Political News

త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే!

ఏపీలో త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే ప్రారంభించ‌నున్నారు. ప్ర‌భుత్వ‌మే ఈ స‌ర్వేకు ప్రాతినిధ్యం వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో వ‌లంటీర్లను ప్ర‌ధానంగా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేల‌కు కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ స‌ర్వే ప్ర‌ధాన ఉద్దేశం మీకు మూడు రాజ‌ధానులు కావాలా? వ‌ద్దా? అన్న అంశంపై ప్ర‌జ‌ల‌ను నేరుగా ప్ర‌బుత్వం వివ‌ర‌ణ తీసుకోనుంది. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి చట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది.

రాష్ట్ర హైకోర్టులో కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. దీనికి కార‌ణాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల నుంచి పూర్తిస్థాయిలో విచార‌ణ చేసి.. వారి అభిప్రాయాల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటే.. ఎలాంటి న్యాయ‌స‌మ‌స్య‌లు వ‌చ్చినా.. తిప్పి కొట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ భావిస్తోంది. దీనికి ప్ర‌భుత్వం కూడా ప‌చ్చ‌జెండా ఊపింది. పాల‌న వికేంద్రీక‌ర‌ణ ద్వారా.. రాష్ట్రంలో అభివృద్ధిని సాధించే అవ‌కాశం ఉంటుంద‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తోంది.

అయితే.. దీనికి న్యాయ‌ప‌రంగా కొన్ని చిక్కులు రావ‌డంతో .. ప్ర‌స్తుతం ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వ‌ర‌లోనే మ‌ళ్లీ చ‌ట్టాలు చేస్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌నే నేరుగా ఈ అంశంపై విచారించి.. వారి అభిప్రాయాలు తెల‌సుకోనున్నారు. మొత్తం ఐదు ప్ర‌శ్న‌ల‌తో కూడిన క‌ర‌ప‌త్రాన్ని ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేసి.. త‌మ‌కు మూడు రాజ‌ధానులు కావాలో వ‌ద్దో తేల్చుకునే అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.

అయితే.. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. రాయ‌లసీమ‌లోని నాలుగు జిల్లాలు, ఉత్త‌రాంధ్రలోని మూడు జిల్లాల‌కు ప‌రిమితం చేయాల‌ని.. వైసీపీ భావిస్తోంది. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల ప్ర‌జ‌ల అభిప్రాయాలు తీసుకుందామ‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల ద్వారా.. ఈ స‌ర్వే చేయించి.. అనంత‌రం బిల్లును రూపొందించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు ప‌ట్టం క‌ట్టామ‌నే భావ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసుకునేందుకు ప‌క్కా ఆధారాల‌తో కూడా వుప‌యోగ ప‌డుతుంద‌ని.. స‌ర్కారు త‌ల‌పోస్తోంది. అంతేకాదు.. ప్ర‌జలు కోరుకున్న విధంగా పాల‌న అందించేందుకు కూడా ఇది తోడ్ప‌డుతుంద‌ని.. పైగా విప‌క్షాలు చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు కూడా చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.

This post was last modified on December 15, 2021 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

3 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

4 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

5 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

5 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

6 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

6 hours ago