Political News

రైతులు నాకోస‌మే చ‌చ్చిపోయారా?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వైఖ‌రిపై కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు చేస్తున్న‌.. మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్‌.. బీజేపీ నాయకుడు స‌త్య‌పాల్ మాలిక్ తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. “ప్ర‌ధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వ్య‌తిరేకంగా రైతులు చేసిన ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించే క్ర‌మంలో పోలీసులు జ‌రిపిన కాల్పులు, త‌ర్వాత‌.. క‌కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు కారు న‌డిపిన కార‌ణంగా రైతులు చ‌నిపోయిన ఘ‌ట‌న‌ల‌పై మోడీ తీవ్రంగా స్పందించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

“రైతులేమ‌న్నా.. నా కోసం చ‌చ్చిపోయారా? “ అని మోడీ ప‌రుషంగా ప్ర‌శ్నించిన‌ట్టు మాలిక్ తెలిపారు. “రైతుల స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం.. నేను ప్ర‌ధానిని క‌లిశాను. ఐదు నిమిషాల పాటు మా ఇద్ద‌రి మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగింది. రైతుల ఉద్య‌మంలో వివిధ కార‌ణాల‌తో దాదాపు 500 మంది రైతులు చ‌నిపోయారు. అని నేను అన్న‌ప్పుడు.. ప్ర‌ధాని తీవ్రంగా స్పందించారు.

ఏమాత్రం మాన‌వ‌త్వం లేకుండా మాట్లాడారు. `నాకోసం చ‌చ్చిపోయారా? ` అంటూ.. ప్ర‌శ్నించారు. అంతేకాదు.. రైతుల‌కు తిండి ఎక్కువైంది. అందుకే చ‌చ్చిపోయారు! అని వ్యాఖ్యానించారు. ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే.. ఇంక నాకేమీ చెప్పొద్దు.. ఏదైనా ఉంటే.. అమిత్ షాతో చెప్పుకోండి!“ అని బ‌య‌టకు పంపేశారు. “ అని మాలిక్ వెల్ల‌డించారు.

హ‌రియాణాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్‌.. ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.  అయితే.. మాలిక్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. గ‌తంలోనూ ఆయ‌న ఇలానే చేశార‌ని.. ఇప్పుడు మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని పొడిగించుకునేందుకు ఇలాచేస్తున్నార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on January 3, 2022 9:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

8 hours ago