Political News

నా మాటే శాస‌నం : ప‌రిటాల శ్రీరామ్

ప‌రిటాల శ్రీరామ్‌. టీడీపీ యువ నాయ‌కుడు. మంచి ఫైర్ ఉన్న నాయ‌కుడు కూడా! అనంత‌పురం జిల్లాలో ఒక‌ప్పుడు.. రాజ‌కీయాల‌ను శాసించిన ప‌రిటాల ర‌వి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీరాం.. గ‌త ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు మంత్రిగా సున్న ప‌రిటాల సునీత త‌న కుమారుడికి సీటు ఇప్పించుకునేందుకు ఆమె పోటీ నుంచి త‌ప్పుకున్నారు. ప‌రిటాల ర‌వి వార‌సుడిగా భారీ అంచ‌నాల‌తో ఆయ‌న రంగంలోకి దిగినా.. వైసీపీ సునామీ నేప‌థ్యంలో విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు.

కానీ, పార్టీ కోసం ఆయ‌న కృషి చేస్తున్నారు. క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టి నుంచో ఈ కుటుంబం డిమాండ్ చేస్తున్న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా చంద్ర‌బాబు ఈ కుటుంబం చేతిలోనే పెట్టారు. ప‌రిటాల శ్రీరామ్‌ను ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్ చేశారు. దీంతో అటు రాప్తాడులో మాజీ మంత్రి, ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి.. ప‌రిటాల సునీత పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ధ‌ర్మ‌వ‌రం నుంచి శ్రీరామ్ పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. లేదు.. ఒక‌వేళ .. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు కాదంటే.. ధ‌ర్మ‌వ‌రం నుంచి తాము ఎంచుకున్న నేత‌కు టికెట్ ఇచ్చేలా .. వ్యూహం సిద్ధం చేసుకున్నారు. కానీ, ఇటీవ‌ల వ‌ర‌దాపురం సూరి.. పార్టీ నుంచి వెళ్లిపోయారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యానికి టీడీపీలోకి వ‌చ్చి.. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది.

ఈ క్ర‌మంలో శ్రీరామ్ హాట్ కామెంట్లు చేశారు. త‌న మాటే శాస‌న‌మ‌ని.. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను త‌ను చెప్పిన వారికి మాత్ర‌మే ఇస్తార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబుకు కూడా చెప్పాన‌ని అన్న ఆయ‌న‌.. ఈ విష‌యంలో తేడా వ‌స్తే.. తిరిగి సూరికే ఈ టికెట్ ఇస్తే.. తాను రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకొంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ధర్మవరంలో టీడీపీలోకి ఎవరు వచ్చినా తాను కండువా వేస్తానని శ్రీరామ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పదవి ఇప్పిస్తానని చెప్పారు. అంతే త‌ప్ప‌.. తిరిగి సూరికి టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేద‌ని.. వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on December 19, 2021 7:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

11 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago