Political News

కరోనాతో కరచాలనం – మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పాజిటివ్

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కి కరోనా సోకింది. ఈయన వయసు 67 సంవత్సరాలు. నాలుగు రోజులుగా ఆయనకు ఒంట్లో నలతగా ఉందని… ఎందుకైనా మంచిదని ఆయనకు, భార్యకు పరీక్షలు చేయించారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. భార్యకు మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో వారిద్దరిని హైదరాబాదుకు తరలించారు.

ఇటీవలే జగనాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్యకు మరో నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

రాజకీయ నాయకులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. శనివారం బాజిరెడ్డి గోవర్దన్ డిచ్ పల్లి మండలం బీబీపూర్ తండాలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలోను పాల్గొన్నారు. ఇందులో వందల మంది జనం పాల్గొన్నారు. హాజరైన వారిలో లబ్ధిదారులతో పాటు అధికారులు, నేతలు, పలువురు స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఎటువంటి సభలు, సమావేశాలు జరపవద్దని స్పష్టంగా చెబుతున్నా ఎవరు వినడం లేదు.

ఇపుడు ఈయనకు పాజిటివ్ వచ్చింది. నిన్నటి సమావేశానికి హాజరైన వారి పరిస్థితి ఏమిటి? ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకపోయినా జరుగుతుంది కదా.. ఎందుకు ఆయన ప్రమాదంలో పడి, ప్రజలను కూడా ప్రమాదంలోకి నెట్టాలి. నేతలు ఇలా చేస్తే జనం ఊరుకుంటారా? సమావేశానికి వచ్చిన వారందరినీ ఇపుడు క్వారంటైన్ కి తరలించారట. ఎమ్మెల్యే వచ్చినపుడు చాలా మంది స్థానికులు అక్కడికి చేరుకుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి?

అందుకే నేతలు కొన్ని నెలలు ఇలాంటి జనసమ్మర్థ కార్యక్రమాలను దూరంగా పెడితే అందరికీ మంచిది.

This post was last modified on June 14, 2020 7:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

30 minutes ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

1 hour ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

2 hours ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

4 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

6 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

9 hours ago