Political News

నాపై వేటేస్తే టీడీపీకే నష్టం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ పై క్షమాపణ చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వంశీ అనేక షాకింగ్ కామెంట్లు చేశారు.

తాను ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే అని, వైసీపీలో చేరే అవకాశమే లేదని వంశీ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలు పరిష్కారానికే వైసీపీకి మద్దతిచ్చానని చెప్పారు. అంతేగానీ, వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు లేవన్నారు. టీడీపీకి ఉన్న 23మంది ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీకి దూరమయ్యారని, కాబట్టి తనలాంటి వారిని దూరం చేసుకుంటే చంద్రబాబుకే నష్టమని అన్నారు.

టెక్నికల్ గా తాను టీడీపీలోనే ఉన్నానని, తనపై చర్యలు తీసుకుంటే టీడీపీ బలం తగ్గి, ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందన్నారు. తనను ఎవరూ ప్రలోభాలకు గురి చేయలేదని, అసలు జగన్ తనను వైసీపీలోకి రమ్మని ఎప్పుడూ ఆహ్వానించలేదని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా తీయడానికి ముందు రామ్ గోపాల్ వర్మ తనతోపాటు పలువురు రాజకీయ నాయకులను కలిశారని వంశీ అన్నారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన కొంత సమాచారాన్ని వర్మతో పంచుకున్నానని చెప్పారు.

అయితే, ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో పరిటాల రవి- పవన్ లపై వర్మ పెట్టిన పోస్ట్ తన దృష్టికి వచ్చిందని, ఆ విషయంలో తనకు, వర్మకు మధ్య వాదన జరిగిందని అన్నారు. పరిటాల రవి, పవన్ కల్యాణ్ అసలు కలుసుకోలేదని, అటువంటిది పవన్ కు పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తల్లో నిజం లేదని తాను వాదించినట్లు వంశీ చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఆ సీన్ పెట్టలేదని గుర్తు చేసుకున్నారు.

This post was last modified on December 10, 2021 7:28 pm

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

4 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

5 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

18 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago