మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో అమరావతి జేఏసీ బలప్రదర్శనకు రెడీ అవుతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈనెల 16వ తేదీకి పాదయాత్ర తిరుపతికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ఎత్తున వివిధ పార్టీల శ్రేణులు ఏకమవ్వాలని ప్లాన్ జరుగుతోందట. టీడీపీ నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్రలో బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు పార్టిసిపేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలోకి పాదయాత్ర ఎంటరైన దగ్గర నుండి పై పార్టీల నేతలంతా సమన్వయంతోనే ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి అంటేనే రాష్ట్రంలో ప్రత్యేక ఇమేజి ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా అందుకు వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలుంటాయనే సెంటిమెంటు ఉంది.
ఈ సెంటిమెంటులో భాగంగానే భారీ బహిరంగ సభ నిర్వహణకు రెడీ అయ్యారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకనే అర్జంటుగా కోర్టును ఆశ్రయించే పనిలో నిర్వాహకులు ఉన్నారు. కోర్టు బహిరంగ సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా బలప్రదర్శన ద్వారా సత్తా చాటాలని అమరావతి జేఏసీ తరపున పై పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సభ జరిగితే జనాలను తీసుకురావటం లేకపోతే పెద్ద ఎత్తున తిరుపతి వీధుల్లో ర్యాలీ నిర్వహించాలని నిర్వాహకులు అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పై పార్టీల నేతలంతా ఒక జట్టుగా ఏర్పడి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే అమరావతి పాదయాత్రను తిరుపతిలో అడ్డుకుంటామంటు రాయలసీమ మేధావుల ఫోరం, వైయస్సార్ విద్యార్థి విభాగం ప్రకటించారు. నిజానికి పాదయాత్రను కానీ లేదా బహిరంగ సభ లేదా ర్యాలీని ఎవరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ కోరుకోవడంలో తప్పేలేదు. అలాగే మూడు రాజధానులు ఉండాలని డిమాండ్ చేయటమూ తప్పుకాదు.
అంత మాత్రం దానికి ఒకళ్ళని అడ్డుకుంటామని మరొకళ్ళు హెచ్చరించటం మాత్రం తప్పే. ఎందుకంటే దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ తలెత్తుతుంది. దీనివల్ల ప్రభుత్వం అంటే అధికార పార్టీకి నష్టమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అమరావతి జేఏసీ పాదయాత్రను పట్టించుకోని వారు చూడా రేపు గొడవ జరిగితే ఏమైందని ఆరా తీస్తారు. కాబట్టి ఒకళ్ళ విషయంలో మరొకళ్ళు పట్టించుకోకుండా ఉంటేనే అందరికీ మంచిది.
This post was last modified on December 12, 2021 11:37 pm
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…