Political News

ఆ స‌భ‌కు వెళ్ల‌ని ప‌వ‌న్.. అందుకేనా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మానికి కూడా అండ‌గా ఉంటార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. తిరుప‌తిలో పాద‌యాత్ర ముగించిన రైతులు.. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌భ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. దీనికి హాజ‌రు కావాల్సిందిగా ప‌వ‌న్‌కు క‌లిసి ఆహ్వానించారు. అందుకు ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డంతో స‌భ‌కు వ‌స్తార‌నే అనుకున్నారు. కానీ ఈ రోజు జ‌రిగే ఆ స‌భ‌కు ప‌వ‌న్ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌భ‌కు ప‌వ‌న్ రాక‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఈ అమ‌రావ‌తి పాద‌యాత్ర, స‌భ వెన‌క టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉన్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ  స‌భ‌కు ఆయ‌న‌తో పాటు బీజేపీ నేత‌లు కూడా హాజ‌ర‌వుతున్నారు.

ప‌వ‌న్ కూడా వ‌స్తే బాగుండేద‌ని బాబు భావించారంటా. కానీ ఈ స‌భ వెళ్లి అమ‌రావ‌తి రాజ‌ధానికి సంఘీభావం ప్ర‌కటిస్తే మిగ‌తా ప్రాంతాల ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించిన‌ట్లు స‌మాచారం. అందుకే ఈ స‌భ‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డ‌ట్లు తెలిసింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. కానీ దాన్ని వ్య‌తిరేకిస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీతో ప‌వ‌న్ మ‌ళ్లీ పొత్తు పెట్టుకున్నారు.

కానీ ఇప్పుడు ఆయ‌న ఆలోచ‌న మారిన‌ట్లు క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మెరుగైన ఫ‌లితాలు సాధించే దిశ‌గా పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై ప‌వ‌న్ దృష్టి సారించారు. ఈ స‌మ‌యంలో అమ‌రావ‌తికి జై కొట్టి విశాఖ‌, క‌ర్నూలు ప్ర‌జ‌ల దృష్టిలో ఎందుకు విల‌న్ కావ‌డం అని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు తెలిసింది. అందుకే ఈ స‌భ‌కు తాను హాజ‌రు కాకుండా పార్టీ త‌ర‌పున పీఎసీ స‌భ్యుడు హ‌రిప్ర‌సాద్‌, తిరుప‌తి ఇంఛార్జ్ కిర‌ణ్ రాయ‌ల్‌ను పంపిస్తున్నారు. మ‌రోవైపు సీపీఎం కూడా ఈ స‌భ‌కు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది. 

This post was last modified on December 17, 2021 1:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

5 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago