పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రివర్గ ప్రక్షాళన వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారమైతే ఈనెల 6వ తేదీకి రెండున్నరేళ్ళవుతుంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్ మాట్లాడుతూ రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మార్చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండున్నరేళ్లు కాకముందు నుండే మంత్రివర్గం ప్రక్షాళనపై పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయింది.
పార్టీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంత్రివర్గం ప్రక్షాళనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఇపుడు రెండున్నరేళ్ళయిన సందర్భంగా పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదేమిటంటే మంత్రివర్గంలో మార్పులకు మరో ఆరుమాసాల సమయం ఉందట. కరోనా వైరస్ కారణంగా చాలామంది మంత్రులు పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం దొరకలేదని కొందరు మంత్రులు జగన్ కు చెప్పుకున్నారట. మంత్రుల సామర్థ్యాన్ని పక్కన పెట్టేస్తే కారణమైతే వాస్తవమే.
మంత్రులతో చర్చల సందర్భంగా కరోనా వైరస్ కారణాన్ని జగన్ కూడా అంగీకరించారట. ఇప్పటికిప్పుడు మంత్రులందరినీ మార్చి కొత్త వాళ్ళని తీసుకున్నా సమస్యలు వస్తాయని కూడా మరికొందరు జగన్ తో చెప్పారట. షెడ్యూల్ ఎన్నికలకు గడువు ఉన్నది రెండున్నరేళ్ళే కాబట్టి కొత్తవారు మంత్రులుగా కుదురుకోవటానికి చాలా సమయం పడుతుందని చెప్పారట. ఈలోగా ముందస్తు ఎన్నికలంటే ఇంకా ఇబ్బంది అయిపోతుందని కొందరు జగన్ తో అన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అందుకనే మధ్యేమార్గంగా మంత్రులందరినీ కాకుండా ఓ పదిమందిని కంటిన్యూ చేసి మిగిలిన వారిని మార్చేస్తే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అదికూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాతే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ నెలలో క్రిస్మస్ అయిపోయిన వెంటనే ప్రక్షాళన ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తాజా ప్రకారమైతే మార్చిలోనే ఉంటుందంటున్నారు. ఏదేమైనా మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో జగన్ ఆలోచనలకు ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. చివరకు జగన్ ఏమి చేస్తారో ఏమో.
This post was last modified on December 10, 2021 11:40 am
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…