Political News

పంజాబ్‌లో కాంగ్రెస్ మ‌ళ్లీ పాగా వేస్తుందా?

ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒక్క‌టే ఆ పార్టీకి ఆశాజ‌న‌కం గా మారింది. ఇక్క‌డైనా గెలుపు గుర్రం ఎక్కి.. రెండో ద‌ఫా అధికారం ద‌క్కించుకుంటే త‌ప్ప‌.. కాంగ్రెస్‌కు ప‌రువు, మ‌ర్యాద‌లు ద‌క్కేలా లేవ‌ని అంటున్నారు పరిశీల‌కులు. అయితే.. 2017లో ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొన్ని రోజులు స‌జావుగానే సాగినా.. త‌ర్వాత త‌ర్వాత‌.. సొంత నేత‌ల ప్ర‌త్యేక వివాదాల‌తో పార్టీ అధిష్టానానికి బొప్పి క‌ట్టింది. పైగా ఇటీవ‌ల కెప్టెన్‌.. అప్ప‌టి వ‌ర‌కు సీఎంగా ఉన్న అమ‌రీంద‌ర్ సింగ్ ఆక‌స్మిక రాజీనామా.. ఆయ‌న బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. సొంత కుంప‌టి పెట్టుకోవ‌డం.. వంటివి పార్టీని ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి.

ఇదిలావుంటే.. సొంత పార్టీలోనూ.. సిద్దూ చే్స్తున్న రాజ‌కీయాలు.. పార్టీలో లుక‌లుక‌ల‌ను మ‌రింత పెంచుతున్నాయి. పార్టీ చీఫ్‌గా ఉండి.. త‌న మాటే నెగ్గాల‌నే వ్యూహంతో ఆయ‌న వేసిన అడుగులు.. పార్టీలో చీలిక‌ల‌ను పెంచి పోషించాయ‌నే చెప్పాయి. పైగా.. ఇటీవ‌ల సీఎం కుర్చీకోసం.. సిద్దూ చేసిన యాగీ.. అధిష్టానానికి మ‌రింత విసుగు తెప్పించింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కాదు! అని అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే.. ఇప్పుడు అదే అంశం పార్టీకి శ‌రాఘాతంగా మార‌నుంది. సీఎం సీటు కోసం కుస్తీ ప‌డుతున్న సిద్దూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో(ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌క‌టించారు) ‘త‌న‌కు సీఎం సీటు ఇస్తానంటేనే..’ అని ష‌ర‌తులు పెట్టేందుకు రెడీ అయ్యారు.

అయితే.. సిద్దూకు సీఎం సీటు ప్ర‌క‌టిస్తే.. ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. ప్ర‌స్తుత సీఎం చ‌న్నూ వ‌ర్గం స‌హా.. మ‌రికొన్ని వ‌ర్గాలు పార్టీకి దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇదే ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. పార్టీ ఎంత బ‌ల‌హీన‌మైతే.. అంత త‌మ‌కు మంచిద‌నే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఇది నేరుగా బీజేపీకి ల‌బ్ధి చేకూర్చ‌క పోయినా.. మాజీ సీఎం అమ‌రీంద‌ర్ పెట్టుకున్న పార్టీవైపు వీరు మొగ్గు చూపి.. కాంగ్రెస్ ఖాళీ కావ‌డ‌మే బీజేపీ వేసుకుంటున్న ప్లాన్‌. దీంతో సీఎం సీటు విష‌యంలో సిద్ధూకు హామీ ఇవ్వ‌క‌పోతే.. ఒక తంటా.. ఇస్తే.. ఒక తంటా అన్న విధంగా కాంగ్రెస్ ప‌రిస్థితి మారిపోయింది.

ఇదిలావుంటే.. మ‌రోవైపు మూడు సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించిన రైతు సంఘాలు రాజ‌కీయ పార్టీ పెట్ట‌నున్నాయి. అయితే.. ఇప్ప‌టికిప్పుడు.. వీరు పార్టీ పెట్టినా.. పెట్ట‌క‌పోయినా… ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డం.. దీనిని కాంగ్రెస్ ఉద్దేశ పూర్వ‌కంగానే భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌కపోవ‌డం వంటి అంశాల‌పై బీజేపీ బాగా ఫోక‌స్ చేసింది. దేశ‌ప్ర‌ధానికే భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని.. కాంగ్రెస్‌.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం భ‌ద్ర‌త క‌ల్పిస్తుంద‌ని బీజేపీ నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌చారం అందుకున్నారు. ఇలా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అన్ని వైపుల నుంచి అనేక స‌వాళ్లు ఏర్ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో తిరిగి అధికారం చేప‌డుతుందా? లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

This post was last modified on January 8, 2022 9:18 pm

Share

Recent Posts

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

15 minutes ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

2 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

2 hours ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

3 hours ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

4 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

6 hours ago