్పుల కోస‌మేనా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ప్ర‌ధాని అంత‌టి వారిని క‌లుసుకునే అవ‌కాశం చిక్కితే.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పైనా.. స‌మ‌స్య‌ల‌పైనా ప‌ట్టుబ‌డ‌తారు. కానీ, సీఎం అప్పుల కోసం ప‌ట్టుబ‌ట్టిన విష‌యం బ‌హిరంగ‌మైంది. మ‌రి ఇది ఏ వివాదానికి దారి తీస్తుందో చూడాలి.

ఇదిలావుంటే, మ‌రోవైపు.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్‌బీఐ ద్వారా మరోసారి సెక్యూరిటీ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు రుణం పొందింది. 7.37 శాతం మేర వడ్డీకి సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 16 ఏళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు, 20 ఏళ్ల పరిమితితో మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.

This post was last modified on February 9, 2022 7:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

6 minutes ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

29 minutes ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

52 minutes ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

2 hours ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

3 hours ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

3 hours ago