Political News

పునరాలోచనలో జగన్… చేయక తప్పదుగా !

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు తదితర విషయాలపై జగన్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి పీఆర్సీని అమలు చేయలేని పక్షంలో ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఇపుడు అమలు చేయాల్సిన పీఆర్సీ 2018, జూలై నుండి పెండింగ్ లో ఉంది.

సరే ప్రస్తుత విషయానికి వస్తే పీఆర్సీ ఎంత ఫిట్మెంట్ ఫిక్స్ చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత పడుతుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చే జరిగింది. ఉన్నతాధికారులు రకరకాలుగా కాలిక్యులేషన్లు వేసి లెక్కలు సీఎంకు చూపారని సమాచారం. ఉద్యోగ సంఘాలు మాత్రం 50 శాతం ఫిట్ మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల ప్రకారం ఫైనల్ ఫిట్మెంట్ 30-35 శాతం మధ్య ఫిక్సయ్యే అవకాశం ఉందని చెప్పాయి.

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. ఎంత వివరించినా, ఎంత కసరత్తు చేసినా ఫైనల్ గా పీఆర్సీ అయితే అమలు చేయక తప్పదు. పీఆర్సీ అమలును వాయిదా వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జగన్ గ్రహించాలి. పీఆర్సీ అమలును ఎంత వాయిదా వేస్తే ప్రభుత్వానికి అంత నష్టం తప్పదు. ఈనెల 7వ తేదీ నుంచి మొదలైన ఉద్యోగ సంఘాల సమ్మె ఇందులో భాగమనే చెప్పాలి. ఏదో పద్దతిలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఫిట్మెంట్ ను ఫైనల్ చేసుకోవటమే మంచిది.

జగన్ సమక్షంలో జరిగిన సుదీర్ఘ చర్చల కారణంగా ఒకటి, రెండు రోజుల్లో ఉద్యోగసంఘాల నేతలతో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు సమావేశం జరపనున్నారు. జగన్ సమక్షంలో జరిగిన రివ్యూ అంశాలను ఫిట్మెంట్ వివరాలను నేతలకు ఉన్నతాధికారులు వివరించబోతున్నారట. ఈ సమావేశంలో రెండు వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫైనల్ గా సీఎంతో నేతలు భేటీ రెడీ అవుతుంది. వాళ్ళ సమక్షంలోనే సీఎం ఫిట్మెంట్ ఎంతన్నది ప్రకటిస్తారని తెలిసింది.

This post was last modified on December 10, 2021 8:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

39 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago