Political News

తిరుపతిలో అమరావతి జేఏసీ సెంటిమెంట్ !

మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో అమరావతి జేఏసీ బలప్రదర్శనకు రెడీ అవుతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈనెల 16వ తేదీకి పాదయాత్ర తిరుపతికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ఎత్తున వివిధ పార్టీల శ్రేణులు ఏకమవ్వాలని ప్లాన్ జరుగుతోందట. టీడీపీ నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్రలో బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు పార్టిసిపేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  

పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలోకి పాదయాత్ర ఎంటరైన దగ్గర నుండి పై పార్టీల నేతలంతా సమన్వయంతోనే ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి అంటేనే రాష్ట్రంలో ప్రత్యేక ఇమేజి ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా అందుకు వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలుంటాయనే సెంటిమెంటు ఉంది.

ఈ సెంటిమెంటులో భాగంగానే భారీ బహిరంగ సభ నిర్వహణకు రెడీ అయ్యారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకనే అర్జంటుగా కోర్టును ఆశ్రయించే పనిలో నిర్వాహకులు ఉన్నారు. కోర్టు బహిరంగ సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా బలప్రదర్శన ద్వారా సత్తా చాటాలని అమరావతి జేఏసీ తరపున పై పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సభ జరిగితే జనాలను తీసుకురావటం లేకపోతే పెద్ద ఎత్తున తిరుపతి వీధుల్లో ర్యాలీ నిర్వహించాలని నిర్వాహకులు అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పై పార్టీల నేతలంతా ఒక జట్టుగా ఏర్పడి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే అమరావతి పాదయాత్రను తిరుపతిలో అడ్డుకుంటామంటు రాయలసీమ మేధావుల ఫోరం, వైయస్సార్ విద్యార్థి విభాగం ప్రకటించారు. నిజానికి పాదయాత్రను కానీ లేదా బహిరంగ సభ లేదా ర్యాలీని ఎవరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ కోరుకోవడంలో తప్పేలేదు. అలాగే మూడు రాజధానులు ఉండాలని డిమాండ్ చేయటమూ తప్పుకాదు.

అంత మాత్రం దానికి ఒకళ్ళని అడ్డుకుంటామని మరొకళ్ళు హెచ్చరించటం మాత్రం తప్పే. ఎందుకంటే దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ తలెత్తుతుంది. దీనివల్ల ప్రభుత్వం అంటే అధికార పార్టీకి నష్టమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అమరావతి జేఏసీ పాదయాత్రను పట్టించుకోని వారు చూడా రేపు గొడవ జరిగితే ఏమైందని ఆరా తీస్తారు. కాబట్టి ఒకళ్ళ విషయంలో మరొకళ్ళు పట్టించుకోకుండా ఉంటేనే అందరికీ మంచిది.

Satya

Recent Posts

కంబ్యాక్ హీరోని రిసీవ్ చేసుకున్నారా

దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…

1 hour ago

నితిన్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్?

టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…

1 hour ago

పెద్దికి రెచ్చిపోయి ఇప్పుడు దొరికిపోయారు

సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…

2 hours ago

నీట్ పరీక్ష రాయాలంటే అబుదాబీకి వెళ్లాలా?

నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…

2 hours ago

బండి భగీరథ్ కు బెయిల్

పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్‌కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు…

3 hours ago

ఎవరయ్యా ఈ సమంత ఫ్రెండు…

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…

4 hours ago