Political News

నా మాటే శాస‌నం : ప‌రిటాల శ్రీరామ్

ప‌రిటాల శ్రీరామ్‌. టీడీపీ యువ నాయ‌కుడు. మంచి ఫైర్ ఉన్న నాయ‌కుడు కూడా! అనంత‌పురం జిల్లాలో ఒక‌ప్పుడు.. రాజ‌కీయాల‌ను శాసించిన ప‌రిటాల ర‌వి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీరాం.. గ‌త ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు మంత్రిగా సున్న ప‌రిటాల సునీత త‌న కుమారుడికి సీటు ఇప్పించుకునేందుకు ఆమె పోటీ నుంచి త‌ప్పుకున్నారు. ప‌రిటాల ర‌వి వార‌సుడిగా భారీ అంచ‌నాల‌తో ఆయ‌న రంగంలోకి దిగినా.. వైసీపీ సునామీ నేప‌థ్యంలో విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు.

కానీ, పార్టీ కోసం ఆయ‌న కృషి చేస్తున్నారు. క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టి నుంచో ఈ కుటుంబం డిమాండ్ చేస్తున్న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా చంద్ర‌బాబు ఈ కుటుంబం చేతిలోనే పెట్టారు. ప‌రిటాల శ్రీరామ్‌ను ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్ చేశారు. దీంతో అటు రాప్తాడులో మాజీ మంత్రి, ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి.. ప‌రిటాల సునీత పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ధ‌ర్మ‌వ‌రం నుంచి శ్రీరామ్ పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. లేదు.. ఒక‌వేళ .. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు కాదంటే.. ధ‌ర్మ‌వ‌రం నుంచి తాము ఎంచుకున్న నేత‌కు టికెట్ ఇచ్చేలా .. వ్యూహం సిద్ధం చేసుకున్నారు. కానీ, ఇటీవ‌ల వ‌ర‌దాపురం సూరి.. పార్టీ నుంచి వెళ్లిపోయారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యానికి టీడీపీలోకి వ‌చ్చి.. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది.

ఈ క్ర‌మంలో శ్రీరామ్ హాట్ కామెంట్లు చేశారు. త‌న మాటే శాస‌న‌మ‌ని.. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను త‌ను చెప్పిన వారికి మాత్ర‌మే ఇస్తార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబుకు కూడా చెప్పాన‌ని అన్న ఆయ‌న‌.. ఈ విష‌యంలో తేడా వ‌స్తే.. తిరిగి సూరికే ఈ టికెట్ ఇస్తే.. తాను రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకొంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ధర్మవరంలో టీడీపీలోకి ఎవరు వచ్చినా తాను కండువా వేస్తానని శ్రీరామ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పదవి ఇప్పిస్తానని చెప్పారు. అంతే త‌ప్ప‌.. తిరిగి సూరికి టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేద‌ని.. వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on December 19, 2021 7:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

2 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

3 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

4 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

5 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

6 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

6 hours ago