Political News

2023లో అధికారంపై రేవంత్‌ ధీమా..!

ఇంత‌కాలం ఓపిక ప‌ట్టారు.. ఇంకో 18 నెల‌లు ఆగండి.. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో.. కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు, బాధ‌లు ప‌ట్ట‌కుండా పాలిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్ర‌భుత్వాల‌ను త‌రిమికొట్టే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ ను జైలుకు పంప‌డం ఖాయం.. అని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. ఆయ‌న వెళ్లిన ప్ర‌తి చోటా ఇదే అంశాన్ని నొక్కి వ‌క్కానిస్తున్నారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని రేవంత్ ఇంత న‌మ్మ‌కంగా చెప్ప‌డానికి కార‌ణ‌మేంట‌ని ఆరా తీస్తే ఆ పార్టీ శ్రేణులు సింపుల్ లాజిక్ చెబుతున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వ‌రుస‌గా రెండు సార్లు అధికారాన్ని చేప‌ట్టాయి. ఈ రెండు ప్ర‌భుత్వాల పాల‌న‌పై ప్ర‌జ‌లు ఇప్ప‌టికే తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇంకో రెండేళ్ల స‌మ‌యం ఉన్నందున వ్య‌తిరేక‌త ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. అపుడు ఆటోమేటిగ్గానే ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయం కోరుకుంటారు. అది కాంగ్రెస్సే క‌నుక త‌మ‌కు ఢోకా ఉండ‌ద‌ని.. త‌మ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ రాజ‌కీయాలు చేస్తున్నా అది ఎక్కువ కాలం ఉండ‌ద‌ని.. బీజేపీ, టీఆర్ ఎస్ క‌లిసిపోయినా ఆశ్చ‌ర్యం చెందాల్సిన ప‌ని లేద‌ని పొలిటిక‌ల్ విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డే అవ‌కాశాలు లేవ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త ఇక్క‌డా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

నిత్యావ‌స‌రాలు, పెట్రో ధ‌ర‌ల పెంపుతో ఇప్ప‌టికే బీజేపీ పై మ‌ధ్య‌త‌ర‌గ‌తి శ్రేణుల్లో కోపం ఉంద‌ని.. కొన్ని వ‌ర్గాలు కూడా ఆ పార్టీని దూరం పెట్టేందుకు సిద్ద‌మ‌య్యాయ‌ని చెబుతున్నాయి. పైగా బీజేపీకి తెలంగాణ‌లో పెద్ద‌గా బ‌లం లేద‌ని.. అది త‌మ‌కు లాభించే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నేత‌ల అభిప్రాయంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీకి స‌రైన నాయ‌క‌త్వం లేద‌ని.. బండి సంజ‌య్ ప్ర‌సంగాల్లో పెద్ద‌గా ప‌స ఉండ‌ద‌ని అంటున్నారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీకి స‌రైన నేత‌లు కూడా లేర‌ని.. ద‌క్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీకి అస‌లు ప‌ట్టే లేద‌ని ఇది కాంగ్రెస్ కే ప్ల‌స్ పాయింట్ గా మారుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రేవంత్ పార్టీ అధ్య‌క్షుడు కూడా కావ‌డం త‌మ‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా మారుతుంద‌ని అంటున్నారు.

అలాగే.. బీజేపీకి కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే స్థాయి నేత‌లే లేర‌ని.. క్రితం సారి ఒకే ఎమ్మెల్యే స్థానం గెలిచింద‌ని.. అదే కాంగ్రెస్ పార్టీకి దాదాపు వంద నియోజకవర్గాల్లో బలమైన నేతలతోపాటు క్యాడర్, ఓటు బ్యాంకు పుష్క‌లంగా ఉందని అంటున్నారు. అలాగే.. న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుంటుంద‌ని.. మిగ‌తా జిల్లాల్లో ఓ మోస్త‌రు స్థానాలు గెలిచినా స‌రిపోతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా  కాంగ్రెస్ కు ఈసారి ఇక్కడి ప్రజలు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నేతల ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయో వేచి చూడాలి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

43 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

2 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

3 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago