నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కి కరోనా సోకింది. ఈయన వయసు 67 సంవత్సరాలు. నాలుగు రోజులుగా ఆయనకు ఒంట్లో నలతగా ఉందని… ఎందుకైనా మంచిదని ఆయనకు, భార్యకు పరీక్షలు చేయించారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. భార్యకు మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో వారిద్దరిని హైదరాబాదుకు తరలించారు.
ఇటీవలే జగనాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్యకు మరో నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
రాజకీయ నాయకులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. శనివారం బాజిరెడ్డి గోవర్దన్ డిచ్ పల్లి మండలం బీబీపూర్ తండాలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలోను పాల్గొన్నారు. ఇందులో వందల మంది జనం పాల్గొన్నారు. హాజరైన వారిలో లబ్ధిదారులతో పాటు అధికారులు, నేతలు, పలువురు స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఎటువంటి సభలు, సమావేశాలు జరపవద్దని స్పష్టంగా చెబుతున్నా ఎవరు వినడం లేదు.
ఇపుడు ఈయనకు పాజిటివ్ వచ్చింది. నిన్నటి సమావేశానికి హాజరైన వారి పరిస్థితి ఏమిటి? ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకపోయినా జరుగుతుంది కదా.. ఎందుకు ఆయన ప్రమాదంలో పడి, ప్రజలను కూడా ప్రమాదంలోకి నెట్టాలి. నేతలు ఇలా చేస్తే జనం ఊరుకుంటారా? సమావేశానికి వచ్చిన వారందరినీ ఇపుడు క్వారంటైన్ కి తరలించారట. ఎమ్మెల్యే వచ్చినపుడు చాలా మంది స్థానికులు అక్కడికి చేరుకుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి?
అందుకే నేతలు కొన్ని నెలలు ఇలాంటి జనసమ్మర్థ కార్యక్రమాలను దూరంగా పెడితే అందరికీ మంచిది.
This post was last modified on June 14, 2020 7:30 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…