సుప్రీంకోర్టు లాయర్లకే బెదిరింపు కాల్సు వస్తుండటం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చాలామంది లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను కొందరు ఆందోళనకారులు అడ్డుకోవటం భద్రతా వైఫల్యమే అని తేలిపోయింది. అయితే లోపానికి కారణం ఏమిటి ? బాధ్యులెవరు ? అనే విషయమై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కమిటీ వేశారు.
భద్రతా లోపాలపై లోతుగా విచారణ జరపాలని లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన కేసుతో సుప్రీంకోర్టు విచారణను స్వీకరించింది. అయితే భద్రతా లోపాలపై జరిగే విచారణలో సుప్రీంకోర్టు లాయర్లు ఎవరు పాల్గొనేందుకు లేదంటు కొందరికి ఫోన్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. తమకు వచ్చిన బెదిరింపు కాల్సన్నీ లండన్ నుండి వచ్చినట్లు లాయర్లు చెబుతున్నారు. ఖలిస్థాన్ ఉద్యమ సంస్ధకు లండన్, కెనడా దేశాల నుంచి భారీ ఎత్తున నిధులు అందుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని బలి తీసుకున్నది కూడా ఖలిస్తాన్ ప్రేరేపిత పోలీసులే అన్న ప్రచారం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఖలిస్థాన్ సంస్ధను, దాని ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే మళ్ళీ ఖలిస్థాన్ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. మొన్నటి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్నది కూడా ఖలిస్థాన్ ప్రేరేపిత ఆందోళనకారులే అని తెలుస్తోంది. లాయర్లను బెదిరిస్తున్నది కూడా ఖలిస్థాన్ సంస్థ నుండి వచ్చిన ఫోన్ కాల్సే అని లాయర్లు చెబుతున్నారు.
ఏదేమైనా ప్రధానమంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నది ఆందోళనకారులే అని పైకి కనిసిస్తున్నా లోపల మాత్రం పెద్ద విషయమే ఉందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా మరోటుంది. అదేమిటంటే ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు వాహనాలు అడ్డుంచింది మామూలుగా నిరసన తెలుపడానికి మాత్రమే. తాము వెహికల్స్ ఉంచిన ఫ్లైఓవర్ పైనే ప్రధానమంత్రి ప్రయాణించబోతున్నట్లు ఆందోళనకారులకు అప్పుడు తెలీదు.
ఏదేమైనా ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే విషయంలో తలెత్తిన భద్రతా లోపాలు చిన్న విషయమైతే కాదు. భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యం మరోసారి తలెత్తకూడదంటే ఇపుడు సమస్యపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందే. ప్రధానమంత్రిగా ఎవరున్నారు ? పంజాబ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏదన్న విషయం అప్రస్తుతం. వ్యక్తుల కన్నా వ్యవస్ధే కీలకమన్న పద్దతిలోనే దర్యాప్తు జరిపి లోపాల సవరణకు సుప్రీంకోర్టు సూచనలు చేస్తే బాగుంటుంది.
This post was last modified on January 11, 2022 5:27 pm
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…