Political News

ఏపీలో కొత్త జిల్లాల‌పై బాల‌య్య రియాక్ష‌న్‌

ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌తిపాదించిన జిల్లాల ఏర్పాటు.. అంశంపై హిందూపురం ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య రియాక్ట్‌.. అయ్యారు. నిజానికి జిల్లాల ఏర్పాటు అంశం తెర‌మీదికి వ‌చ్చి రెండు రోజులు అయినా.. స్పందించ‌లేద‌నే కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్య‌లో తాజాగా బాల‌య్య రియాక్ష‌న్ అంద‌రి నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. రాష్ట్ర ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన జిల్లాల ఏర్పాటును ఆయ‌న స్వాగ‌తించారు. జిల్లాల ఏర్పాటు మంచిదేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే… ఈ విష‌యంలో రాజ‌కీయాలు వ‌ద్ద‌ని కామెంట్ చేశారు.

ప్ర‌స్తుతం బాల‌య్య ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అనంత‌పురం జిల్లాను స‌ర్కారు రెండుగా జిల్లాలుగా విడ‌దీసింది. అనంత‌పురం జిల్లాలోని  రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో అనంత‌పురం కేంద్రంగా  అనంతపురంజిల్లా ఏర్ప‌డ‌నుంది. కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్ రెవెన్యూ డివిజ‌న్ల‌తో  34 మండలాలు ఉంటాయి.

ఇక‌, అనంత‌పురం జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ‌క‌వ‌ర్గాల‌తో పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా కొత్త‌గా శ్రీసత్యసాయిజిల్లా ఏర్ప‌డ‌నుంది. పెనుగొండ , పుట్టపర్తి, కదిరి రెవ‌న్యూ డివిజ‌న్లు, 29 మండలాలు ఉంటాయి. అయితే.. దీనిపైనే బాల‌య్య అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే అన్ని రూపాల్లోనూ అభివృద్ధి చెందిన హిందూపురం ప్రాంతాన్ని.. స‌త్య సాయి జిల్లాకు కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. ఇక్క‌డైనా.. అన్ని విధాలాప్ర‌భుత్వానికి అనువైన స్థ‌లాలు ల‌భిస్తాయ‌ని, కార్యాల‌యాలుఇత‌ర మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేసుకునే ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

“హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందింది.  హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాలి. హిందూపురం ప‌ట్ట‌ణ ప‌రిస‌రాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటు, భ‌విష్య‌త్ అవ‌స‌ర‌మైన భూమి పుష్క‌లంగా ఉంది. ఇక‌, జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్దు. హిందూపురం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి.. వారి చిరికాల కోరికైన హిందూపురం ప‌ట్ట‌ణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే నే బాగుంటుంది“ అని బాల‌య్య వ్యాఖ్యానించారు. 

Satya

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

2 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

4 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

9 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

9 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

11 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

12 hours ago