సినిమాలకు, రాజకీయాలకు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అనేక మంది స్టార్లు.. వివిధ పార్టీల తరఫున గళం వినిపించిన విషయం తెలిసిందే. ఇలాంటి వారిలో స్టార్ కమెడియన్.. ఆలీ ఒకరు. గత ఎన్నికలకు ముందు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఈయన టికెట్ ఆశించారని అందరూ అనుకున్నారు. అంతేకాదు.. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అంటే.. తనకు అభిమానమని పదే పదే చెప్పిన ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారని అనుకున్న సమయంలో అనూహ్యంగా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు జగన్ టికెట్ ఇస్తారని అందరూ భావించారు.
అయితే.. ఆ ఎన్నికల్లో ఆలీకి అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారం నిర్వహించారు.
రాజమండ్రి సహా గుంటూరులోనూ.. ఆలీని ప్రచారానికి గత ఎన్నికల్లో వైసీపీ వినియోగించుకుంది. జగన్ అంటే.. ఎంతో ఆత్మీయత కనబరచడంతోపాటు.. వైసీపీపై అనేక మంది స్టార్ నటులు.. విమర్శలు చేసిన సమయంలోనూ.. ఆలీ మౌనంగా ఉండడం విశేషం. అంతేకాదు.. ఏపీపై కొందరు ప్రముఖ నటులు.. ఇటీవల కాలంలో టికెట్ ధరలు, ధియేటర్లపై దాడులు వంటి విషయాల్లో విమర్శలు చేసినా.. ఆలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఈ క్రమంలో ఆయన వైసీపీ అభిమాని అనే చర్చ అటు టాలీవుడ్లోనూ సాగింది. ఇక, ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో మిస్సయినా.. ఇప్పుడు మాత్రం.. ఖచ్చితంగా టికెట్ లభిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో ఆలీ వంటి ప్రజాదరణ ఉన్న యాక్టర్ను రంగంలోకి దింపితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆలీ కోరుకుంటున్నది.. గుంటూరు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం. కానీ, ఇప్పటికే ఇక్కడ కీలక నేత ఒకరు ఉన్నారు. ఆయన కూడా పార్టీకి వీరాభిమాని. దీంతో ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశం లేదు.
ఈ క్రమంలో రాజమండ్రి సిటీ నియోజవకర్గం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఓడిపోయింది. అప్పటి ఎన్నికల్లో వైసీపీ తరఫున రౌతు సూర్యప్రకాశరావు పోటీ చేశారు. అయితే.. ఆయన టీడీపీ ముందు.. జోరు చూపించలేక పోయారు. పైగా ఇప్పటికీ.. ఆయన యాక్టివ్ కాలేక పోతున్నారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి ఆలీ వంటి కీలక వ్యక్తికి అవకాశం ఇస్తే.. టీడీపీని ఓడించడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆలీకి రాజమండ్రి సిటీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని.. వైసీపీ నేతల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…