వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగుళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఆ తర్వాత కూడా 4 గంటలపాటు విమానం డోర్లు తెరవకుండా ప్రయాణికులందరినీ విమానంలో ఉంచారు. ఈ విషయంపై విమానంలో ఉన్న రోజా ఓ మీడియా చానెల్ తో మాట్లాడారు. ఇండిగో విమాన యాజమాన్య తీరుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరులో ల్యాండ్ చేశారని తెలిపారు.
విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదని, 4 గంటలపాటు తనతో సహా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారని అన్నారు. మబ్బులుండడం వల్ల తిరుపతిలో కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని చెప్పారు.
కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తమకు తెలిసిందన్నారు. అయితే, తలుపులు తీస్తే బయటకు వెళ్లిపోతామని ప్రయాణికులు చెప్పినా సిబ్బంది వినలేదని, అధికారుల నుంచి తమకు ఆదేశాలు రాలేదని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, అదనంగా టికెట్కు రూ. 5వేలు అడిగారని, ఇండిగోపైన కేసు వేస్తానని రోజా అన్నారు.
This post was last modified on December 14, 2021 4:14 pm
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…
రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…
మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…
ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…