మంత్రి కొడాలి నాని బీజేపీకి చాలా పెద్ద సవాలే విసిరారు. మంత్రి విసిరిన ఛాలెంజ్ అలాంటిలాంటి చాలెంజ్ కాదు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 సీట్లలో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటుందా ? అంటూ నిలదీశారు. నాని చెప్పినట్లు 20 శాతం సీట్లంటే మొత్తం 175 సీట్లలో 35 సీట్లు మాత్రమే. అంటే నాని చెప్పినట్లుగా బీజేపీ 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు కమలం పార్టీని గొప్ప పార్టీగా వైసీపీ గుర్తిస్తుందేమో.
మంత్రి ఈ చాలెంజ్ చేయటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే ఈరోజు విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాగ్రహ సభ జరగబోతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించినపుడు మంత్రి పై చాలెంజ్ విసిరారు. ప్రతిపక్షాలు చెప్పుకోవటమే కానీ తమ ప్రభుత్వంపై జనాల్లో ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. 35 సీట్లలో బీజేపీని డిపాజిట్లు తెచ్చుకోవాలని మంత్రి సవాలు విసరటం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో వచ్చిన ఫలితం చూసే ఈ చాలెంజ్ విసురుంటారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటులో కూడా డిపాజిట్ రాలేదు. చాలా నియోజకవర్గాల్లో పోటీకి గట్టి అభ్యర్ధులే దొరకలేదు. పార్టీ పరువు పోతుందని ఎవరినో ఒకరికి బీఫాం ఇచ్చి నామినేషన్లు వేయించుకున్నారు. అప్పటికి ఇప్పటికి బీజేపీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీ గెలవలేదు. చాలా చోట్ల కనీసం నామినేషన్లు కూడా వేయలేకపోయింది.
ఇలాంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోయేదంటు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అండ్ కో పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చూసిన తర్వాత మంత్రికి మండిపోయుంటుంది. అందుకనే 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలన్నారు. బీజేపీ గెలుపు సీట్ల గురించి కూడా మంత్రేమీ మాట్లాడలేదు. కేవలం డిపాజిట్ల గురించే చెప్పారు. అంటే మంత్రి బీజేపీకి చాలా పెద్ద బంపర్ ఆఫరే ఇచ్చినట్లు లెక్క. మరి మంత్రి ఛాలెంజ్ ను వీర్రాజు స్వీకరిస్తారా ?
This post was last modified on December 28, 2021 10:52 am
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…