Political News

రాధా నామాట విను.. చంద్ర‌బాబు స‌ల‌హా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సాధార‌ణంగా.. ఉద‌యం 8 గంట‌ల త‌ర్వాత కానీ.. ఏ ప‌నినీ మొద‌లు పెట్ట‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి.. కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. అదే అధికారంలో ఉండి ఉంటే.. ఆ లెక్క వేరు. ఉద‌యం 6 గంట‌లకే ప‌నులు ప్రారంభించేవారు. అయితే.. ఆయన బుధ‌వారం అనూహ్యంగా ఉద‌యం 6 గంట‌ల‌కే లైన్‌లోకి వ‌చ్చేశారు. తెల‌తెల వారుతూనే ఆయ‌న చ‌ర్య‌లు ప్రారంభించారు. ఒక‌వైపు పార్టీ కీల‌క నాయ‌కుడు, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన రంగా త‌న‌యుడు వంగ‌వీటి రాధాకు చంద్ర‌బాబు ఫోన్ చేశారు. దాదాపు 20 నిముషాల పాటు ఆయ‌న రాధాతో మాట్లాడారు.

అనంత‌రం.. రాష్ట్ర డీజీపి గౌతం స‌వాంగ్‌కు కూడా లేఖ‌ను సంధించారు. ఉద‌యం 7 గంట‌ల‌కే ఆయ‌న డీజీపీని ఉద్దేశించి లేఖ రాశారు. వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి  చంద్రబాబు విజ్ఞ‌ప్తి చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరం గా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. హింసాత్మక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయని వాపోయారు. నేరస్థులపై సమగ్ర విచారణ తర్వాత కఠినమైన చర్యలు మాత్రమే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడతాయని స్పష్టం చేశారు. డీజీపీ ఇప్ప‌టికైనా స్పందించి.. అస‌లు ఏం జ‌రిగిందో.. నేర‌స్తులు ఎవ‌రో వెంట‌నే గుర్తించి ప‌ట్టుకోవాల‌ని.. కోరారు. రాధా విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు.

ఇక‌, రాధాతో ఫోన్ లో మాట్లాడిన చంద్ర‌బాబు.. రాధా హ‌త్య‌కు రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు. ప్ర‌భుత్వం 2+2 భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని హెచ్చరించారు. రాధాకు టీడీపీ పూర్తి అండగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు. అలాగే కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని సూచించారు. ప్ర‌భుత్వం ఇచ్చిన భ‌ద్ర‌త‌ను తీసుకోవాల‌ని సూచించారు. మ‌రి రాధా ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 29, 2021 4:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

43 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago