Political News

అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. తీవ్ర ఉత్కంఠ‌తో.. ఎదురు చూస్తున్న ఒక విష‌యానికి.. సానుకూల నిర్ణ యం వ‌చ్చింది. రైతుల మ‌నోభావాల‌కు త‌గిన విధంగా స‌ద‌రు నిర్ణ‌యం రావ‌డంతో.. రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం 44 రోజులుగా మ‌హాపాద‌యాత్రలో మునిగిపోయిన రైతుల‌కు నిద్ర‌, ఆహారాలు కూడా స‌రిగాలేవ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఏం ఉన్నా ఏం లేకున్నా.. రాజ‌ధాని ఉంటే చాల‌నే ఉత్సాహంతో వారు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.  

ఈ క్ర‌మంలో పాద‌యాత్ర చివ‌రిలో శ్రీవారిని ద‌ర్శించుకుని త‌మ గోడు వెళ్ల‌బోసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్న ప్ర‌భుత్వం.. త‌మ‌కు శ్రీవారిద‌ర్శ‌న‌మైనా జ‌రి గేలా చూస్తుందా? అని ఉత్కంఠ‌తో ఎదురుచూశారు. టీటీడీ ఈవోకు.. అనేక ద‌ఫాలుగా విన్న‌వించు కున్నా రు. అయితే.. దీనిపై టీటీడీ దోబూచులాడ‌డంతో రైతులు నిరుత్సాహంలో మునిగిపోయారు. దేవ‌దేవా.. నువ్వే క‌రుణించాల‌ని… వేడుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని రైతుల‌కు తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధి నుంచి స్వాగ‌తం ల‌భించింది. శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని   స్పష్టం చేసింది.

అంతేకాదు.. బుధవారం ఒక్కరోజే మొత్తం 500 మందికి శ్రీవారి దర్శనానికి టీటీడీ అంగీకరించింది. దీంతో ఇప్పుడు రాజ‌ధాని రైతులు ఆనంద ప‌ర‌వ‌శుల‌వుతున్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవం బర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులు గా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.  

ఈ క్ర‌మంలో ఈ రోజు సాయంత్రం ముగియ‌నున్న పాద యాత్ర‌.. అనంత‌రం.. శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. ఆదినుంచి ఉత్కంఠ‌గా మారిన శ్రీవారి ద‌ర్శ‌నం పై.. టీటీడీ అధికారులు సానుకూలంగా స్పందించ‌డంతో.. రైతులు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. రాజ‌ధాని ర‌గ‌డ‌ను శ్రీవారు ఆల‌కించార‌ని.. వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌యం త‌మ‌కే ద‌క్కుతుంద‌ని అంటున్నారు. 

This post was last modified on December 14, 2021 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

1 hour ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

2 hours ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

6 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

8 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

13 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

13 hours ago