Political News

ఎన్టీఆర్ వ‌ర్సిటీ వివాదం.. 400కోట్లు ఎక్కడ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ నిధుల మ‌ళ్లింపు వివాదం ఎలాంటి మ‌లుపు తీసుకోనుందో ఈ రోజు తేలే అవ‌కాశం ఉంది. ఈ యూనివ‌ర్సిటీకి చెందిన నిధుల‌ను ప్ర‌భుత్వం తీసుకోవ‌డాన్ని నిర‌సిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు కొన్ని రోజుల‌గా ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆందోళ‌న‌ల కార‌ణంగా ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఆందోళ‌న‌కు ఒక ముగింపు ఇచ్చే దిశ‌గా ఉద్యోగులు, విద్యార్థుల‌తో చ‌ర్చించాల‌ని వీసీ, రిజిస్ట్రార్ నిర్ణ‌యించారు.

వాళ్ల‌ను సోమ‌వారం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు. ఈ చ‌ర్చ‌ల్లో ఏదో ఓ విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయా? లేదా నిధుల‌ను వెన‌క్కి తెచ్చే విష‌యంపై ఏదైనా హామీ ల‌భిస్తుందా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వ ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ కార్య‌కాలాపాలు సాగాల‌న్నా ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వాల‌న్నా సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందాల‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పు చేయాల్సిందే. ఇప్ప‌టికే ఏపీ అప్పు రూ.7 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మేమో అన్ని విధాలుగా ఖ‌జానాలోకి డ‌బ్బులు స‌మ‌కూర్చ‌డంపై దృష్టి పెట్టింది.

ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీకి చెందిన రూ.400 కోట్లు గ‌త నెల‌లో ప్ర‌భుత్వ చేతుల్లోకి వెళ్లాయి. ప్ర‌భుత్వ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ కార్పొరేష‌న్‌లోకి డ‌బ్బుల బ‌దిలీ ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇదంతా జ‌గ‌న్ ఆదేశాల‌తో వీసీ డా.పి.శ్యామ్‌ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. విశ్వ‌విద్యాల‌య అభివృద్ధి కోసం నిధులు రూ.448 కోట్లు క‌ష్ట‌ప‌డి కూడ‌బెట్టామ‌ని, వీటిలో రూ.400 కోట్ల‌ను ప్ర‌భుత్వ కొత్త సంస్థ‌కు వీసీ ఏక‌ప‌క్షంగా బ‌దిలీ చేశార‌ని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వీసీకి వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. దీంతో స్నాత‌కోత్స‌వంతో పాటు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు.

ప్ర‌భుత్వం వెంట‌నే నిధులు తిరిగి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. యూనివ‌ర్సిటీలో రోజువారీ ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బుల్లేని దుస్థితి వ‌చ్చింద‌ని, 150 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని వాళ్లు వాపోతున్నారు. మ‌రోవైపు వీసీ మాత్రం ఇది త‌న‌ బాస్ ఆజ్ణ అని ఆయ‌న చెప్పిన‌ట్లు చేయ‌డ‌మే త‌న ప‌ని అని జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. దీంతో సోమ‌వారం నుంచి ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తామ‌ని ఉద్యోగులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆందోళ‌న చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థుల‌ను చ‌ర్చ‌ల‌కు వీసీ ఆహ్వానించారు.

This post was last modified on December 13, 2021 2:42 pm

Share

Recent Posts

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

25 minutes ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

45 minutes ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

58 minutes ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

1 hour ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

1 hour ago

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

2 hours ago