Political News

సీఎం అయ్యాక చేసే మొదటి పని అదే: CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము అధికారంలోకి రాగానే.. ఫ‌స్ట్‌.. త‌మ పార్టీ కార్య‌కర్త‌ల‌ను, నాయ‌కుల‌ను వేధించిన వారి అంతుచూస్తామ‌ని.. వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తు పెట్ఉట‌కుంటున్నామ‌ని.. చెప్పారు. అదేస‌మ‌యంలో ప్రతి కార్యకర్తకు టిడిపి అధిష్టానం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.  

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో తాజాగా ఆయ‌న  సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల వ్యవస్థను అధికార పార్టీ నాయకులు అపహాస్యం చేశారని మండిప‌డ్డారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని… బెదిరింపులు, తప్పుడు కేసులతో అధికార పార్టీకి వంత పాడారనీ అన్నారు.  ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్ధుల్ని, వారి బంధువుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి.. కనీసం ఎన్నికల ప్రచారం కూడా చేయనివ్వకుండా అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు.

కొంత మంది అభ్యర్ధులకు డబ్బు ఎర చూపి, మరికొందరిని వ్యాపారాలు మూయించేస్తామని బెదిరించారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ గెలుపు తధ్యమని భావించిన వార్డుల్లో ఓటర్లను బెదిరించడం, పోలింగ్ శాతం తగ్గించడం కోసం ఓట్ల తారుమారు వంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఎన్నికల వ్యవస్థను ప్రభుత్వం దిగజార్చిన విషయం రాష్ట్రమంతా చూస్తోందని చంద్ర‌బాబు అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను హైజాక్ చేస్తూ అపహాస్యం చేయడాన్ని ఆక్షేపించారు. కష్టబడి, ప్రజల్లో అభిమానం పొందిన నాయకులకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అదే సమయంలో తప్పుడు కేసులతో వేధింపులకు దిగుతున్న అధికారులకు తగిన బుద్ధి చెప్పడం తధ్యమనీ హెచ్చరించారు. కార్యకర్తలు భయపడకుండా పోరాడినప్పుడే వ్యక్తిగా, వ్యవస్థగా ముందుకు సాగగలమని సూచించారు.

This post was last modified on December 7, 2021 3:23 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

36 mins ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

2 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

2 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

3 hours ago

విజ‌య గంటా మోగేనా?

టీడీపీ సీనియ‌ర్ నేత గంటా శ్రీనివాస‌రావు వ‌రుస‌గా అయిదోసారి ఎమ్మెల్యేగా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…

3 hours ago

‘కావలి’ కాచేది ఎవరో ?

ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో కాపు, కమ్మ, రెడ్ల మధ్య రాజకీయాలు నడిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా రెడ్ల…

3 hours ago