Political News

ఏపీలో కొత్త జిల్లాల‌పై బాల‌య్య రియాక్ష‌న్‌

ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌తిపాదించిన జిల్లాల ఏర్పాటు.. అంశంపై హిందూపురం ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య రియాక్ట్‌.. అయ్యారు. నిజానికి జిల్లాల ఏర్పాటు అంశం తెర‌మీదికి వ‌చ్చి రెండు రోజులు అయినా.. స్పందించ‌లేద‌నే కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్య‌లో తాజాగా బాల‌య్య రియాక్ష‌న్ అంద‌రి నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. రాష్ట్ర ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన జిల్లాల ఏర్పాటును ఆయ‌న స్వాగ‌తించారు. జిల్లాల ఏర్పాటు మంచిదేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే… ఈ విష‌యంలో రాజ‌కీయాలు వ‌ద్ద‌ని కామెంట్ చేశారు.

ప్ర‌స్తుతం బాల‌య్య ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అనంత‌పురం జిల్లాను స‌ర్కారు రెండుగా జిల్లాలుగా విడ‌దీసింది. అనంత‌పురం జిల్లాలోని  రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో అనంత‌పురం కేంద్రంగా  అనంతపురంజిల్లా ఏర్ప‌డ‌నుంది. కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్ రెవెన్యూ డివిజ‌న్ల‌తో  34 మండలాలు ఉంటాయి.

ఇక‌, అనంత‌పురం జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ‌క‌వ‌ర్గాల‌తో పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా కొత్త‌గా శ్రీసత్యసాయిజిల్లా ఏర్ప‌డ‌నుంది. పెనుగొండ , పుట్టపర్తి, కదిరి రెవ‌న్యూ డివిజ‌న్లు, 29 మండలాలు ఉంటాయి. అయితే.. దీనిపైనే బాల‌య్య అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే అన్ని రూపాల్లోనూ అభివృద్ధి చెందిన హిందూపురం ప్రాంతాన్ని.. స‌త్య సాయి జిల్లాకు కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. ఇక్క‌డైనా.. అన్ని విధాలాప్ర‌భుత్వానికి అనువైన స్థ‌లాలు ల‌భిస్తాయ‌ని, కార్యాల‌యాలుఇత‌ర మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేసుకునే ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

“హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందింది.  హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాలి. హిందూపురం ప‌ట్ట‌ణ ప‌రిస‌రాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటు, భ‌విష్య‌త్ అవ‌స‌ర‌మైన భూమి పుష్క‌లంగా ఉంది. ఇక‌, జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్దు. హిందూపురం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి.. వారి చిరికాల కోరికైన హిందూపురం ప‌ట్ట‌ణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే నే బాగుంటుంది“ అని బాల‌య్య వ్యాఖ్యానించారు. 

This post was last modified on January 27, 2022 7:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

50 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

2 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

3 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago