దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. వైఖరిపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్న.. మేఘాలయ గవర్నర్.. బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. “ప్రధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనలను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పులు, తర్వాత.. కకేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కారు నడిపిన కారణంగా రైతులు చనిపోయిన ఘటనలపై మోడీ తీవ్రంగా స్పందించారని ఆయన వ్యాఖ్యానించారు.
“రైతులేమన్నా.. నా కోసం చచ్చిపోయారా? “ అని మోడీ పరుషంగా ప్రశ్నించినట్టు మాలిక్ తెలిపారు. “రైతుల సమస్యల పరిష్కారం కోసం.. నేను ప్రధానిని కలిశాను. ఐదు నిమిషాల పాటు మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. రైతుల ఉద్యమంలో వివిధ కారణాలతో దాదాపు 500 మంది రైతులు చనిపోయారు. అని నేను అన్నప్పుడు.. ప్రధాని తీవ్రంగా స్పందించారు.
ఏమాత్రం మానవత్వం లేకుండా మాట్లాడారు. `నాకోసం చచ్చిపోయారా? ` అంటూ.. ప్రశ్నించారు. అంతేకాదు.. రైతులకు తిండి ఎక్కువైంది. అందుకే చచ్చిపోయారు! అని వ్యాఖ్యానించారు. ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే.. ఇంక నాకేమీ చెప్పొద్దు.. ఏదైనా ఉంటే.. అమిత్ షాతో చెప్పుకోండి!“ అని బయటకు పంపేశారు. “ అని మాలిక్ వెల్లడించారు.
హరియాణాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం. అయితే.. మాలిక్ వ్యాఖ్యలపై పలువురు మిశ్రమ స్పందన వచ్చింది. గతంలోనూ ఆయన ఇలానే చేశారని.. ఇప్పుడు మరోసారి గవర్నర్ పదవిని పొడిగించుకునేందుకు ఇలాచేస్తున్నారని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on January 3, 2022 9:56 pm
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…