Political News

రైతులు నాకోస‌మే చ‌చ్చిపోయారా?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వైఖ‌రిపై కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు చేస్తున్న‌.. మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్‌.. బీజేపీ నాయకుడు స‌త్య‌పాల్ మాలిక్ తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. “ప్ర‌ధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వ్య‌తిరేకంగా రైతులు చేసిన ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించే క్ర‌మంలో పోలీసులు జ‌రిపిన కాల్పులు, త‌ర్వాత‌.. క‌కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు కారు న‌డిపిన కార‌ణంగా రైతులు చ‌నిపోయిన ఘ‌ట‌న‌ల‌పై మోడీ తీవ్రంగా స్పందించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

“రైతులేమ‌న్నా.. నా కోసం చ‌చ్చిపోయారా? “ అని మోడీ ప‌రుషంగా ప్ర‌శ్నించిన‌ట్టు మాలిక్ తెలిపారు. “రైతుల స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం.. నేను ప్ర‌ధానిని క‌లిశాను. ఐదు నిమిషాల పాటు మా ఇద్ద‌రి మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగింది. రైతుల ఉద్య‌మంలో వివిధ కార‌ణాల‌తో దాదాపు 500 మంది రైతులు చ‌నిపోయారు. అని నేను అన్న‌ప్పుడు.. ప్ర‌ధాని తీవ్రంగా స్పందించారు.

ఏమాత్రం మాన‌వ‌త్వం లేకుండా మాట్లాడారు. `నాకోసం చ‌చ్చిపోయారా? ` అంటూ.. ప్ర‌శ్నించారు. అంతేకాదు.. రైతుల‌కు తిండి ఎక్కువైంది. అందుకే చ‌చ్చిపోయారు! అని వ్యాఖ్యానించారు. ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే.. ఇంక నాకేమీ చెప్పొద్దు.. ఏదైనా ఉంటే.. అమిత్ షాతో చెప్పుకోండి!“ అని బ‌య‌టకు పంపేశారు. “ అని మాలిక్ వెల్ల‌డించారు.

హ‌రియాణాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్‌.. ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.  అయితే.. మాలిక్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. గ‌తంలోనూ ఆయ‌న ఇలానే చేశార‌ని.. ఇప్పుడు మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని పొడిగించుకునేందుకు ఇలాచేస్తున్నార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on January 3, 2022 9:56 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

7 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

7 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

8 hours ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

10 hours ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

11 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

12 hours ago