Political News

అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. తీవ్ర ఉత్కంఠ‌తో.. ఎదురు చూస్తున్న ఒక విష‌యానికి.. సానుకూల నిర్ణ యం వ‌చ్చింది. రైతుల మ‌నోభావాల‌కు త‌గిన విధంగా స‌ద‌రు నిర్ణ‌యం రావ‌డంతో.. రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం 44 రోజులుగా మ‌హాపాద‌యాత్రలో మునిగిపోయిన రైతుల‌కు నిద్ర‌, ఆహారాలు కూడా స‌రిగాలేవ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఏం ఉన్నా ఏం లేకున్నా.. రాజ‌ధాని ఉంటే చాల‌నే ఉత్సాహంతో వారు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.  

ఈ క్ర‌మంలో పాద‌యాత్ర చివ‌రిలో శ్రీవారిని ద‌ర్శించుకుని త‌మ గోడు వెళ్ల‌బోసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్న ప్ర‌భుత్వం.. త‌మ‌కు శ్రీవారిద‌ర్శ‌న‌మైనా జ‌రి గేలా చూస్తుందా? అని ఉత్కంఠ‌తో ఎదురుచూశారు. టీటీడీ ఈవోకు.. అనేక ద‌ఫాలుగా విన్న‌వించు కున్నా రు. అయితే.. దీనిపై టీటీడీ దోబూచులాడ‌డంతో రైతులు నిరుత్సాహంలో మునిగిపోయారు. దేవ‌దేవా.. నువ్వే క‌రుణించాల‌ని… వేడుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని రైతుల‌కు తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధి నుంచి స్వాగ‌తం ల‌భించింది. శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని   స్పష్టం చేసింది.

అంతేకాదు.. బుధవారం ఒక్కరోజే మొత్తం 500 మందికి శ్రీవారి దర్శనానికి టీటీడీ అంగీకరించింది. దీంతో ఇప్పుడు రాజ‌ధాని రైతులు ఆనంద ప‌ర‌వ‌శుల‌వుతున్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవం బర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులు గా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.  

ఈ క్ర‌మంలో ఈ రోజు సాయంత్రం ముగియ‌నున్న పాద యాత్ర‌.. అనంత‌రం.. శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. ఆదినుంచి ఉత్కంఠ‌గా మారిన శ్రీవారి ద‌ర్శ‌నం పై.. టీటీడీ అధికారులు సానుకూలంగా స్పందించ‌డంతో.. రైతులు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. రాజ‌ధాని ర‌గ‌డ‌ను శ్రీవారు ఆల‌కించార‌ని.. వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌యం త‌మ‌కే ద‌క్కుతుంద‌ని అంటున్నారు. 

This post was last modified on December 14, 2021 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago