Political News

మోడీ భద్రత.. వాళ్ళకే బెదిరింపు కాల్స్?

సుప్రీంకోర్టు లాయర్లకే బెదిరింపు కాల్సు వస్తుండటం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చాలామంది లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను కొందరు ఆందోళనకారులు అడ్డుకోవటం భద్రతా వైఫల్యమే అని తేలిపోయింది. అయితే  లోపానికి కారణం ఏమిటి ? బాధ్యులెవరు ? అనే విషయమై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కమిటీ వేశారు.

భద్రతా లోపాలపై లోతుగా విచారణ జరపాలని లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన కేసుతో సుప్రీంకోర్టు విచారణను స్వీకరించింది. అయితే భద్రతా లోపాలపై జరిగే విచారణలో సుప్రీంకోర్టు లాయర్లు ఎవరు పాల్గొనేందుకు లేదంటు కొందరికి ఫోన్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. తమకు వచ్చిన బెదిరింపు కాల్సన్నీ లండన్ నుండి వచ్చినట్లు లాయర్లు చెబుతున్నారు. ఖలిస్థాన్ ఉద్యమ సంస్ధకు లండన్, కెనడా దేశాల నుంచి భారీ ఎత్తున నిధులు అందుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని బలి తీసుకున్నది కూడా ఖలిస్తాన్ ప్రేరేపిత పోలీసులే అన్న ప్రచారం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఖలిస్థాన్ సంస్ధను, దాని ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే మళ్ళీ ఖలిస్థాన్ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. మొన్నటి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్నది కూడా ఖలిస్థాన్ ప్రేరేపిత ఆందోళనకారులే అని తెలుస్తోంది. లాయర్లను బెదిరిస్తున్నది కూడా ఖలిస్థాన్ సంస్థ నుండి వచ్చిన ఫోన్ కాల్సే అని లాయర్లు చెబుతున్నారు.

ఏదేమైనా ప్రధానమంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నది ఆందోళనకారులే అని పైకి కనిసిస్తున్నా లోపల మాత్రం పెద్ద విషయమే ఉందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా మరోటుంది. అదేమిటంటే ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు వాహనాలు అడ్డుంచింది మామూలుగా నిరసన తెలుపడానికి మాత్రమే. తాము వెహికల్స్ ఉంచిన ఫ్లైఓవర్ పైనే ప్రధానమంత్రి ప్రయాణించబోతున్నట్లు ఆందోళనకారులకు అప్పుడు తెలీదు.

ఏదేమైనా ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే విషయంలో తలెత్తిన భద్రతా లోపాలు చిన్న విషయమైతే కాదు. భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యం మరోసారి తలెత్తకూడదంటే ఇపుడు సమస్యపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందే.  ప్రధానమంత్రిగా ఎవరున్నారు ? పంజాబ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏదన్న విషయం అప్రస్తుతం.  వ్యక్తుల కన్నా వ్యవస్ధే కీలకమన్న పద్దతిలోనే దర్యాప్తు జరిపి లోపాల సవరణకు సుప్రీంకోర్టు సూచనలు చేస్తే బాగుంటుంది.

This post was last modified on January 11, 2022 5:27 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

గుంటూరు, క్రిష్ణాలో టీడీపీకి అమరావతి వరం!

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుద‌లైన త‌ర్వాత‌.. కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌ ప్ర‌చారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మ‌డి…

2 hours ago

సుధీర్ బాబు సినిమా.. సౌండే లేదు

మహేష్ బాబు బావ అనే గుర్తింపుతో హీరోగా అడుగు పెట్టి కెరీర్ ఆరంభంలో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డాడు సుధీర్ బాబు.…

3 hours ago

గేమ్ చేంజర్ కబురు ఎఫ్పుడో?

2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు…

4 hours ago

సోమిరెడ్డి వదిలిన సెంటిమెంటాస్త్రం!

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా…

5 hours ago

బాబాయి ఈ సారి గెలిచితీరాలి… మెగా కుటుంబంలో కసి

ప‌వ‌న్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్క‌సారి ఆయ‌న‌ను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు…

5 hours ago

సంక్రాంతి కోసం నాగార్జున స్కెచ్

మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…

7 hours ago