Political News

జిల్లాల‌పై జ‌న‌సేన మౌనం.. ఇంత క‌థ ఉందా..!

రాష్ట్రంలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. జ‌న‌వ‌రి ప్రారంభంలోనే ఒక పెద్ద వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. త‌ర్వా త‌.. పెను సంచ‌ల‌న ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ రెండు ప‌రిణామాలు కూడా రాజ‌కీయంగా అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించిన‌వే. పాజిటివా.. నెగిటివా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. స్పందించే స‌మ‌యం అయితే వ‌చ్చింది. అటు క‌మ్యూనిస్టుల నుంచి ఇటు బీజేపీ నేత‌ల వ‌ర‌కు ఈ రెండు విష‌యాల‌ను రాజ‌కీయంగా వాడుకుంటున్నాయి.

అవే.. ఒక‌టి సంక్రాంతి నేప‌థ్యంలో గుడివాడ‌లో నిర్వ‌హించార‌ని.. టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న క్యాసినో వ్య‌వ‌హారం. రెండు ప్ర‌భుత్వం రాష్ట్రంలోని జిల్లాల‌ను వ్య‌వ‌స్థీక‌రిస్తూ.. ప్ర‌క‌ట‌న చేసింది. అయితే.. ఈ రెండు విష‌యాల‌పై ఇత‌ర పార్టీలు స్పందించినా.. ఒక్క గుడివాడ అంశంపై కొన్ని ప‌క్షాలు యాగీ చేసినా.. జిల్లాల విభ‌జ‌న‌పై స్పందించినా.. కీల‌క‌మైన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన పార్టీ మాత్రం ఈ అంశాల‌పై పెద్ద‌గా రియాక్ట్ కాలేదు.

జిల్లాల విష‌యంపై అస‌లు స్పందించ‌నే లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు మౌనంగా ఉంది? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువగా పాల‌న చేరుతుంద‌ని.. స‌ర్కారు చెబుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో 13 కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ.. ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అంతేకాదు.. కొత్త‌గా ఏర్ప‌డిన వాటిలో.. రెండు జిల్లాల‌కు ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పేర్ల‌ను పెట్టింది.

అయితే, ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యంపై సొంత పార్టీలోనే మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఇక‌, టీడీపీ కూడా ఆచి తూచి అడుగులు వేస్తోంది. క‌క్క‌లేక మింగ‌లేకఅన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్ట‌డాన్ని స్వాగ‌తిస్తోంది. ఇక‌, అదేస‌మ‌యంలో ఎన్టీఆర్ విగ్ర‌హాలు కూల్చేసి.. ఆయ‌న పేరు పెడ‌తారా? అంటూ.. నిల‌దీసింది. మ‌రి.. ఈ విష‌యంలో జ‌న‌సేన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. ఇన్ని జిల్లాలు ఎందుకు? అని కానీ, లేదా.. మ‌రిన్ని జిల్లాల‌కు మ‌హ‌నీయుల పేర్లు పెట్టాల‌ని కానీ.. నాయ‌కులు వ్యాఖ్యానించ‌లేదు.

పోనీ.. స‌ర్కారు నిర్ణ‌యం బాగుంటే.. బాగుందనైనా వ్యాఖ్యానించాలి. అలా కూడా స్పందించ‌లేదు. సో.. మొత్తానికి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటాం.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటాం.. అనే నాయ‌కులు ఇలా.. కీల‌క విష‌యాల్లో.. జ‌న‌సేన మౌనంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ప‌వ‌న్ ఎప్పుడు స్పందిస్తారో.. ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.

This post was last modified on January 29, 2022 8:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago