Political News

‘జ‌గ‌న‌న్న ఉన్నాడు జాగ్ర‌త్త‌..’ రోడ్ల‌పై వెలుస్తున్న బ్యాన‌ర్లు…

ఏపీ సీఎం జ‌గ‌న్ అంటే ప్ర‌జ‌ల‌కు ఎంతో అభిమాన‌మ‌ని .. ఆ పార్టీ నేత‌లు త‌ర‌చుగా చెబుతుంటారు. అంతే కాదు.. ప్ర‌జ‌ల‌కు ఉన్న అభిమాన‌మే ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో రాలుతోంద‌ని కూడా వినిపిస్తుంటారు. అయితే.. ఇప్పుడు నిజంగానే ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై అభిమానం చూపిస్తున్నారు. జ‌గ‌నన్న ఉన్నాడు జాగ్ర‌త్త అంటూ.. రోడ్ల‌పై బ్యాన‌ర్లు పెడుతున్నారు. దీనికి కార‌ణం ఏంటి. ఎందుకు? అంటే.. చిత్ర‌మైన స‌మాధాన‌మే వ‌స్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి ప్ర‌స్తుతం వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు తీవ్ర అధ్వాన్న ప‌రిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.

అయితే అధికారంలో ఉన్న జగన్ సర్కారు మాత్రం రోడ్ల బాగు గురించి సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు.

ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గ‌తంలో కొంద‌రు విశాఖ‌లోనూ.. ఇలానే రోడ్ల దుస్తితిపై.. చ‌మ‌త్కారంగా.. చుర‌క‌లు అంటించారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం స్ప‌దించ‌లేదు. మ‌రి ఇప్ప‌టికైనా.. స‌ర్కారు ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.

This post was last modified on December 12, 2021 2:38 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago