Political News

రైతులు నాకోస‌మే చ‌చ్చిపోయారా?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వైఖ‌రిపై కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు చేస్తున్న‌.. మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్‌.. బీజేపీ నాయకుడు స‌త్య‌పాల్ మాలిక్ తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. “ప్ర‌ధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వ్య‌తిరేకంగా రైతులు చేసిన ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించే క్ర‌మంలో పోలీసులు జ‌రిపిన కాల్పులు, త‌ర్వాత‌.. క‌కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు కారు న‌డిపిన కార‌ణంగా రైతులు చ‌నిపోయిన ఘ‌ట‌న‌ల‌పై మోడీ తీవ్రంగా స్పందించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

“రైతులేమ‌న్నా.. నా కోసం చ‌చ్చిపోయారా? “ అని మోడీ ప‌రుషంగా ప్ర‌శ్నించిన‌ట్టు మాలిక్ తెలిపారు. “రైతుల స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం.. నేను ప్ర‌ధానిని క‌లిశాను. ఐదు నిమిషాల పాటు మా ఇద్ద‌రి మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగింది. రైతుల ఉద్య‌మంలో వివిధ కార‌ణాల‌తో దాదాపు 500 మంది రైతులు చ‌నిపోయారు. అని నేను అన్న‌ప్పుడు.. ప్ర‌ధాని తీవ్రంగా స్పందించారు.

ఏమాత్రం మాన‌వ‌త్వం లేకుండా మాట్లాడారు. `నాకోసం చ‌చ్చిపోయారా? ` అంటూ.. ప్ర‌శ్నించారు. అంతేకాదు.. రైతుల‌కు తిండి ఎక్కువైంది. అందుకే చ‌చ్చిపోయారు! అని వ్యాఖ్యానించారు. ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే.. ఇంక నాకేమీ చెప్పొద్దు.. ఏదైనా ఉంటే.. అమిత్ షాతో చెప్పుకోండి!“ అని బ‌య‌టకు పంపేశారు. “ అని మాలిక్ వెల్ల‌డించారు.

హ‌రియాణాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్‌.. ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.  అయితే.. మాలిక్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. గ‌తంలోనూ ఆయ‌న ఇలానే చేశార‌ని.. ఇప్పుడు మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని పొడిగించుకునేందుకు ఇలాచేస్తున్నార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on January 3, 2022 9:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

1 hour ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

5 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

7 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

10 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

10 hours ago