Political News

జగన్ డెడ్ లైన్ దాటిపోయిందే !

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రివర్గ ప్రక్షాళన వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారమైతే ఈనెల 6వ తేదీకి రెండున్నరేళ్ళవుతుంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్ మాట్లాడుతూ రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మార్చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండున్నరేళ్లు కాకముందు నుండే మంత్రివర్గం ప్రక్షాళనపై పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయింది.

పార్టీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంత్రివర్గం ప్రక్షాళనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఇపుడు రెండున్నరేళ్ళయిన సందర్భంగా పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదేమిటంటే మంత్రివర్గంలో మార్పులకు మరో ఆరుమాసాల సమయం ఉందట. కరోనా వైరస్ కారణంగా చాలామంది మంత్రులు పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం దొరకలేదని కొందరు మంత్రులు జగన్ కు చెప్పుకున్నారట. మంత్రుల సామర్థ్యాన్ని పక్కన పెట్టేస్తే కారణమైతే వాస్తవమే.

మంత్రులతో చర్చల సందర్భంగా కరోనా వైరస్ కారణాన్ని జగన్ కూడా అంగీకరించారట. ఇప్పటికిప్పుడు మంత్రులందరినీ మార్చి కొత్త వాళ్ళని తీసుకున్నా సమస్యలు వస్తాయని కూడా మరికొందరు జగన్ తో చెప్పారట. షెడ్యూల్ ఎన్నికలకు గడువు ఉన్నది రెండున్నరేళ్ళే కాబట్టి కొత్తవారు మంత్రులుగా కుదురుకోవటానికి చాలా సమయం పడుతుందని చెప్పారట. ఈలోగా ముందస్తు ఎన్నికలంటే ఇంకా ఇబ్బంది అయిపోతుందని కొందరు జగన్ తో అన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

అందుకనే మధ్యేమార్గంగా మంత్రులందరినీ కాకుండా ఓ పదిమందిని కంటిన్యూ చేసి మిగిలిన వారిని మార్చేస్తే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అదికూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాతే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ నెలలో క్రిస్మస్ అయిపోయిన వెంటనే ప్రక్షాళన ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తాజా ప్రకారమైతే మార్చిలోనే ఉంటుందంటున్నారు. ఏదేమైనా మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో జగన్ ఆలోచనలకు ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. చివరకు జగన్ ఏమి చేస్తారో ఏమో.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

6 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

8 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

10 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago