రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే సంకేతాలు ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమరం మహా రంజుగా సాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే వ్యాఖ్యలు.
మరోవైపు కాంగ్రెస్ను పక్కనపెట్టి మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ అడుగులు. అందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సాయం. ఇలా ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వచ్చే ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా పోరాడాలంటే బెంగాల్ సీఎం మమతకు దేశంలోని ప్రాంతీయ పార్టీల మద్దతు కావాలి. ఆ మద్దతు కోసం పీకే సారథ్యంలో ఆమె ప్రయత్నాలు మొదలెట్టారు. మొన్నటి వరకూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతుందని అనిపించింది. కానీ ఇప్పుడు పీకేతో పాటు మమత కూడా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ను కాదని మమత ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
మమతకు అవసరమైన వ్యూహాలు అందిస్తున్న పీకే.. ఇటు తెలంగాణ నుంచి కేసీఆర్ను ఆమెకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత తెలుసుకునేందుకు పీకే సంస్థ ఐ ప్యాక్తో కేసీఆర్ చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ విధానాలపై ప్రజల నాడీ తెలుసుకునేందుకు ఐ ప్యాక్ సర్వే చేయబోతుంది. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. పీకేతో భేటీ అయ్యారని ఆ తర్వాతే ఐ ప్యాక్ ప్రతినిధులు ప్రగతి భవన్కు వచ్చారని సమాచారం.
గతంలో కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కాగ్రెస్, బీజేపీయేతర మూడో కూటమి కోసం ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఆయన దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలను కలిశారు. కానీ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ కేంద్రం విధానాలపై పోరాటం చేస్తున్న కేసీఆర్.. మమతా బెనర్జీతో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on December 5, 2021 8:40 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…