దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. వైఖరిపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్న.. మేఘాలయ గవర్నర్.. బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. “ప్రధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనలను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పులు, తర్వాత.. కకేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కారు నడిపిన కారణంగా రైతులు చనిపోయిన ఘటనలపై మోడీ తీవ్రంగా స్పందించారని ఆయన వ్యాఖ్యానించారు.
“రైతులేమన్నా.. నా కోసం చచ్చిపోయారా? “ అని మోడీ పరుషంగా ప్రశ్నించినట్టు మాలిక్ తెలిపారు. “రైతుల సమస్యల పరిష్కారం కోసం.. నేను ప్రధానిని కలిశాను. ఐదు నిమిషాల పాటు మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. రైతుల ఉద్యమంలో వివిధ కారణాలతో దాదాపు 500 మంది రైతులు చనిపోయారు. అని నేను అన్నప్పుడు.. ప్రధాని తీవ్రంగా స్పందించారు.
ఏమాత్రం మానవత్వం లేకుండా మాట్లాడారు. `నాకోసం చచ్చిపోయారా? ` అంటూ.. ప్రశ్నించారు. అంతేకాదు.. రైతులకు తిండి ఎక్కువైంది. అందుకే చచ్చిపోయారు! అని వ్యాఖ్యానించారు. ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే.. ఇంక నాకేమీ చెప్పొద్దు.. ఏదైనా ఉంటే.. అమిత్ షాతో చెప్పుకోండి!“ అని బయటకు పంపేశారు. “ అని మాలిక్ వెల్లడించారు.
హరియాణాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం. అయితే.. మాలిక్ వ్యాఖ్యలపై పలువురు మిశ్రమ స్పందన వచ్చింది. గతంలోనూ ఆయన ఇలానే చేశారని.. ఇప్పుడు మరోసారి గవర్నర్ పదవిని పొడిగించుకునేందుకు ఇలాచేస్తున్నారని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on January 3, 2022 9:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…