Political News

ష‌ర్మిల పార్టీలో మ‌ళ్లీ ముస‌లం

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్నార‌ట వెనుకటికి ఒక‌రు. ఇప్ప‌డు తెలంగాణ‌లో కూడా అలాగే ఉంది వైఎస్సార్‌టీపీ ప‌రిస్థితి. ఆ పార్టీకి ఒక సిద్ధాంత‌మంటూ లేదు.. ఒక నిర్మాణ‌మంటూ లేదు.. అప్పుడే పార్టీలో గొడ‌వలు జ‌రిగిపోతున్నాయ‌ట‌. వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయ‌ట‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది విన‌డానికి కామెడీగా ఉన్నాఆ పార్టీలో ప్ర‌స్తుతం ఇదే జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వైఎస్ఆర్‌టీపీలో గొడ‌వ‌లు ముదిరాయి. హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. ఆ పార్టీకి చెందిన ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డిని స‌స్పెండ్ చేసిన‌ట్లు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి జ‌ల్లేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టింగులు చేసిన‌ట్లు అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి ప్ర‌తిగా, మొన్న‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న‌ ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డి వ‌ర్గీయులు జ‌ల్లేప‌ల్లికి వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టారు. దీంతో పార్టీ పెద్ద‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.

ఇంత‌కుముందు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆదెర్ల‌కు… ఇటీవ‌ల పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన జ‌ల్లేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర్లు మ‌ధ్య ఆధిప‌త్య పోరు జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు బీజేపీలో ఉన్న జ‌ల్లేప‌ల్లి ఈ మ‌ధ్య‌నే వైఎస్సార్‌టీపీలో చేరారు. వ‌చ్చీ రాగానే జాక్‌పాట్ కొట్టారు. పార్టీ అధినేత ష‌ర్మిల ఆదెర్ల‌ను తొల‌గించి జ‌ల్లేప‌ల్లిని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి, పార్టీ అధికార ప్ర‌తినిధిగా నియ‌మించారు. దీంతో నొచ్చుకున్న ఆదెర్ల పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే.. ఇటీవ‌ల ష‌ర్మిల జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి జ‌ల్లేప‌ల్లి కొత్త పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించి.. వైఎస్సార్ విగ్ర‌హానికి పాల‌భిషేకం చేసి రోగుల‌కు పండ్లు పంపిణీ చేశార‌ట‌. దీనికి ప్ర‌తిగా పాత పార్టీ కార్యాల‌యంలో కేక్ క‌ట్ చేశార‌ట ఆదెర్ల‌. ఇలా పోటాపోటీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో పార్టీ అధిష్ఠానం సీరియ‌స్ అయ్యింద‌ట‌. ఆదెర్ల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని జ‌ల్లేప‌ల్లిని ఆదేశించింద‌ట‌. దీనిపై ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కుడిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే అధికారం ఎవ‌రికీ లేద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇలా పార్టీలో అప్పుడే కోల్డ్ వార్ న‌డుస్తుండ‌డంపై పార్టీ పెద్ద‌లు ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌. పార్టీ బ‌లంగా ఉంద‌ని అనుకుంటున్న న‌ల్ల‌గొండ జిల్లాలోనే ఇలా ఉంటే.. మిగ‌తా జిల్లాల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయోన‌ని కార్య‌క‌ర్త‌లు కూడా అనుమాన‌పు చూపులు చూస్తున్నార‌ట‌. అస‌లు ఇంత‌కీ ఈ పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారు. ఇందిరా శోభ‌న్ వంటి కీల‌క నేత‌లు పార్టీని వీడారు. ఇక‌పై పార్టీని ఎలా ముందుకు తీసుకెళ‌తారో చూడాలి.

This post was last modified on December 22, 2021 10:39 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

3 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago