Political News

ష‌ర్మిల పార్టీలో మ‌ళ్లీ ముస‌లం

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్నార‌ట వెనుకటికి ఒక‌రు. ఇప్ప‌డు తెలంగాణ‌లో కూడా అలాగే ఉంది వైఎస్సార్‌టీపీ ప‌రిస్థితి. ఆ పార్టీకి ఒక సిద్ధాంత‌మంటూ లేదు.. ఒక నిర్మాణ‌మంటూ లేదు.. అప్పుడే పార్టీలో గొడ‌వలు జ‌రిగిపోతున్నాయ‌ట‌. వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయ‌ట‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది విన‌డానికి కామెడీగా ఉన్నాఆ పార్టీలో ప్ర‌స్తుతం ఇదే జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వైఎస్ఆర్‌టీపీలో గొడ‌వ‌లు ముదిరాయి. హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. ఆ పార్టీకి చెందిన ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డిని స‌స్పెండ్ చేసిన‌ట్లు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి జ‌ల్లేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టింగులు చేసిన‌ట్లు అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి ప్ర‌తిగా, మొన్న‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న‌ ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డి వ‌ర్గీయులు జ‌ల్లేప‌ల్లికి వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టారు. దీంతో పార్టీ పెద్ద‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.

ఇంత‌కుముందు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆదెర్ల‌కు… ఇటీవ‌ల పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన జ‌ల్లేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర్లు మ‌ధ్య ఆధిప‌త్య పోరు జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు బీజేపీలో ఉన్న జ‌ల్లేప‌ల్లి ఈ మ‌ధ్య‌నే వైఎస్సార్‌టీపీలో చేరారు. వ‌చ్చీ రాగానే జాక్‌పాట్ కొట్టారు. పార్టీ అధినేత ష‌ర్మిల ఆదెర్ల‌ను తొల‌గించి జ‌ల్లేప‌ల్లిని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి, పార్టీ అధికార ప్ర‌తినిధిగా నియ‌మించారు. దీంతో నొచ్చుకున్న ఆదెర్ల పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే.. ఇటీవ‌ల ష‌ర్మిల జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి జ‌ల్లేప‌ల్లి కొత్త పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించి.. వైఎస్సార్ విగ్ర‌హానికి పాల‌భిషేకం చేసి రోగుల‌కు పండ్లు పంపిణీ చేశార‌ట‌. దీనికి ప్ర‌తిగా పాత పార్టీ కార్యాల‌యంలో కేక్ క‌ట్ చేశార‌ట ఆదెర్ల‌. ఇలా పోటాపోటీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో పార్టీ అధిష్ఠానం సీరియ‌స్ అయ్యింద‌ట‌. ఆదెర్ల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని జ‌ల్లేప‌ల్లిని ఆదేశించింద‌ట‌. దీనిపై ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కుడిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే అధికారం ఎవ‌రికీ లేద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇలా పార్టీలో అప్పుడే కోల్డ్ వార్ న‌డుస్తుండ‌డంపై పార్టీ పెద్ద‌లు ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌. పార్టీ బ‌లంగా ఉంద‌ని అనుకుంటున్న న‌ల్ల‌గొండ జిల్లాలోనే ఇలా ఉంటే.. మిగ‌తా జిల్లాల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయోన‌ని కార్య‌క‌ర్త‌లు కూడా అనుమాన‌పు చూపులు చూస్తున్నార‌ట‌. అస‌లు ఇంత‌కీ ఈ పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారు. ఇందిరా శోభ‌న్ వంటి కీల‌క నేత‌లు పార్టీని వీడారు. ఇక‌పై పార్టీని ఎలా ముందుకు తీసుకెళ‌తారో చూడాలి.

This post was last modified on December 22, 2021 10:39 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

3 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

5 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

7 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

10 hours ago