Political News

జిల్లాల‌పై జ‌న‌సేన మౌనం.. ఇంత క‌థ ఉందా..!

రాష్ట్రంలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. జ‌న‌వ‌రి ప్రారంభంలోనే ఒక పెద్ద వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. త‌ర్వా త‌.. పెను సంచ‌ల‌న ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ రెండు ప‌రిణామాలు కూడా రాజ‌కీయంగా అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించిన‌వే. పాజిటివా.. నెగిటివా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. స్పందించే స‌మ‌యం అయితే వ‌చ్చింది. అటు క‌మ్యూనిస్టుల నుంచి ఇటు బీజేపీ నేత‌ల వ‌ర‌కు ఈ రెండు విష‌యాల‌ను రాజ‌కీయంగా వాడుకుంటున్నాయి.

అవే.. ఒక‌టి సంక్రాంతి నేప‌థ్యంలో గుడివాడ‌లో నిర్వ‌హించార‌ని.. టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న క్యాసినో వ్య‌వ‌హారం. రెండు ప్ర‌భుత్వం రాష్ట్రంలోని జిల్లాల‌ను వ్య‌వ‌స్థీక‌రిస్తూ.. ప్ర‌క‌ట‌న చేసింది. అయితే.. ఈ రెండు విష‌యాల‌పై ఇత‌ర పార్టీలు స్పందించినా.. ఒక్క గుడివాడ అంశంపై కొన్ని ప‌క్షాలు యాగీ చేసినా.. జిల్లాల విభ‌జ‌న‌పై స్పందించినా.. కీల‌క‌మైన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన పార్టీ మాత్రం ఈ అంశాల‌పై పెద్ద‌గా రియాక్ట్ కాలేదు.

జిల్లాల విష‌యంపై అస‌లు స్పందించ‌నే లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు మౌనంగా ఉంది? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువగా పాల‌న చేరుతుంద‌ని.. స‌ర్కారు చెబుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో 13 కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ.. ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అంతేకాదు.. కొత్త‌గా ఏర్ప‌డిన వాటిలో.. రెండు జిల్లాల‌కు ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పేర్ల‌ను పెట్టింది.

అయితే, ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యంపై సొంత పార్టీలోనే మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఇక‌, టీడీపీ కూడా ఆచి తూచి అడుగులు వేస్తోంది. క‌క్క‌లేక మింగ‌లేకఅన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్ట‌డాన్ని స్వాగ‌తిస్తోంది. ఇక‌, అదేస‌మ‌యంలో ఎన్టీఆర్ విగ్ర‌హాలు కూల్చేసి.. ఆయ‌న పేరు పెడ‌తారా? అంటూ.. నిల‌దీసింది. మ‌రి.. ఈ విష‌యంలో జ‌న‌సేన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. ఇన్ని జిల్లాలు ఎందుకు? అని కానీ, లేదా.. మ‌రిన్ని జిల్లాల‌కు మ‌హ‌నీయుల పేర్లు పెట్టాల‌ని కానీ.. నాయ‌కులు వ్యాఖ్యానించ‌లేదు.

పోనీ.. స‌ర్కారు నిర్ణ‌యం బాగుంటే.. బాగుందనైనా వ్యాఖ్యానించాలి. అలా కూడా స్పందించ‌లేదు. సో.. మొత్తానికి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటాం.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటాం.. అనే నాయ‌కులు ఇలా.. కీల‌క విష‌యాల్లో.. జ‌న‌సేన మౌనంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ప‌వ‌న్ ఎప్పుడు స్పందిస్తారో.. ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.

This post was last modified on January 29, 2022 8:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

8 minutes ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

4 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

6 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

11 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

11 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

12 hours ago