వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. అంతకు మించి గుసగుసగా చర్చనీయాంశంగా తయారైంది. ముఖ్యంగా తాడేపల్లి వర్గాలు ఈ విషయంపై చర్చకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు పార్టీ నేతలే! దీనికి కారణం.. చూస్తే.. ఇటీవల కాలంలో ప్రతిపక్షాల దాడి ఎక్కువైంది. అయిన దానికి కాని దానికి కూడా ప్రతిపక్షాలు భారీ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో.. విపక్షాలకు సరైన విధంగా సమాధానం చెప్పాలని.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా జగన్ అభిమానులుగా ఉన్నవారు భావిస్తున్నారు.
వీరిలో అనంతపురం నుంచి విశాఖ వరకు.. చాలా మందే కనిపిస్తున్నారు. కానీ.. ఒకరిద్దరికి తప్ప..ఛాన్స్ దక్కడం లేదు. అది కూడా.. నేరుగా మీడియాతో మాట్లాడడానికి లేదని.. స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. నిజమే.. ఎవరు బడితే.. వారు మీడియాతో మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే అధికార ప్రతి నిధులను పార్టీలు నియమించుకుంటాయి. అలానే వైసీపీలోనూ అధికార ప్రతినిధులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు వారు కూడా ఎక్కువ మంది మీడియా ముందుకు రావడం లేదు.
ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం చర్చకు దారితీసిం ది. దీనిని పరిశీలిస్తే.. అధికార ప్రతినిధులు కూడా తాడేపల్లి నుంచి అనుమతి పొందాల్సిన పరిస్థితి ఏర్ప డిందని అంటున్నారు. అంటే. ఒక కీలక సలహాదారు అనుమతి ఉంటే తప్ప.. అధికార ప్రతినిధి అయిన ప్పటికీ.. మీడియా ముందుకు రాకూడదనే కట్టుబాటును అమలు చేస్తున్నారట. దీంతోటీడీపీ సహా ఇతర పార్టీల నుంచి ఎదురవుతున్న సూటి పోటి విమర్శలకు తాము సమాధానం చెప్పలేక పోతున్నామని అంటున్నారు.
ఈ విషయంలో పార్టీ అధిష్టానం పరిశీలించాలని నాయకులు కోరుతున్నారు. ఎక్కడ అవసరమైతే.. అక్క డ ఎప్పుడు అవసరం అనుకుంటే.. అప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని.. ఈ విషయంలో పీకులాట ఎందుకని నాయకులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on December 13, 2021 3:26 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…