ఏపీ సీఎం జగన్ అంటే ప్రజలకు ఎంతో అభిమానమని .. ఆ పార్టీ నేతలు తరచుగా చెబుతుంటారు. అంతే కాదు.. ప్రజలకు ఉన్న అభిమానమే ఎన్నికల్లో ఓట్ల రూపంలో రాలుతోందని కూడా వినిపిస్తుంటారు. అయితే.. ఇప్పుడు నిజంగానే ప్రజలు జగన్పై అభిమానం చూపిస్తున్నారు. జగనన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ.. రోడ్లపై బ్యానర్లు పెడుతున్నారు. దీనికి కారణం ఏంటి. ఎందుకు? అంటే.. చిత్రమైన సమాధానమే వస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు తీవ్ర అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.
అయితే అధికారంలో ఉన్న జగన్ సర్కారు మాత్రం రోడ్ల బాగు గురించి సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు.
ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గతంలో కొందరు విశాఖలోనూ.. ఇలానే రోడ్ల దుస్తితిపై.. చమత్కారంగా.. చురకలు అంటించారు. అయినప్పటికీ.. ప్రభుత్వం స్పదించలేదు. మరి ఇప్పటికైనా.. సర్కారు ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.
This post was last modified on December 12, 2021 2:38 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…