Political News

జిల్లాల‌కు కేసీఆర్.. మ‌ళ్లీ ముంద‌స్తు ఆలోచ‌న‌?

ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో మారుతున్న స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ కూడా రూటు మార్చిన‌ట్లే క‌నిపిస్తున్నారు. కేవ‌లం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లేదా ఫాంహౌస్‌కే సీఎం ప‌రిమిత‌మ‌వుతారంటూ విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు ఆయ‌న ఈ మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు జిల్లాల ప‌ర్య‌ట‌న చేశారు. ఆ త‌ర్వాత వివిధ కార‌ణాల వ‌ల్ల ఆగిపోయిన ఆయ‌న మళ్లీ ఇప్పుడు జిల్లాల బాట ప‌ట్ట‌నున్నారు. అయితే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల వెళ్లే ఆలోచ‌న ఏమైనా ఉందా? అని విశ్లేష‌కులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

2014 ఎన్నిక‌ల్లో గెలిచి తొలిసారి సీఎం పీఠంపై కూర్చున్న కేసీఆర్ 2018లో ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటే రాష్ట్రంలోనూ ఎన్నిక‌లు జ‌రిగితే పార్టీ న‌ష్ట‌పోతుంద‌నే ఉద్దేశంతో ఆయ‌న ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్లి భారీ విజ‌యం సాధించారు. ఇప్పుడు కూడా అలాగే మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త ఓ వైపు.. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో పుంజుకుంటున్న తీరు కేసీఆర్‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని స‌మాచారం.

ముఖ్యంగా బీజేపీ త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారుతుంద‌ని ఆయ‌న గ్ర‌హించార‌ని అందుకే ఆ పార్టీని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. అందుకే దాన్ని ఇప్పుడే క్యాష్ చేసుకుని ఈ ద‌శ‌లోనే రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ముంద‌స్తు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ముందు సంక్షేమ ప‌థ‌కాల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలిసింది.

ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాల‌ను మ‌రిన్ని తెర‌పైకి తెచ్చి ఆ త‌ర్వాత ముంద‌స్తు ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందుకే ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 19 నుంచి ఆయ‌న జిల్లాల్లో ప‌ర్య‌టిస్తారు. వ‌న‌ప‌ర్తి జిల్లాతో మొద‌లెట్టి జ‌న‌గామ‌, నాగ‌ర్‌క‌ర్నూలు, జ‌గిత్యాల‌, నిజామాబాద్‌, వికారాబాద్లో ప‌ర్య‌టిస్తారు. కొత్త క‌లెక్ట‌రేట్ల ప్రారంభోత్స‌వం, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం.. ఇలా ఈ పర్య‌ట‌న‌లో భాగంగా కేసీఆర్ చాలా కార్య‌క్ర‌మాలే పెట్టుకున్నారు. అయితే ఇవ‌న్నీ కేసీఆర్ ముంద‌స్తు అంచ‌నాల ప్ర‌కార‌మే జ‌రుగుతున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

This post was last modified on December 17, 2021 1:56 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సంక్రాంతి కోసం నాగార్జున స్కెచ్

మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…

27 mins ago

సాయిపల్లవిని టార్గెట్ చేసుకుంటున్నారు

నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…

51 mins ago

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…

2 hours ago

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

2 hours ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

5 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

5 hours ago