ఏపీ సీఎం జగన్ అంటే ప్రజలకు ఎంతో అభిమానమని .. ఆ పార్టీ నేతలు తరచుగా చెబుతుంటారు. అంతే కాదు.. ప్రజలకు ఉన్న అభిమానమే ఎన్నికల్లో ఓట్ల రూపంలో రాలుతోందని కూడా వినిపిస్తుంటారు. అయితే.. ఇప్పుడు నిజంగానే ప్రజలు జగన్పై అభిమానం చూపిస్తున్నారు. జగనన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ.. రోడ్లపై బ్యానర్లు పెడుతున్నారు. దీనికి కారణం ఏంటి. ఎందుకు? అంటే.. చిత్రమైన సమాధానమే వస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు తీవ్ర అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.
అయితే అధికారంలో ఉన్న జగన్ సర్కారు మాత్రం రోడ్ల బాగు గురించి సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు.
ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గతంలో కొందరు విశాఖలోనూ.. ఇలానే రోడ్ల దుస్తితిపై.. చమత్కారంగా.. చురకలు అంటించారు. అయినప్పటికీ.. ప్రభుత్వం స్పదించలేదు. మరి ఇప్పటికైనా.. సర్కారు ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.
This post was last modified on December 12, 2021 2:38 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…