Political News

మోడీ భద్రత.. వాళ్ళకే బెదిరింపు కాల్స్?

సుప్రీంకోర్టు లాయర్లకే బెదిరింపు కాల్సు వస్తుండటం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చాలామంది లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను కొందరు ఆందోళనకారులు అడ్డుకోవటం భద్రతా వైఫల్యమే అని తేలిపోయింది. అయితే  లోపానికి కారణం ఏమిటి ? బాధ్యులెవరు ? అనే విషయమై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కమిటీ వేశారు.

భద్రతా లోపాలపై లోతుగా విచారణ జరపాలని లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన కేసుతో సుప్రీంకోర్టు విచారణను స్వీకరించింది. అయితే భద్రతా లోపాలపై జరిగే విచారణలో సుప్రీంకోర్టు లాయర్లు ఎవరు పాల్గొనేందుకు లేదంటు కొందరికి ఫోన్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. తమకు వచ్చిన బెదిరింపు కాల్సన్నీ లండన్ నుండి వచ్చినట్లు లాయర్లు చెబుతున్నారు. ఖలిస్థాన్ ఉద్యమ సంస్ధకు లండన్, కెనడా దేశాల నుంచి భారీ ఎత్తున నిధులు అందుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని బలి తీసుకున్నది కూడా ఖలిస్తాన్ ప్రేరేపిత పోలీసులే అన్న ప్రచారం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఖలిస్థాన్ సంస్ధను, దాని ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే మళ్ళీ ఖలిస్థాన్ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. మొన్నటి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్నది కూడా ఖలిస్థాన్ ప్రేరేపిత ఆందోళనకారులే అని తెలుస్తోంది. లాయర్లను బెదిరిస్తున్నది కూడా ఖలిస్థాన్ సంస్థ నుండి వచ్చిన ఫోన్ కాల్సే అని లాయర్లు చెబుతున్నారు.

ఏదేమైనా ప్రధానమంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నది ఆందోళనకారులే అని పైకి కనిసిస్తున్నా లోపల మాత్రం పెద్ద విషయమే ఉందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా మరోటుంది. అదేమిటంటే ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు వాహనాలు అడ్డుంచింది మామూలుగా నిరసన తెలుపడానికి మాత్రమే. తాము వెహికల్స్ ఉంచిన ఫ్లైఓవర్ పైనే ప్రధానమంత్రి ప్రయాణించబోతున్నట్లు ఆందోళనకారులకు అప్పుడు తెలీదు.

ఏదేమైనా ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే విషయంలో తలెత్తిన భద్రతా లోపాలు చిన్న విషయమైతే కాదు. భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యం మరోసారి తలెత్తకూడదంటే ఇపుడు సమస్యపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందే.  ప్రధానమంత్రిగా ఎవరున్నారు ? పంజాబ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏదన్న విషయం అప్రస్తుతం.  వ్యక్తుల కన్నా వ్యవస్ధే కీలకమన్న పద్దతిలోనే దర్యాప్తు జరిపి లోపాల సవరణకు సుప్రీంకోర్టు సూచనలు చేస్తే బాగుంటుంది.

This post was last modified on January 11, 2022 5:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

26 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

1 hour ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

7 hours ago