వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగుళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఆ తర్వాత కూడా 4 గంటలపాటు విమానం డోర్లు తెరవకుండా ప్రయాణికులందరినీ విమానంలో ఉంచారు. ఈ విషయంపై విమానంలో ఉన్న రోజా ఓ మీడియా చానెల్ తో మాట్లాడారు. ఇండిగో విమాన యాజమాన్య తీరుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరులో ల్యాండ్ చేశారని తెలిపారు.
విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదని, 4 గంటలపాటు తనతో సహా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారని అన్నారు. మబ్బులుండడం వల్ల తిరుపతిలో కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని చెప్పారు.
కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తమకు తెలిసిందన్నారు. అయితే, తలుపులు తీస్తే బయటకు వెళ్లిపోతామని ప్రయాణికులు చెప్పినా సిబ్బంది వినలేదని, అధికారుల నుంచి తమకు ఆదేశాలు రాలేదని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, అదనంగా టికెట్కు రూ. 5వేలు అడిగారని, ఇండిగోపైన కేసు వేస్తానని రోజా అన్నారు.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…