ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఎన్నికలు ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్.. షూటింగ్లతో బిజీగా ఉన్నప్పుడు రాజకీయాలకు విరామం.. ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణం. కానీ ఇప్పుడు ఆయన మరో కొత్త పంథాలో సాగబోతున్నారని సమాచారం. ఒకే సారి రెండు పడవల ప్రయాణం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను దూరం పెట్టకుండా ఒకేసారి రెండు రంగాల్లోనూ ముందుకు సాగుతారని తెలుస్తోంది.
అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్. జనసేన పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్.. అప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల సమయంలో ఏకంగా సినిమాలు ఆపేస్తానని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు వరుస షూటింగ్లతో బిజీగా గడుపుతున్నారు. దీంతో పవన్పై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఆ విషయంలో పవన్ పూర్తి క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
2023 నాటికి పవన్ సినిమా షూటింగ్లు పూర్తి చేసి ఏడాది పాటు వచ్చే ఎన్నికల కోసం పనిచేస్తారనే ప్రచారం సాగింది. కానీ పవన్ మాత్రం మరోసారి సినిమాలకు గ్యాప్ ఇచ్చే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేయడంతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాలు నిర్మించే బాధ్యతలను కూడా ఆయన తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది మొత్తం సినిమాలు చేసి ఆ తర్వాత పవన్ నిర్మాతగా మారతారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీంతో ఓ వైపు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు పవన్ బ్యానర్, సినిమాలు నడుస్తూనే ఉంటాయన్నమాట. అందు కోసం పవన్ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. గతంలో లాగా కాకుండా ఇప్పుడు రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా కొనసాగించాలనుకుంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం పూర్తి సమయం రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు వీలుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఓ వైపు నటించడంతో పాటు నిర్మాతగానూ డబ్బులు వెనకేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని టాక్.
This post was last modified on December 24, 2021 2:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…