Political News

ఏపీకి ఆర్ధిక క్ర‌మ శిక్ష‌ణ లేదు.. కేంద్రం ఫైర్‌

ఏపీకి ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ఫైరైంది. అందుకే ఆర్థిక లోటుతో ఇబ్బందు లు ప‌డుతోంద‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని కేంద్రం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు, ప్ర‌భుత్వం చేస్తున్న దుబారా తీవ్రంగా ఉంద‌ని కేంద్రం క‌డిగిపారేసింది. రాజ్య‌స‌భ‌లో ఆర్థిక ప‌రిస్థితిపై జ‌రిగిన చ‌ర్చ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఏపీ విష‌యంపై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. తాజాగా అందించిన నివేదిక‌లోని కొన్ని కీల‌క అంశాల‌ను ఈ సంద‌ర్భంగా ఆమె చ‌దివి వినిపించారు.

“ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ పాటించే రాష్ట్రాలే.. క‌రోనా కార‌ణంగా.. తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అలాంటి రాష్ట్రాల‌ను ఆదుకునేందుకే జీఎస్టీ చెల్లింపులు స‌హా ఇత‌ర రూపాల్లో సాయం చేస్తున్నాం. అయితే.. ఆర్థికంగా కొన్ని రాష్ట్రాలు క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌డం లేదు. ఇష్టాను సారం వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది“ అని తెలిపారు.

ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ పాటించ‌డంలో విఫ‌ల‌మైన రాష్ట్రాల్లో ఏపీ ముందువ‌రుస‌లో ఉంద‌ని.. త‌ర్వాత‌.. యూపీ, బీహార్‌, తెలంగాణ, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఉన్నాయ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏపీ విష‌యానికి వ‌స్తే.. రాష్ట్ర ప్ర‌బుత్వం ప్ర‌జ‌ల‌కు ఉచితాలు ఇవ్వ‌డం వ‌ల్ల‌.. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్ప‌డుతున్నా యని.. తెలిపారు. వీటిలో అమ్మ ఒడి, ఆస‌రా, సామాజిక ఫించ‌న్లు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌ల తెలిపారు.

అదేస‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు ఇస్తున్న నిధుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌బుత్వం ఆయా సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్న విష‌యాన్ని కాగ్ కూడా స్ప‌ష్టం చేసింద‌న్నారు. బ్యాంకులు, కార్పొరేష‌న్ల నుంచి రుణాలు తీసుకోవ‌డం త‌ప్పుకాద‌న్న మంత్రి నిర్మ‌ల .. అయితే.. ఇవి ప‌రిమితికి మించిపోయాయ‌ని తెలిపారు. ఇలాంటి వాటి వ‌ల్ల రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి భవిష్య‌త్తులో మ‌రింత దెబ్బ‌తింటుంద‌ని హెచ్చ‌రించారు. మొత్తానికి రాష్ట్ ఆర్థిక ప‌రిస్థితిపై తాము ఎప్ప‌టికప్పుడు నివేదిక‌లు ఇస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు.

This post was last modified on December 14, 2021 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago