టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై అనేక కేసులు ఉన్నాయి. వీటి లోనూ ప్రధానంగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం14 అట్రాసిటీ కేసులు ఉన్నాయ ని.. ఆయనే స్వయంగా చెప్పారు. అంతేకాదు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన ఒక ఎస్సీ కాలనీకి వెళ్లి.. “దళితులు మీకెందుకురా.. రాజకీయాలు` అని కామెంట్ చేసినట్టు అప్పట్లో ప్రత్యర్థి పక్షం సహా మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
ఈ విషయంపై తాజాగా ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై ఎస్సీకేసులు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే.. గతంలో తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. దళితులను తాను ఎప్పుడూ అలా అనలేదని.. శిలాఫలకాలను ధ్వంసం చేసినప్పుడు.. తాను దళితుల గ్రామంలోకి వెళ్లానని… ఈ సందర్భంగా వారికి.. “శిలా ఫలకాలను ధ్వంసం చేయడం మీకెందుకు.. ఇది రాజకీయాలకు సంబందించిన విషయం.. మీరు జోక్యం చేసుకోవద్దు!“ అని హెచ్చరించిన మాట వాస్తవమేనని చెప్పారు.
తాను దళితులకు కానీ, ఇతర వర్ణాలకు కానీ.. వ్యతిరేకం కాదని చింతమనేని చెప్పుకొచ్చారు. తనఇంట్లో నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం.. భోజనం అందరికీ అందుబాటులో ఉంటుంది.. అన్ని వర్ణాలవారు.. తన ఇంటికి ఏదో ఒక పనిపై వస్తుంటారని.. అయితే… ఏ ఒక్కరినీ కూడా.. తాను వ్యతిరేక భావంతో చూసేది లేదని.. అందరికీ ఒకేవిధమైన టిఫెన్, భోజనం పెడతానని చింతమనేని వివరించారు. ఇక, తమ సొంత గ్రామం దుగ్గిరాలలో దళితులదే ఆధిపత్యమని.. 1800 ఓట్లు ఉన్న ఆ గ్రామంలో 1400 ఓట్లు .. దళితులవేనని.. చెప్పారు.
అయినప్పటికీ వారు తన తండ్రిని పంచాయతీ ఎన్నికల్లో గెలిపించారని.. దళితులతోనే తన రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయని.. చింతమనేని వివరించారు. తనపై చేసిన అనేక దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటేనని అన్నారు.
This post was last modified on February 1, 2022 11:47 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…