మద్యం ప్రియులకు.. ఆ రాష్ట్రం మజాకైన వార్త అందించింది. ఇప్పటి వరకు వైన్ షాపులు, బార్లకు మాత్ర మే పరిమితమైన మద్యం అమ్మకాలను ఇక నుంచి కిరాణా షాపుల్లోనూ అనుమతిస్తూ.. సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.. పొరుగున ఉన్న మహారాష్ట్రలో!! అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని మద్యం వినియోగదారులు కిరాణా దుకాణాలు మరియు సూపర్ మార్కెట్లలో వైన్ కొనుగోలు చేయగలుగుతారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘షెల్ఫ్ ఇన్ షాప్’ విధానాన్ని సర్కారు తాజాగా ఆమోదించింది, 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలలో వైన్ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించింది.
వాస్తవానికి ఇప్పటి వరకు ప్రత్యేక మద్యం దుకాణాల ద్వారానే వైన్ విక్రయాలను అనుమతిస్తున్నారు. ఈ విధానం గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే ఈ విధానం ల్యాప్స్ కావడంతో ప్రభుత్వం సవరించిన కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
రాష్ట్రంలోని వ్యవసాయోత్పత్తులకు, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. “పండ్ల నుండి వైన్ తయారు చేయడం వల్ల రైతులకు అధిక ధరలు లభిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇది గమనించబడింది. అందుకోసం రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లు లేదా కిరాణా షాపుల్లో వైన్ విక్రయాలు ప్రారంభించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో వైన్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది“ అని మాలిక్ అన్నారు.
కొత్త విధానంపై ప్రతిపక్షం బీజేపీ వ్యతిరేకత గురించి అడిగినప్పుడు, మాలిక్ మాట్లాడుతూ, “బీజేపీ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ మరియు గోవాలో ఇలాంటి విధానాలు అమలులో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే నైతిక హక్కు బీజేపీకి లేదు“ అని ఆయన సమర్ధించుకున్నారు. ఏదేమైనా.. ఇక నుంచి కిరాణా దుకాణాల్లోనూ.. మద్యం అమ్మకాలకు అనుమతించడం.. సంచలనంగా మారింది.
This post was last modified on January 28, 2022 11:45 am
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…