Political News

ఏపీ ఎయిర్ పోర్టులు 13?.. 26?

ఏపీ సీఎం జ‌గ‌న్ పై నెటిజ‌న్లు భారీ ఎత్తున సెటైర్లు కుమ్మేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌.. రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాకు ఒక విమానాశ్ర‌యం నిర్మిస్తామ‌ని చెప్పారు. కేబినెట్ మీటింగ్‌లోనూ దీనిపై తీర్మానం చేశారు. దీంతో సీఎం జ‌గ‌న్‌ప్ర‌క‌ట‌న‌ను ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. ప్ర‌తి జిల్లాకు ఒక‌టి చొప్పున విమానా శ్ర‌యం క‌డుతున్నారంటూ.. ప్ర‌చారం చేశారు. అయితే.. దీనిపై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు జిల్లాకు ఒక‌టి చొప్పున క‌డితే.. కొత్త‌గా 13 విమానాశ్ర‌యాలు క‌ట్టాలి.

అయితే.. వీటి వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. రాష్ట్రంలో మెజారిటీ ప్ర‌జ‌లు వినియోగించే బ‌స్సు స్టాండుల్లో సౌక‌ర్యాలు లేవు. ర‌హ‌దారులు నిలువెత్తు గోతుల‌తో ఉన్నాయి. వీటిని బాగు చేయ‌డం మానేసి.. జిల్లాకో విమానాశ్ర‌యం క‌డితే.. ఎవ‌రికి ప్ర‌యోజ‌నం. నిజానికి ఇప్ప‌టికీ.. చాలా గ్రామాల‌కు బ‌స్సు సౌక‌ర్యం లేదు.

ఇక‌, ఉన్న బ‌స్టాండ్లలోనూ.. మౌలిక స‌దుపాయాలు కూడా లేకుండా పోయాయి. నిత్యం ప్ర‌జ‌ల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన వీటిని బాగు చేయ‌కుండా.. విమానాశ్ర‌యాలు క‌ట్ట‌డం వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అని నెటిజ‌న్లు అంటున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో సెట‌ర్ కూడా హ‌ల్చ‌ల్ చేస్తోంది. జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ప్పుడు రాష్ట్రం లో 13 జిల్లాలు ఉంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో 26 జిల్లాల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన‌ట్టు ఆయ‌న సొంత మీడి యాలోనే వ‌చ్చింది.

మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ ఈ 26 జిల్లాల్లోనూ.. విమానాశ్ర‌యాలు నిర్మిస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఒక‌వైపు… ర‌హ‌దారులు వేసేందుకు నిధులు లేవు. మ‌రోవైపు.. ఉద్యోగుల‌కు ఇచ్చేందుకునిధులు లేవు. పేద విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు చేసేందుకుకుస్తీ ప‌డుతున్న ప‌రిస్థితి. కానీ, జిల్లాకో.. విమానాశ్ర‌యం మాత్రం పెడ‌తారట‌! ఇదీ.. ఇప్పుడు నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌. మ‌రి దీనికి వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on January 25, 2022 7:29 pm

Share

Recent Posts

రామాయ‌ణం.. ర‌ణ‌బీర్… ర‌బ్బ‌ర్ చెప్పులు

పురాణ గాథ‌ల‌ను తెర‌కెక్కించేట‌పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విష‌యం…

52 minutes ago

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత…

58 minutes ago

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

1 hour ago

దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…

1 hour ago

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

2 hours ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

5 hours ago