Political News

YSRCP: ఈసారి అవకాశం ఎవరికి దక్కుతుందో ?

తొందరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల్లో వైసీపీ తరపున ఎవరికి అవకాశం వస్తుందనే విషయంలో పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేపు జూన్ మాసంతో ఏపీలోని నలుగురు ఎంపీలు రిటైర్ అవుతారు. విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు పదవీకాలం ముగిసిపోతుంది. వీరిలో విజయసాయి వైసీపీ తరపున ఇఫ్పటికే రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. సుజనా, టీజీ వెంకటేష్, సురేష్ ముగ్గురు టీడీపీ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు.

వీరి ముగ్గురిలో సుజనా, టీజీ ఇద్దరు టీడీపీ నేతలైతే 2016 నాటి పరిస్ధితుల కారణంగా బీజేపీ నేతైన సురేష్ ప్రభును ఏపి నుంచి టీడీపీ కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాల్సొచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత సుజనా, టీజీ కూడా టీడీపీలో నుంచి బీజేపీలోకి ఫిరాయించారు. సరే ఏ విషయం ఎలాగున్నా పై నలుగురి పదవీకాలం ముగిసిపోతోంది. వీరిలో విజయసాయికి మళ్ళీ రెన్యువల్ వస్తుందనే అనుకుంటున్నారు.

ఇపుడున్న ఆరుగురిలో పరిమళ్ నత్వానీ కాకుండా ముగ్గురు రెడ్లు, ఇద్దరు బీసీలున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే ఈసారి బీసీలకు అవకాశం ఉండదట. ఎందుకంటే ఇప్పటికే బీసీ కోటాలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. కాబట్టి భర్తీ చేయబోయే మిగిలిన మూడు సీట్లలో ఒకటి కాపులకు, ఇంకోటి మహిళకు మరోటి ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ మూడు వర్గాలను కూడా మూడు ప్రాంతాల నుండి ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.

కాపులు,  మహిళలు, మైనారిటిల కోటాలో భర్తీ చేయబోయే నేతల పేర్లను జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు సమాచారం. తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు రాజీనామా చేస్తే ఉపఎన్నిక వస్తుంది. నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో రాజులు, కాపుల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాపులకు ప్రాతినిధ్యం విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇపుడు కూడా అదే పద్దతి పాటించనున్నారు. 

This post was last modified on January 17, 2022 12:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

6 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

17 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

1 hour ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

1 hour ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

1 hour ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago