మరోసారి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు క్షమాపణలు చెప్పారు. ముందు నోరుపారేసుకోవటం తర్వాత క్షమాపణలు చెప్పటం వీర్రాజుకు బాగా అలవాటైపోయింది. ఇపుడు వీర్రాజు ఎందుకు క్షమాపణలు చెప్పారు ? ఎందుకంటే ప్రాణాలు తీసేవారికి ఎయిర్ పోర్టు ఎందుకు ? అంటు వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకు ప్రాణాలు తీయటం మాత్రమే వచ్చు. అంటు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
వీర్రాజు చేసిన కామెంట్లపై వైసీపీ నుండే కాకుండా వామపక్షాల నేతలు, ప్రజాసంఘాల నుండి కూడా తీవ్రస్ధాయిలో వ్యతిరేకత వస్తోంది. దీంతో జరిగిన డ్యామేజీని ఆలస్యంగా గుర్తించిన వీర్రాజు ముందు తన వ్యాఖ్యలను మీడియా, ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయంటు మండిపడ్డారు. అయితే ఆయన మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాంతో బుకాయించటం కష్టమని అర్ధమైపోయి, ఇక లాభం లేదని చివరకు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్నారు.
తన వ్యాఖ్యలతో బాధపడిన రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు వీర్రాజు ప్రకటించారు. పైగా కడపలో ఎయిర్ పోర్టు నరేంద్రమోడి ఏర్పాటు చేసిందంటు అబద్ధాలు చెప్పారు. కడపలో ఎయిర్ పోర్టు దశాబ్దాలుగా ఉన్న విషయం కూడా వీర్రాజుకు తెలీకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఆ మధ్య చీఫ్ లిక్కర్ పై మాట్లాడుతు తాము అధికారంలోకి వస్తే చీపులిక్కర్ రు. 50 కే అందిస్తామన్నారు. కాబట్టి రాష్ట్రంలోని కోటిమంది తాగుబోతులు తమపార్టీకే ఓట్లేయాలని పిలుపుకూడా ఇచ్చారు.
చీపులిక్కర్ ధరలపై వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. దాంతో ముందు తన మాటలను వక్రీకరించారని అన్నా చివరకు ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్నారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే నోటికొచ్చింది ఏదోకటి మాట్లాడేస్తున్నారని. వెనకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం తర్వాత వివాదమైతే తీరిగ్గా క్షమాపణలు చెప్పుకోవటం వీర్రాజుకు అలవాటుగా మారిపోతోంది. సీనియర్ నేతైన వీర్రాజు కాస్త సంయమనం పాటిస్తే పదే పదే క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే ఉండదు.
This post was last modified on January 29, 2022 11:30 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…