దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. వైఖరిపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్న.. మేఘాలయ గవర్నర్.. బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. “ప్రధాని మోడీ చాలా అహంకారి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడు వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనలను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పులు, తర్వాత.. కకేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కారు నడిపిన కారణంగా రైతులు చనిపోయిన ఘటనలపై మోడీ తీవ్రంగా స్పందించారని ఆయన వ్యాఖ్యానించారు.
“రైతులేమన్నా.. నా కోసం చచ్చిపోయారా? “ అని మోడీ పరుషంగా ప్రశ్నించినట్టు మాలిక్ తెలిపారు. “రైతుల సమస్యల పరిష్కారం కోసం.. నేను ప్రధానిని కలిశాను. ఐదు నిమిషాల పాటు మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. రైతుల ఉద్యమంలో వివిధ కారణాలతో దాదాపు 500 మంది రైతులు చనిపోయారు. అని నేను అన్నప్పుడు.. ప్రధాని తీవ్రంగా స్పందించారు.
ఏమాత్రం మానవత్వం లేకుండా మాట్లాడారు. `నాకోసం చచ్చిపోయారా? ` అంటూ.. ప్రశ్నించారు. అంతేకాదు.. రైతులకు తిండి ఎక్కువైంది. అందుకే చచ్చిపోయారు! అని వ్యాఖ్యానించారు. ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే.. ఇంక నాకేమీ చెప్పొద్దు.. ఏదైనా ఉంటే.. అమిత్ షాతో చెప్పుకోండి!“ అని బయటకు పంపేశారు. “ అని మాలిక్ వెల్లడించారు.
హరియాణాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం. అయితే.. మాలిక్ వ్యాఖ్యలపై పలువురు మిశ్రమ స్పందన వచ్చింది. గతంలోనూ ఆయన ఇలానే చేశారని.. ఇప్పుడు మరోసారి గవర్నర్ పదవిని పొడిగించుకునేందుకు ఇలాచేస్తున్నారని పేర్కొనడం గమనార్హం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…