Political News

జిల్లాల‌కు కేసీఆర్.. మ‌ళ్లీ ముంద‌స్తు ఆలోచ‌న‌?

ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో మారుతున్న స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ కూడా రూటు మార్చిన‌ట్లే క‌నిపిస్తున్నారు. కేవ‌లం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లేదా ఫాంహౌస్‌కే సీఎం ప‌రిమిత‌మ‌వుతారంటూ విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు ఆయ‌న ఈ మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు జిల్లాల ప‌ర్య‌ట‌న చేశారు. ఆ త‌ర్వాత వివిధ కార‌ణాల వ‌ల్ల ఆగిపోయిన ఆయ‌న మళ్లీ ఇప్పుడు జిల్లాల బాట ప‌ట్ట‌నున్నారు. అయితే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల వెళ్లే ఆలోచ‌న ఏమైనా ఉందా? అని విశ్లేష‌కులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

2014 ఎన్నిక‌ల్లో గెలిచి తొలిసారి సీఎం పీఠంపై కూర్చున్న కేసీఆర్ 2018లో ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటే రాష్ట్రంలోనూ ఎన్నిక‌లు జ‌రిగితే పార్టీ న‌ష్ట‌పోతుంద‌నే ఉద్దేశంతో ఆయ‌న ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్లి భారీ విజ‌యం సాధించారు. ఇప్పుడు కూడా అలాగే మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త ఓ వైపు.. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో పుంజుకుంటున్న తీరు కేసీఆర్‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని స‌మాచారం.

ముఖ్యంగా బీజేపీ త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారుతుంద‌ని ఆయ‌న గ్ర‌హించార‌ని అందుకే ఆ పార్టీని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. అందుకే దాన్ని ఇప్పుడే క్యాష్ చేసుకుని ఈ ద‌శ‌లోనే రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ముంద‌స్తు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ముందు సంక్షేమ ప‌థ‌కాల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలిసింది.

ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాల‌ను మ‌రిన్ని తెర‌పైకి తెచ్చి ఆ త‌ర్వాత ముంద‌స్తు ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందుకే ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 19 నుంచి ఆయ‌న జిల్లాల్లో ప‌ర్య‌టిస్తారు. వ‌న‌ప‌ర్తి జిల్లాతో మొద‌లెట్టి జ‌న‌గామ‌, నాగ‌ర్‌క‌ర్నూలు, జ‌గిత్యాల‌, నిజామాబాద్‌, వికారాబాద్లో ప‌ర్య‌టిస్తారు. కొత్త క‌లెక్ట‌రేట్ల ప్రారంభోత్స‌వం, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం.. ఇలా ఈ పర్య‌ట‌న‌లో భాగంగా కేసీఆర్ చాలా కార్య‌క్ర‌మాలే పెట్టుకున్నారు. అయితే ఇవ‌న్నీ కేసీఆర్ ముంద‌స్తు అంచ‌నాల ప్ర‌కార‌మే జ‌రుగుతున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

This post was last modified on December 17, 2021 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

3 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

3 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

6 hours ago

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను…

8 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

16 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

16 hours ago