ఏపీలో కాపులు మళ్లీ విజృంభించనున్నారా? వారు మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే… తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకు లు. ఏపీలో కాపు సామాజిక వర్గం ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. బీసీలతో సమానంగా తమకు కూడా రిజర్వేషన్ కల్పించాలనేది వారి ప్రధాన డిమాండ్. గత 2014 ఎన్నికల సమయంలో తమకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు హామీ ఇచ్చారని పేర్కొంటూ.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రెండేళ్లపాటు ఉద్యమించి.. చివరకు ఉపశమించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇక తన్న వల్లకాదంటూ.. ముద్రగడ పక్కకు తప్పుకొన్నారు. ఇక, అప్పటి నుంచి కాపుల గురించి పెద్దగా ఇప్పటి వరకు అంటే.. దాదాపు రెండేళ్లపాటు ఎవరూ మాట్టాడింది లేదు. అంతేకాదు… ఎవరూ.. రిజర్వేషన్ గురించి ప్రశ్నించింది కూడా లేదు. అయితే.. ఇప్పుడు మళ్లీ కదలిక వచ్చింది. మరో రెండేళ్లలో ఎన్నికలు వున్న నేపథ్యంలో ఏపీలో కాపులు సంఘటితం కావాలని నిర్ణయించుకోవడం.. జగన్ ప్రభుత్వంపై మళ్లీ ఉద్యమించాలని భావిస్తుండడం రాజకీయంగా కూడా ఆసక్తిని రేపుతోంది.
కాపు ముఖ్య నాయకులు తాజాగా విజయవాడ వేదికగా.. ఆన్లైన్లో భేటీ అయ్యారు. కరోనా థర్డ్ వేవ్తో వర్చువల్గా జరిగిన భేటీలో 16 మంది నేతలు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని మెజార్టీ సభ్యులు సూచనలు చేశారు. అన్ని కులాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దళితులు, వెనకబడిన వర్గాల ముఖ్యనేతలతో టచ్లో ఉన్న కాపు ముఖ్యనేతలు ఫిబ్రవరి రెండవ వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.
విజయవాడలో సమావేశం అయ్యేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపారు. ఆ సమావేశంలో కోర్ కమిటీ వేయాలని సూచనలు చేశారు. అయితే ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్మో హాన్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు, ముద్రగడ్డ అనుచరుడు ఆరేటి ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో రిజర్వేషన్ల అంశంపై.. దృష్టి పెట్టాలని భావించారు. మొత్తానికి కాపుల దూకుడు ఎన్నికల నాటికి బలపడే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 25, 2022 11:45 am
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…