Political News

త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే!

ఏపీలో త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే ప్రారంభించ‌నున్నారు. ప్ర‌భుత్వ‌మే ఈ స‌ర్వేకు ప్రాతినిధ్యం వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో వ‌లంటీర్లను ప్ర‌ధానంగా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేల‌కు కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ స‌ర్వే ప్ర‌ధాన ఉద్దేశం మీకు మూడు రాజ‌ధానులు కావాలా? వ‌ద్దా? అన్న అంశంపై ప్ర‌జ‌ల‌ను నేరుగా ప్ర‌బుత్వం వివ‌ర‌ణ తీసుకోనుంది. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి చట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది.

రాష్ట్ర హైకోర్టులో కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. దీనికి కార‌ణాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల నుంచి పూర్తిస్థాయిలో విచార‌ణ చేసి.. వారి అభిప్రాయాల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటే.. ఎలాంటి న్యాయ‌స‌మ‌స్య‌లు వ‌చ్చినా.. తిప్పి కొట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ భావిస్తోంది. దీనికి ప్ర‌భుత్వం కూడా ప‌చ్చ‌జెండా ఊపింది. పాల‌న వికేంద్రీక‌ర‌ణ ద్వారా.. రాష్ట్రంలో అభివృద్ధిని సాధించే అవ‌కాశం ఉంటుంద‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తోంది.

అయితే.. దీనికి న్యాయ‌ప‌రంగా కొన్ని చిక్కులు రావ‌డంతో .. ప్ర‌స్తుతం ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వ‌ర‌లోనే మ‌ళ్లీ చ‌ట్టాలు చేస్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌నే నేరుగా ఈ అంశంపై విచారించి.. వారి అభిప్రాయాలు తెల‌సుకోనున్నారు. మొత్తం ఐదు ప్ర‌శ్న‌ల‌తో కూడిన క‌ర‌ప‌త్రాన్ని ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేసి.. త‌మ‌కు మూడు రాజ‌ధానులు కావాలో వ‌ద్దో తేల్చుకునే అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.

అయితే.. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. రాయ‌లసీమ‌లోని నాలుగు జిల్లాలు, ఉత్త‌రాంధ్రలోని మూడు జిల్లాల‌కు ప‌రిమితం చేయాల‌ని.. వైసీపీ భావిస్తోంది. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల ప్ర‌జ‌ల అభిప్రాయాలు తీసుకుందామ‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల ద్వారా.. ఈ స‌ర్వే చేయించి.. అనంత‌రం బిల్లును రూపొందించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు ప‌ట్టం క‌ట్టామ‌నే భావ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసుకునేందుకు ప‌క్కా ఆధారాల‌తో కూడా వుప‌యోగ ప‌డుతుంద‌ని.. స‌ర్కారు త‌ల‌పోస్తోంది. అంతేకాదు.. ప్ర‌జలు కోరుకున్న విధంగా పాల‌న అందించేందుకు కూడా ఇది తోడ్ప‌డుతుంద‌ని.. పైగా విప‌క్షాలు చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు కూడా చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.

This post was last modified on December 15, 2021 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

56 minutes ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

3 hours ago

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

6 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

6 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

6 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

6 hours ago