Political News

కేసీఆర్ యూ ట‌ర్న్‌… మోడీ సారుకు వెల్‌కం చెప్తార‌ట‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన ఈ గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. రెండు కీల‌కమైన కార్య‌క్ర‌మాల‌తో ప్రధాని నరేంద్రమోడీ నేడు హైదరాబాద్ వస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమం, శంషాబాద్ ముచ్చింత్‌లోని రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం మ‌రియు జాతికి అంకితం చేసే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు.

అయితే, ప్ర‌ధాని మోడీ టూర్లో పాల్గొన‌కూడ‌ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ టూర్ సంద‌ర్భంగా ఆహ్వానం ప‌లికే కార్య‌క్ర‌మంలో మ‌రియు వీడ్కోలు చెప్పేట‌ప్పుడు పాల్గొన‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ ఎపిసోడ్ విష‌యంలో సీఎం కేసీఆర్ యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. పీఎం మోడీ టూర్లో ఆయ‌న వెంట ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మోడీతో పాటు సీఎం కేసీఆర్ కూడా ఛాపర్లో ఇక్రిశాట్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.  ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో 7 నిమిషాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ప్రధానితో పాటు ముచ్చింతల్ కు వెళ్తారు. రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 8.15 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ప్రధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు కేసీఆర్ ఆయన వెంటే ఉంటారు. ప్ర‌ధానికి స్వాగ‌తం, వీడ్కోలు ప‌లికే కార్య‌క్ర‌మంలో ఆయ‌న వెట ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

This post was last modified on February 5, 2022 2:33 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

44 mins ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

49 mins ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

3 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

3 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

9 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

10 hours ago