మంత్రి కొడాలి నాని బీజేపీకి చాలా పెద్ద సవాలే విసిరారు. మంత్రి విసిరిన ఛాలెంజ్ అలాంటిలాంటి చాలెంజ్ కాదు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 సీట్లలో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటుందా ? అంటూ నిలదీశారు. నాని చెప్పినట్లు 20 శాతం సీట్లంటే మొత్తం 175 సీట్లలో 35 సీట్లు మాత్రమే. అంటే నాని చెప్పినట్లుగా బీజేపీ 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు కమలం పార్టీని గొప్ప పార్టీగా వైసీపీ గుర్తిస్తుందేమో.
మంత్రి ఈ చాలెంజ్ చేయటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే ఈరోజు విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాగ్రహ సభ జరగబోతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించినపుడు మంత్రి పై చాలెంజ్ విసిరారు. ప్రతిపక్షాలు చెప్పుకోవటమే కానీ తమ ప్రభుత్వంపై జనాల్లో ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. 35 సీట్లలో బీజేపీని డిపాజిట్లు తెచ్చుకోవాలని మంత్రి సవాలు విసరటం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో వచ్చిన ఫలితం చూసే ఈ చాలెంజ్ విసురుంటారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటులో కూడా డిపాజిట్ రాలేదు. చాలా నియోజకవర్గాల్లో పోటీకి గట్టి అభ్యర్ధులే దొరకలేదు. పార్టీ పరువు పోతుందని ఎవరినో ఒకరికి బీఫాం ఇచ్చి నామినేషన్లు వేయించుకున్నారు. అప్పటికి ఇప్పటికి బీజేపీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీ గెలవలేదు. చాలా చోట్ల కనీసం నామినేషన్లు కూడా వేయలేకపోయింది.
ఇలాంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోయేదంటు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అండ్ కో పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చూసిన తర్వాత మంత్రికి మండిపోయుంటుంది. అందుకనే 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలన్నారు. బీజేపీ గెలుపు సీట్ల గురించి కూడా మంత్రేమీ మాట్లాడలేదు. కేవలం డిపాజిట్ల గురించే చెప్పారు. అంటే మంత్రి బీజేపీకి చాలా పెద్ద బంపర్ ఆఫరే ఇచ్చినట్లు లెక్క. మరి మంత్రి ఛాలెంజ్ ను వీర్రాజు స్వీకరిస్తారా ?
This post was last modified on December 28, 2021 10:52 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…