Political News

అపాయానికి ఎదురెళ్లటం అవసరమా జగన్?

యావత్ ప్రపంచం మాయదారి రోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. అంతకంతకూ విస్తరిస్తున్న మహమ్మారి నేపథ్యంలో అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ప్రముఖులు.. సామాన్యులు అన్న తేడా లేకుండా అంటేస్తున్న మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మరిన్ని జాగ్రత్తలు అవసరం.

ఈ విషయాన్ని పట్టించుకోని వారంతా ఇప్పుడు పాజిటివ్ బారిన పడటాన్ని మరిచిపోకూడదు. ఇటీవల కాలంలో దేశంలోనూ.. అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల జోరు పెరిగింది. లాక్ డౌన్ వేళ.. ప్రపంచంలో మన దేశంలో నమోదైన పాజిటివ్ ల సంఖ్య పరిమితంగా ఉండేది. లాక్ డౌన్ ఎత్తేసి ఆన్ లాక్ 1.0 పూర్తిస్థాయిలో షురూ అయిన నాటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే వీలుంది.

ఇలాంటివేళ.. ఆగస్టు నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తానని.. పల్లెబాటను షురూ చేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందలేదనే ఫిర్యాదులు ప్రజల నుంచి రావొద్దన్నఆయన.. ఆగస్టులో గ్రామాల్లో పర్యటిస్తే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరో నెలన్నర కంటే ఎక్కువే సమయం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు ఏ మాత్రం సరి కాదంటున్నారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే సందేశాలకు బదులు.. ముఖ్యమంత్రే గ్రామాల్లో పర్యటిస్తామని చెబుతున్నారు. మనకేం కాదులే అన్న అనవసరమైన ధీమా పెరుగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో.. నిత్యం బిజీ షెడ్యూల్ లో ఉన్న జగన్.. పాలనా రథాల్ని మరింత వేగంగా పరుగులు తీయించాలని భావిస్తున్నారు. ఆయన ఉత్సాహాన్ని తప్పు పట్టలేం కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తన వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.

గ్రామాల్లో పర్యటిస్తాననే ప్రకటన.. అపాయానికి ఎదురెళ్లటమే తప్పించి మరొకటి కాదంటున్నారు. మహమ్మారి ముప్పు పూర్తిస్థాయిలో తొలిగే వరకూ.. పూర్తి రక్షణ చట్రంలో ఆయన ఉండేలా ప్లాన్ చేసుకోవటా చాలా అవసరమన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on June 12, 2020 8:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago