ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తొలిసారి.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విజృంభించారు. మోడీ హిందువు కాదని.. ఆయన హిందూత్వ వాది అని చెప్పారు. హిందువును అధికారంలోకి ఉంచుకోవచ్చన్న ఆయన.. హిందూత్వవాదిని ఒక్క నిముషం కూడా అధికారంలోకి ఉంచడానికి వీల్లేదని చెప్పారు. మోడీని తరిమికొట్టేందుకు ప్రజలు సన్నద్ధులు కావాలని రాహుల్ పిలుపునిచ్చారు.
భారత రాజకీయాల్లో హిందూ- హిందుత్వవాది అనే రెండు పదాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అని రాహుల్ గాంధీ చెప్పారు. రాజధాని రాజధాని జైపూర్లో జరిగిన బహిరంగ సభలో చాలా ఉద్వేగంగా ఆయన ప్రసంగించారు. ప్రతి మాటలోనూ మోడీని టార్గెట్ చేశారు. అదేసమయంలో బీజేపీని కూడా ఎండగట్టారు. మహాత్మాగాంధీ హిందూ అని, గాడ్సే హిందుత్వవాదని చెప్పారు. హిందుత్వవాదులు జీవితామంతా అధికారం కోసం తపిస్తుంటారని విమర్శించారు.
ఇలాంటి వారిలో కరడు గట్టిన హిందూత్వ వాదానికి మోడీ ప్రతిరూపమని విమర్శలు గుప్పించారు. హిందుత్వవాదులు సత్యాగ్రహం పాటించరని, అధికారం కోసం పాకులాడతారని ఎద్దేవా చేశారు. హిందుత్వవాదులు 2014 నుంచి అధికారంలో ఉన్నారని, వారిని అధికారం నుంచి తొలగించి హిందువులకు అధికారం కట్టబెట్టాలని,.. తక్షణమే వారిని తరిమి కొట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు. హిందువంటే అందరినీ కలుపుకుని పోయేవాడని, ఎవరికీ భయపడడని రాహుల్ చెప్పారు. అన్ని మతాలనూ గౌరవించేవాడే హిందువని అన్నారు.
”కానీ, మోడీకి ఎస్సీలంటే గిట్టరు. ముస్లిం మైనార్టీ అంటే.. గిట్టదు. వారికి ఎవరికీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కూడా కల్పించరు. కనీసం.. వారిని చూసేందుకు కూడా ఇష్టపడరు. అలాంటి వారిని హిందువుగా ఎలా పరిగణిస్తాం. వారికి గాడ్సే దేవుడు. గాడ్సే జయంతులు వారికి పండగలు. అలాంటి వారు ఒక్కనిముషం కూడా అధికారంలో ఉండేందుకు అవకాశం లేదు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. హిందువుగా చలామణి అవుతున్న పెద్ద హిందూత్వ వాది!” అని మోడీని కార్నర్ చేస్తూ.. నిప్పులు చెరిగారు. కాగా, జైపూర్ బహిరంగసభకు జనం కనీ వినీ ఎరుగని రీతిలో తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్ పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ సభకు హాజరయ్యారు.
This post was last modified on December 12, 2021 8:27 pm
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…