Political News

అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. తీవ్ర ఉత్కంఠ‌తో.. ఎదురు చూస్తున్న ఒక విష‌యానికి.. సానుకూల నిర్ణ యం వ‌చ్చింది. రైతుల మ‌నోభావాల‌కు త‌గిన విధంగా స‌ద‌రు నిర్ణ‌యం రావ‌డంతో.. రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం 44 రోజులుగా మ‌హాపాద‌యాత్రలో మునిగిపోయిన రైతుల‌కు నిద్ర‌, ఆహారాలు కూడా స‌రిగాలేవ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఏం ఉన్నా ఏం లేకున్నా.. రాజ‌ధాని ఉంటే చాల‌నే ఉత్సాహంతో వారు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.  

ఈ క్ర‌మంలో పాద‌యాత్ర చివ‌రిలో శ్రీవారిని ద‌ర్శించుకుని త‌మ గోడు వెళ్ల‌బోసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్న ప్ర‌భుత్వం.. త‌మ‌కు శ్రీవారిద‌ర్శ‌న‌మైనా జ‌రి గేలా చూస్తుందా? అని ఉత్కంఠ‌తో ఎదురుచూశారు. టీటీడీ ఈవోకు.. అనేక ద‌ఫాలుగా విన్న‌వించు కున్నా రు. అయితే.. దీనిపై టీటీడీ దోబూచులాడ‌డంతో రైతులు నిరుత్సాహంలో మునిగిపోయారు. దేవ‌దేవా.. నువ్వే క‌రుణించాల‌ని… వేడుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని రైతుల‌కు తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధి నుంచి స్వాగ‌తం ల‌భించింది. శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని   స్పష్టం చేసింది.

అంతేకాదు.. బుధవారం ఒక్కరోజే మొత్తం 500 మందికి శ్రీవారి దర్శనానికి టీటీడీ అంగీకరించింది. దీంతో ఇప్పుడు రాజ‌ధాని రైతులు ఆనంద ప‌ర‌వ‌శుల‌వుతున్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవం బర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులు గా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.  

ఈ క్ర‌మంలో ఈ రోజు సాయంత్రం ముగియ‌నున్న పాద యాత్ర‌.. అనంత‌రం.. శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. ఆదినుంచి ఉత్కంఠ‌గా మారిన శ్రీవారి ద‌ర్శ‌నం పై.. టీటీడీ అధికారులు సానుకూలంగా స్పందించ‌డంతో.. రైతులు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. రాజ‌ధాని ర‌గ‌డ‌ను శ్రీవారు ఆల‌కించార‌ని.. వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌యం త‌మ‌కే ద‌క్కుతుంద‌ని అంటున్నారు. 

This post was last modified on December 14, 2021 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

2 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

2 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

3 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

5 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

5 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

5 hours ago