Political News

అన్ని పార్టీలది అదే జపం?

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీ ఓబీసీ జపాన్ని పెంచేస్తున్నాయి. యూపీలో ఓబీసీలు 37 శాతమున్నారు. వీరిలో యాదవుల బలం 12 శాతం. యాదవుల్లో అత్యధికులు ఎస్పీ మద్దతుదారులే అన్నది అందరికీ తెలిసిందే. మిగిలిన 25 శాతం యాదవేతర బీసీల ఓట్లు ఎవరికి పడతాయన్నదే కీలకమైపోయింది. 25 శాతం ఓట్లంటే మామూలు విషయం కాదు. అందుకనే అన్ని పార్టీలు ప్రధానంగా బీజేపీ, ఎస్పీ ఓబీసీల జపం చేస్తున్నాయి.

ఓబీసీల ఓట్లను కొల్లగొట్టడం కోసమే పార్టీల మధ్య వలసలు బాగా పెరిగిపోతున్నాయి. బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీలో బలమైన నేతగా పాపులర్. ఈయనకు 20 నియోజకవర్గాల్లో బాగా పట్టుందంటున్నారు. అలాగే మరో ఇద్దరు మంత్రులతో పాటు ఐదుగురు ఎంఎల్ఏలు కూడా బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరిపోయారు. వీరిలో అత్యధికులు ఓబీసీ వారే. దాంతో బీజేపీలో కలవరం పెరిగిపోతోంది.

అందుకనే కాంగ్రెస్ లోని ఓబీసీకి చెందిన ఓ ఎంఎల్ఏని తమ పార్టీలోకి లాక్కుంది. 2017 అసెంబ్లీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బాగా లాభపడిందంటే అందుకు కారణం ఓబీసీల మద్దతే. అలాంటిది ఇపుడు 25 శాతం  ఓబీసీల్లో మెజారిటి ఓట్లు తమకు ఎక్కడ దూరమైపోతాయో అనే టెన్షన్ పెరిగిపోతోంది. అసలే బ్రాహ్మణులు, జాట్లు, దళితులు బీజేపీపై బాగా ఆగ్రహంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓబీసీలు కూడా దూరమైతే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదు.

ఆ దెబ్బను తప్పించుకునేందుకే ఒకవైపు ఓబీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తు మరోవైపు తమపై ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్న సామాజికవర్గాలను దువ్వే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చెప్పలేకున్నారు. ఇదే సమయంలో ఓబీసీల ఓటుబ్యాంకును దగ్గరకు తీసుకునేందుకు ఎస్సీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండుపార్టీల పరిస్ధితి ఇలాగుంటే మిగిలిన బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఏమి చేసున్నాయో కూడా పెద్దగా తెలీటంలేదు. సో ఏ విధంగా చూసినా రాబోయే ఎన్నికల్లో ఓబీసీలే చాలా కీలకమని తెలిసిపోతోంది.

This post was last modified on January 17, 2022 1:36 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

10 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

14 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago