Political News

కాపుల ఉద్య‌మం మొదలైందా?

ఏపీలో కాపులు మ‌ళ్లీ విజృంభించ‌నున్నారా?  వారు మ‌రోసారి ఉద్య‌మాన్ని ప్రారంభించే దిశ‌గా అడుగులు వేస్తున్నారా? అంటే… తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మం గురించి అంద‌రికీ తెలిసిందే. బీసీల‌తో స‌మానంగా త‌మ‌కు కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నేది వారి ప్ర‌ధాన డిమాండ్. గ‌త 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ మేర‌కు హామీ ఇచ్చార‌ని పేర్కొంటూ.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. రెండేళ్ల‌పాటు ఉద్య‌మించి.. చివ‌ర‌కు ఉప‌శ‌మించారు.  

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక త‌న్న వ‌ల్ల‌కాదంటూ.. ముద్రగ‌డ ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి కాపుల గురించి పెద్ద‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. దాదాపు రెండేళ్ల‌పాటు ఎవ‌రూ మాట్టాడింది లేదు. అంతేకాదు… ఎవ‌రూ.. రిజ‌ర్వేష‌న్ గురించి ప్ర‌శ్నించింది కూడా లేదు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ క‌ద‌లిక వ‌చ్చింది. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వున్న నేప‌థ్యంలో ఏపీలో కాపులు సంఘ‌టితం కావాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌ళ్లీ ఉద్య‌మించాల‌ని భావిస్తుండ‌డం రాజ‌కీయంగా కూడా ఆస‌క్తిని రేపుతోంది.

కాపు ముఖ్య నాయకులు  తాజాగా విజ‌య‌వాడ వేదిక‌గా.. ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు. కరోనా థర్డ్ వేవ్‎తో వర్చువల్‎గా జ‌రిగిన‌ భేటీలో 16 మంది నేతలు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని మెజార్టీ సభ్యులు సూచనలు చేశారు. అన్ని కులాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దళితులు, వెనకబడిన వర్గాల ముఖ్యనేతలతో టచ్‎లో ఉన్న కాపు ముఖ్యనేతలు ఫిబ్రవరి రెండవ వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

విజయవాడలో సమావేశం అయ్యేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపారు. ఆ సమావేశంలో కోర్ కమిటీ వేయాలని సూచనలు చేశారు. అయితే ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు నేతలు దూరంగా ఉన్నారు.  మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్మో హాన్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు, ముద్రగడ్డ అనుచరుడు ఆరేటి ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు. ఈ క్ర‌మంలో రిజ‌ర్వేష‌న్‌ల అంశంపై.. దృష్టి పెట్టాల‌ని భావించారు. మొత్తానికి కాపుల దూకుడు ఎన్నిక‌ల నాటికి బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

This post was last modified on January 25, 2022 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago