గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ పై క్షమాపణ చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వంశీ అనేక షాకింగ్ కామెంట్లు చేశారు.
తాను ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే అని, వైసీపీలో చేరే అవకాశమే లేదని వంశీ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలు పరిష్కారానికే వైసీపీకి మద్దతిచ్చానని చెప్పారు. అంతేగానీ, వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు లేవన్నారు. టీడీపీకి ఉన్న 23మంది ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీకి దూరమయ్యారని, కాబట్టి తనలాంటి వారిని దూరం చేసుకుంటే చంద్రబాబుకే నష్టమని అన్నారు.
టెక్నికల్ గా తాను టీడీపీలోనే ఉన్నానని, తనపై చర్యలు తీసుకుంటే టీడీపీ బలం తగ్గి, ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందన్నారు. తనను ఎవరూ ప్రలోభాలకు గురి చేయలేదని, అసలు జగన్ తనను వైసీపీలోకి రమ్మని ఎప్పుడూ ఆహ్వానించలేదని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా తీయడానికి ముందు రామ్ గోపాల్ వర్మ తనతోపాటు పలువురు రాజకీయ నాయకులను కలిశారని వంశీ అన్నారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన కొంత సమాచారాన్ని వర్మతో పంచుకున్నానని చెప్పారు.
అయితే, ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో పరిటాల రవి- పవన్ లపై వర్మ పెట్టిన పోస్ట్ తన దృష్టికి వచ్చిందని, ఆ విషయంలో తనకు, వర్మకు మధ్య వాదన జరిగిందని అన్నారు. పరిటాల రవి, పవన్ కల్యాణ్ అసలు కలుసుకోలేదని, అటువంటిది పవన్ కు పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తల్లో నిజం లేదని తాను వాదించినట్లు వంశీ చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఆ సీన్ పెట్టలేదని గుర్తు చేసుకున్నారు.
This post was last modified on December 10, 2021 7:28 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…