ఏపీలో ఇప్పుడు కరెంటు కోతలు పెరిగిపోయాయి. పట్టణాలు, నగరాల్లో ఒక విధమైన పరిస్థితి ఉంటే.. గ్రామాల్లో మాత్రం రోజుల తరబడి కరెంటు లేకుండా పోయింది. నిజానికి గడిచిన రెండేళ్లలో ఇదే ఇలా జరగడం. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు.. పంపిణీ సంస్థలు అప్పులు చెల్లించకపోవడమే! కనీసం 30 కోట్లయినా.. ఇస్తే.. విద్యుత్ను పంపిణీ చేస్తామని.. చెప్పినా.. ప్రభుత్వం ఆమేరకు కూడా నిధులు ఇవ్వలేకపోయింది. పలితంగా రాష్ట్రంలో ఇప్పడు విద్యుత్ కోతలు షరా మామూలే అన్న విధంగా తయారయ్యాయని అంటున్నారు పరిశీలకులు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ననుంచి డిస్కంలు తీసుకుంటాయి. ఈ క్రమంలో బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం వల్లే సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు రూ.350 కోట్ల బకాయి పడ్డాయి. వీటికోసం ఎన్టీపీసీ వర్గాలు రెండు నెలలుగా డిస్కంల కు లేఖలు రాస్తున్నాయి. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్ను నిలిపేశారు.
ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్లో కొనేందుకూ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్ చేశారు. డిస్కంలు రెండు రోజులుగా కోతలు విధించాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్ను డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు రూ.350 కోట్లను డిస్కంలు బకాయి పడ్డాయి. కనీసం రూ.30 కోట్లు చెల్లించాలని అడిగినా, డిస్కంలు అదీ చెల్లించలేదు.
ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిందని సమాచారం. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకా రం బకాయిలు చెల్లించనందున బహిరంగ మార్కెట్ కొనుగోలుకు అవకాశం లేదు. దీంతో 3వేల మెగావాట్ల కొరత ఏర్పడింది. దీని సర్దుబాటుకు జెన్కో థర్మల్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి పెంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హిందుజా పవర్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిస్కంలు విద్యుత్ తీసుకోవాల్సి వచ్చింది. సుమారు 500 మెగావాట్లు అక్కడి నుంచి అందుబాటులోకి వచ్చింది.
రాష్ట్రంలో డిమాండ్ 170.542 మిలియన్ యూనిట్లకు, పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కోత విధించడంతో 24 ఎంయూలకు డిమాండ్ తగ్గినా కోతలు అనివార్యమయ్యాయి. డిస్కంలు మరో 22.38 ఎంయూలను కోతల రూపేణా సర్దుబాటు చేశాయి. పీక్ డిమాండ్ సమయంలో వంతుల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో 2-3 గంటల పాటు కోతలు విధించాయి. ఏదేమైనా కనీసం 30 కోట్లయినా చెల్లించి ఉంటే పరిస్థిత మరో విదంగా ఉండడేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 5, 2022 2:36 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…