ఏపీ రాజధాని అమరావతి రైతులు.. తీవ్ర ఉత్కంఠతో.. ఎదురు చూస్తున్న ఒక విషయానికి.. సానుకూల నిర్ణ యం వచ్చింది. రైతుల మనోభావాలకు తగిన విధంగా సదరు నిర్ణయం రావడంతో.. రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం 44 రోజులుగా మహాపాదయాత్రలో మునిగిపోయిన రైతులకు నిద్ర, ఆహారాలు కూడా సరిగాలేవనే విషయం తెలిసిందే. అయితే.. ఏం ఉన్నా ఏం లేకున్నా.. రాజధాని ఉంటే చాలనే ఉత్సాహంతో వారు మహాపాదయాత్ర చేస్తున్నారు.
ఈ క్రమంలో పాదయాత్ర చివరిలో శ్రీవారిని దర్శించుకుని తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ క్రమంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం.. తమకు శ్రీవారిదర్శనమైనా జరి గేలా చూస్తుందా? అని ఉత్కంఠతో ఎదురుచూశారు. టీటీడీ ఈవోకు.. అనేక దఫాలుగా విన్నవించు కున్నా రు. అయితే.. దీనిపై టీటీడీ దోబూచులాడడంతో రైతులు నిరుత్సాహంలో మునిగిపోయారు. దేవదేవా.. నువ్వే కరుణించాలని… వేడుకున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజధాని రైతులకు తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి స్వాగతం లభించింది. శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని స్పష్టం చేసింది.
అంతేకాదు.. బుధవారం ఒక్కరోజే మొత్తం 500 మందికి శ్రీవారి దర్శనానికి టీటీడీ అంగీకరించింది. దీంతో ఇప్పుడు రాజధాని రైతులు ఆనంద పరవశులవుతున్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవం బర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులు గా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ముగియనున్న పాద యాత్ర.. అనంతరం.. శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఆదినుంచి ఉత్కంఠగా మారిన శ్రీవారి దర్శనం పై.. టీటీడీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో.. రైతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రాజధాని రగడను శ్రీవారు ఆలకించారని.. వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయం తమకే దక్కుతుందని అంటున్నారు.
This post was last modified on December 14, 2021 3:01 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…