Political News

ఒకే వేదిక‌పై సీజేఐ, ఏపీ సీఎం

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. మూడు రోజుల పాటు రాష్ట్ర ప‌ర్య‌ట‌న నిమిత్తం స‌తీమ‌ణి శివ‌మాలతో క‌లిసి వ‌చ్చిన ఆయ‌న ఈ రోజు.. ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌లు ఒకే వేదిక‌ను పంచుకున్నారు.

ఒకే వేదిక‌పై రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు కూడా సీఎంతో క‌లిసి కూర్చోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా క్రిస్మ‌స్‌.. నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కేక్ క‌ట్ చేశారు. తొలుత కేక్ క‌టింగ్ ఘ‌ట్టానికి.. సీఎం జ‌గ‌న్ దూరంగా ఉన్నారు. అయితే.. సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణే.. సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. దీంతో ఆయ‌న సీజేఐ చేతిమీద చేయి వేసి.. కేక్ క‌ట్ చేశారు.

ఈ ఘ‌ట‌న చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యం లో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి, రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఒడిసా రాష్ట్రాల హైకోర్టుల నుంచి కూడా ప‌లువురు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు. తొలుత ఈ కార్య‌క్ర‌మంలో భారీ పుష్ప గుచ్ఛం ఇచ్చి.. సీఎం జ‌గ‌న్‌.. సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ‌ను ఘ‌నంగా స్వాగ‌తించారు. అనంతరం.. వేదిక‌పైనే ఇత‌ర న్యాయ‌మూర్తుల‌తో క‌లిసి.. సీఎం, సీజేఐలు తేనీరు సేవించారు. త‌ర్వాత‌.. కేక్ క‌ట్ చేశారు. అంతకుముందు నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్‌ జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

వైఎస్సార్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్‌.. నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐని కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు. వాస్త‌వానికి ప్ర‌బుత్వాలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు న్యాయ‌మూర్తులు హాజ‌రు కావ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. పైగా.. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటుండ‌డం, గ‌తంలో జైలు చేసిన ప‌రిస్థితి కూడా ఉండ‌డం, ఇప్ప‌టికీ అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి.. విచార‌ణ‌లు ఎదుర్కొంటున్న త‌రుణంలో ఏపీ సీఎం జ‌గ‌న్ హాజ‌ర‌య్యే కార్యక్ర‌మానికి సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు.

This post was last modified on December 26, 2021 8:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago