Political News

జిల్లాల‌కు కేసీఆర్.. మ‌ళ్లీ ముంద‌స్తు ఆలోచ‌న‌?

ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో మారుతున్న స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ కూడా రూటు మార్చిన‌ట్లే క‌నిపిస్తున్నారు. కేవ‌లం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లేదా ఫాంహౌస్‌కే సీఎం ప‌రిమిత‌మ‌వుతారంటూ విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు ఆయ‌న ఈ మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు జిల్లాల ప‌ర్య‌ట‌న చేశారు. ఆ త‌ర్వాత వివిధ కార‌ణాల వ‌ల్ల ఆగిపోయిన ఆయ‌న మళ్లీ ఇప్పుడు జిల్లాల బాట ప‌ట్ట‌నున్నారు. అయితే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల వెళ్లే ఆలోచ‌న ఏమైనా ఉందా? అని విశ్లేష‌కులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

2014 ఎన్నిక‌ల్లో గెలిచి తొలిసారి సీఎం పీఠంపై కూర్చున్న కేసీఆర్ 2018లో ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటే రాష్ట్రంలోనూ ఎన్నిక‌లు జ‌రిగితే పార్టీ న‌ష్ట‌పోతుంద‌నే ఉద్దేశంతో ఆయ‌న ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్లి భారీ విజ‌యం సాధించారు. ఇప్పుడు కూడా అలాగే మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త ఓ వైపు.. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో పుంజుకుంటున్న తీరు కేసీఆర్‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని స‌మాచారం.

ముఖ్యంగా బీజేపీ త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారుతుంద‌ని ఆయ‌న గ్ర‌హించార‌ని అందుకే ఆ పార్టీని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. అందుకే దాన్ని ఇప్పుడే క్యాష్ చేసుకుని ఈ ద‌శ‌లోనే రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ముంద‌స్తు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ముందు సంక్షేమ ప‌థ‌కాల‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలిసింది.

ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాల‌ను మ‌రిన్ని తెర‌పైకి తెచ్చి ఆ త‌ర్వాత ముంద‌స్తు ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందుకే ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 19 నుంచి ఆయ‌న జిల్లాల్లో ప‌ర్య‌టిస్తారు. వ‌న‌ప‌ర్తి జిల్లాతో మొద‌లెట్టి జ‌న‌గామ‌, నాగ‌ర్‌క‌ర్నూలు, జ‌గిత్యాల‌, నిజామాబాద్‌, వికారాబాద్లో ప‌ర్య‌టిస్తారు. కొత్త క‌లెక్ట‌రేట్ల ప్రారంభోత్స‌వం, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం.. ఇలా ఈ పర్య‌ట‌న‌లో భాగంగా కేసీఆర్ చాలా కార్య‌క్ర‌మాలే పెట్టుకున్నారు. అయితే ఇవ‌న్నీ కేసీఆర్ ముంద‌స్తు అంచ‌నాల ప్ర‌కార‌మే జ‌రుగుతున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

49 minutes ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

1 hour ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

1 hour ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

2 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago