Political News

రాధా నామాట విను.. చంద్ర‌బాబు స‌ల‌హా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సాధార‌ణంగా.. ఉద‌యం 8 గంట‌ల త‌ర్వాత కానీ.. ఏ ప‌నినీ మొద‌లు పెట్ట‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి.. కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. అదే అధికారంలో ఉండి ఉంటే.. ఆ లెక్క వేరు. ఉద‌యం 6 గంట‌లకే ప‌నులు ప్రారంభించేవారు. అయితే.. ఆయన బుధ‌వారం అనూహ్యంగా ఉద‌యం 6 గంట‌ల‌కే లైన్‌లోకి వ‌చ్చేశారు. తెల‌తెల వారుతూనే ఆయ‌న చ‌ర్య‌లు ప్రారంభించారు. ఒక‌వైపు పార్టీ కీల‌క నాయ‌కుడు, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన రంగా త‌న‌యుడు వంగ‌వీటి రాధాకు చంద్ర‌బాబు ఫోన్ చేశారు. దాదాపు 20 నిముషాల పాటు ఆయ‌న రాధాతో మాట్లాడారు.

అనంత‌రం.. రాష్ట్ర డీజీపి గౌతం స‌వాంగ్‌కు కూడా లేఖ‌ను సంధించారు. ఉద‌యం 7 గంట‌ల‌కే ఆయ‌న డీజీపీని ఉద్దేశించి లేఖ రాశారు. వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి  చంద్రబాబు విజ్ఞ‌ప్తి చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరం గా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. హింసాత్మక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయని వాపోయారు. నేరస్థులపై సమగ్ర విచారణ తర్వాత కఠినమైన చర్యలు మాత్రమే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడతాయని స్పష్టం చేశారు. డీజీపీ ఇప్ప‌టికైనా స్పందించి.. అస‌లు ఏం జ‌రిగిందో.. నేర‌స్తులు ఎవ‌రో వెంట‌నే గుర్తించి ప‌ట్టుకోవాల‌ని.. కోరారు. రాధా విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు.

ఇక‌, రాధాతో ఫోన్ లో మాట్లాడిన చంద్ర‌బాబు.. రాధా హ‌త్య‌కు రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు. ప్ర‌భుత్వం 2+2 భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని హెచ్చరించారు. రాధాకు టీడీపీ పూర్తి అండగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు. అలాగే కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని సూచించారు. ప్ర‌భుత్వం ఇచ్చిన భ‌ద్ర‌త‌ను తీసుకోవాల‌ని సూచించారు. మ‌రి రాధా ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 29, 2021 4:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

42 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

45 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago